ప్రధాన మంత్రి కార్యాలయం
మాతృభూమి పవిత్ర వారసత్వాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి..
అందరికీ సమృద్ధి కలగాలని ప్రార్థించిన ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
21 MAY 2026 9:04AM by PIB Hyderabad
సంస్కృత భాషలోని ఓ సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. ఆధ్యాత్మిక సాధన, ఆరాధనలతో పాటు ధైర్య సాహసాలకీ, శక్తికీ, సర్వజన సంక్షేమానికీ నిలయం అయిన పవిత్ర భూమిగా మన మాతృదేశం అలరారుతోందని ఆయన అన్నారు. గొప్ప వారసత్వంతో పాటు ప్రాచీన సంస్కృతికి ఆలవాలమైన ఈ పవిత్ర భూమి ఎల్లవేళలా అందరూ సుఖంతో, సమృద్ధితో వర్ధిల్లేటట్లు చేయాలని తాను మనసారా కోరుకుంటున్నానని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ :
‘‘మన మాతృభూమి.. ఉపాసన, సాధనలతో పాటు ధైర్య సాహసాలకీ, శక్తికీ, సకల జన సంక్షేమానికీ ఆటపట్టయిన పుణ్యభూమిగా నిలిచింది. వైభవోపేత వారసత్వంతోనూ, ప్రాచీన సంస్కృతితోనూ విరాజిల్లుతున్న ఈ పవిత్ర ధరిత్రి అందరినీ ఎప్పటికీ సుఖంతోనూ, సమృద్ధితోనూ పరిపూర్ణులుగా చేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను.
యస్యాం పూర్వే పూర్వజనా విచక్రిరే యస్యాం దేవా అసురానభ్యవర్తయన్
గవామశ్చానాం వయసశ్చ విష్ఠా భగం వర్చః పృథివీ నో దధాతు’’.
ఈ శ్లోకానికి.. మన పూర్వికులు ఘనమైన, పరోపకార కార్యాలను నిర్వర్తించిన, దుష్ట శక్తులను దేవతలు ఓడించిన ఈ నేల.. మన ఈ మాతృభూమి.. పశుగణం, శక్తీ పరిపూర్ణంగా ఉండే సువిశాల భూభాగాన్నీ, సమృద్ధినీ మనకు ప్రదానం చేయుగాక అని అర్థం.
****
(రిలీజ్ ఐడి: 2263634)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam