ప్రధాన మంత్రి కార్యాలయం
హిమాచల్ దివస్ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
నాడు పోస్టు చేయడమైనది:
15 APR 2026 8:03AM by PIB Hyderabad
హిమాచల్ దివస్ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
సుసంపన్నమైన సంప్రదాయాలు, అద్వితీయమైన సాంస్కృతిక వారసత్వం, ఇక్కడి ప్రజలకున్న శ్రద్ధ, కర్తవ్య భావం, వినయం కారణంగా ఈ పవిత్ర దేవభూమి ప్రత్యేక గుర్తింపు పొందిందని ప్రధానమంత్రి అన్నారు.
ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు ఉజ్వల భవిష్యత్తు లభించాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘హిమాచల్ ప్రదేశ్ ప్రజలందరికీ హిమాచల్ దివస్ సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు. సుసంపన్నమైన సంప్రదాయాలు, అద్వితీయమైన సాంస్కృతిక వారసత్వం, ఇక్కడి ప్రజల కృషి, కర్తవ్య భావన, వినయం కారణంగా ఈ పావన దేవభూమికి విశేషమైన గుర్తింపు లభించింది. ఈ శుభ సందర్భంగా రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు ఉజ్వల భవిష్యత్తు లభించాలని ఆకాంక్షిస్తున్నాను’’.
***
(రిలీజ్ ఐడి: 2252072)
సందర్శకుల సూచీ సంఖ్య : : 23