రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ రహదారుల టోల్ ప్లాజాల వద్ద 'డిజిటల్-మాత్రమే' టోల్ వసూలు విధానం అమలు


ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున ఎన్నికల ప్రవర్తనా నియమావళి నుంచి రాష్ట్రాలకు మినహాయింపు

నాడు పోస్టు చేయడమైనది: 11 APR 2026 6:53PM by PIB Hyderabad

టోల్ వసూలులో సామర్థ్యం, పారదర్శకతను బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగు పడింది. 10.04.2026 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారుల టోల్ ప్లాజాల వద్ద అన్ని రకాల రుసుములను కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ వంటి డిజిటల్ పద్ధతుల ద్వారా మాత్రమే వసూలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎన్నికలు కొనసాగుతున్న తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున ఆయా ప్రాంతాల్లో దీనిని ప్రస్తుతానికి అమలు చేయడం లేదు.

 

***


(రిలీజ్ ఐడి: 2251302) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati