రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

వియత్నాం ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రితో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపిన రక్షణ మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 06 MAY 2026 6:29PM by PIB Hyderabad

వియత్నాం ఉప ప్రధానమంత్రిరక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ జియాంగ్‌తో మే 6, 2026న న్యూఢిల్లీలో భారత రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారుభారత్వియత్నాం మధ్య మెరుగైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిబింబించేలా ఎంతో ఆత్మీయంగావ్యూహాత్మక విశ్వాసంతో ఈ సమావేశం సాగింది.

ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న రక్షణ సహకారంపై ఇద్దరు నేతలు సమీక్షించారుఉన్నత స్థాయి చర్చలుశిక్షణా కార్యక్రమాలుసామర్థ్య పెంపుదల వంటి ద్వైపాక్షిక సంబంధాల్లో స్థిరమైన పురోగతి పట్ల సంతోషం వ్యక్తం చేశారుముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక ప్రయోజనాల విషయంలో ఇరుదేశాల మధ్య ఏకాభిప్రాయం ఉందని స్పష్టం చేశారు.

మెరుగైన సముద్ర తీర సహకారంరక్షణ పరిశ్రమల మధ్య సమన్వయ విస్తరణసంయుక్త పరిశోధనఉమ్మడి అభివృద్ధిఉమ్మడి ఉత్పత్తి కార్యక్రమాలను ప్రోత్సహించటం ద్వారా రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ చర్చలు సాగాయిఓడరేవుల సందర్శనలుసంయుక్త విన్యాసాలుసంస్థాగత చర్చా వేదికలతో సహా రక్షణ దళాల మధ్య క్రమబద్ధమైన పరస్పర చర్యల ప్రాముఖ్యతను కూడా ఇరుపక్షాలు తెలియజేశాయి.

ఈ ప్రాంతంలోని అందరి భద్రతవృద్ధి కోసం పరస్పరసమగ్ర సహకారం (మహాసాగర్భారత దార్శనికతకు అనుగుణంగావియత్నాంతో కలిసి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉందని రక్షణ మంత్రి తెలిపారుపరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయఅంతర్జాతీయ భద్రతా అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారుశాంతిస్థిరత్వంనిబంధనలతో కూడిన అంతర్జాతీయ వ్యవస్థను కొనసాగించాల్సిన ప్రాముఖ్యతను వారు స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్టులో శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇలా పేర్కొన్నారుభారత్వియత్నాం మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయటంపై చర్చలు జరిగాయని తెలిపారుఇటీవల పరిణామాలు ద్వైపాక్షిక సంబంధాల్లోని సానుకూల విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయని వెల్లడించారు.

భారత్వియత్నాం మధ్య రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకురాబోయే కాలంలో సహకారానికి నూతన మార్గాలను అన్వేషించేందుకు ఉమ్మడి నిబద్ధతను ఇరుదేశాలు స్పష్టం చేశాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2258564) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi