ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానితో శ్రీ అశోక్ కుమార్ లాహిరి భేటీ
నాడు పోస్టు చేయడమైనది:
25 APR 2026 10:43PM by PIB Hyderabad
శ్రీ అశోక్ కుమార్ లాహిరి ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా నియమితులైన ఆయనకు శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థిక శాస్త్రం, ప్రభుత్వ విధాన రంగాల్లో శ్రీ లాహిరి అపారమైన అనుభవం.. దేశ సంస్కరణల పథాన్ని మరింత పటిష్టం చేస్తుందనీ, వికసిత భారత్గా నిలవాలన్న దేశ సంకల్పాన్ని సాకారం చేయడంలోనూ దోహదపడుతుందనీ ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“శ్రీ అశోక్ కుమార్ లాహిరిని కలిశాను. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గా నియమితులైన ఆయనకు శుభాకాంక్షలు తెలిపాను. ఆర్థిక శాస్త్రం, ప్రభుత్వ విధాన రంగాల్లో ఆయనకున్న అపారమైన అనుభవం దేశ సంస్కరణల పథాన్ని మరింత పటిష్టం చేస్తుంది. వికసిత భారత్ దిశగా దేశ ప్రస్థానం వేగవంతమవుతుంది. ఆయన కృషి దేశంలో విధాన రూపకల్పనకు మరింత ఉత్తేజాన్నిస్తుందన్న దృఢమైన విశ్వాసం నాకుంది. పదవీకాలాన్ని ఫలప్రదంగా కొనసాగించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.”
(రిలీజ్ ఐడి: 2255726)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7