చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి నియామకం
నాడు పోస్టు చేయడమైనది:
22 APR 2026 9:27PM by PIB Hyderabad
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22, 2026: భారత రాజ్యాంగం అందించిన అధికారాన్ని రాష్ట్రపతి వినియోగించుకుంటూ, భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి, శ్రీమతి జస్టిస్ లీసా గిల్ను ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. శ్రీమతి జస్టిస్ లీసా గిల్ ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా సేవలను అందించారు. అంతకు పూర్వం పంజాబ్, హర్యానా ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పని చేశారు. శ్రీ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ 2026 ఏప్రిల్ 24న పదవీ విరమణ చేసిన తరువాత, 2026 ఏప్రిల్ 25 నుంచి శ్రీమతి జస్టిస్ లీసా గిల్ నియామకం అమల్లోకి వస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2254809)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9