ఆయుష్
azadi ka amrit mahotsav

బయోకెమిస్ట్రీ, హెమటాలజీ విభాగాల్లో ఐఎస్ఓ 15189:2022 గుర్తింపు పొందిన తొలి సీసీఆర్ఏఎస్ సంస్థగా సీఏఆర్ఐ బెంగళూరు రికార్డు


ఏటా 1.5 లక్షలకు పైగా పరీక్షలు నిర్వహిస్తూ 50 రకాల విభాగాల్లో ఎన్‌ఏబీఎల్ గుర్తింపు సాధించిన సీఏఆర్‌ఐ

ప్రపంచ స్థాయి గుర్తింపుతో ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణకు హామీ.. నాణ్యమైన వైద్య సేవలకు ప్రమాణంగా ఆయుష్ విభాగం: శ్రీ ప్రతాపరావు జాదవ్

ఆయుష్ విభాగంలో శాస్త్రీయ ఆధారిత చికిత్సలు, పరిశోధనలను బలోపేతం చేయనున్న ఐఎస్ఓ 15189:2022 గుర్తింపు: వైద్య రాజేశ్ కొటేచా

నాడు పోస్టు చేయడమైనది: 11 APR 2026 11:01AM by PIB Hyderabad

క్లినికల్ లాబొరేటరీ, బయోకెమిస్ట్రీహెమటాలజీ విభాగాల్లో ఐఎస్ఓ 15189:2022 గుర్తింపును పొందిన బెంగళూరులోని సెంట్రల్ ఆయుర్వేద రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్ (సీఏఆర్ఐ), ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలో నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించటంలో కీలక ఘట్టంగా మారిందిఆయుర్వేద విజ్ఞాన పరిశోధనా కేంద్ర మండలి (సీసీఆర్ఏఎస్పరిధిలోని సంస్థల్లో ఈ విశిష్ట గౌరవాన్ని పొందిన తొలి సంస్థగా సీఏఆర్‌ఐ నిలిచింది.

అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా రోగులకు ఖచ్చితమైనవిశ్వసనీయసురక్షితమైన వ్యాధి నిర్ధారణ ఫలితాలను అందించడానికి ఈ గుర్తింపు హామీని ఇస్తుందిప్రాథమిక స్థాయి ఎన్ఏబీఎల్ ధ్రువీకరణ నుంచిపూర్తిస్థాయి గుర్తింపు పొందిన అత్యున్నత ప్రమాణాలు గల కేంద్రంగా ఆ ప్రయోగశాల మారటాన్ని ఈ విజయం సూచిస్తుంది.

కేంద్ర ఆయుష్ శాఖ సహాయమంత్రి (స్వతంత్ర బాధ్యతగౌరవ శ్రీ ప్రతాపరావు జాదవ్ మాట్లాడుతూ... “ఐఎస్ఓ 15189:2022 వంటి అంతర్జాతీయ గుర్తింపు ద్వారా రోగులకు అత్యంత విశ్వసనీయమైన, ఖచ్చితమైన రోగ నిర్ధారణ సేవలదుతాయిసమర్థవంతమైన చికిత్సకుమెరుగైన ఆరోగ్య ఫలితాలకు ఇవి చాలా కీలకంఆయుష్ మౌలిక సదుపాయాలను నాణ్యతవిశ్వసనీయతకు చిహ్నాలుగా మార్చటంలో మంత్రిత్వ శాఖ పురోగతిని సీఏఆర్ఐ బెంగళూరు సాధించిన ఈ విజయం స్పష్టం చేస్తోందిఅని అన్నారు.

ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా మాట్లాడుతూ.. "బయోకెమిస్ట్రీహెమటాలజీ విభాగాల్లోనూ ఐఎస్ఓ 15189:2022 గుర్తింపు పొందిన తొలి సీసీఆర్ఏఎస్ సంస్థగా సీఏఆర్ఐ బెంగళూరు నిలవటంసంప్రదాయ వైద్య విధానాలతో అత్యున్నత ప్రమాణాల నిర్ధారణ పరీక్షలను అనుసంధానించడంలో కీలక ఘట్టంఇది శాస్త్రీయ ఆధారిత చికిత్సపరిశోధనరోగుల సంక్షేమమే లక్ష్యంగా మేం చేస్తున్న కృషిని మరింత బలపరుస్తుందిఅని తెలిపారు.

సీసీఆర్ఏఎస్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ రబినారాయణ ఆచార్య మాట్లాడుతూ.. “సీఏఆర్ఐ బెంగళూరు సాధించిన ఎన్ఏబీఎల్ గుర్తింపు.. గతంలో పొందిన ఎన్ఏబీహెచ్ఎన్ఏబీఎల్ ప్రాథమిక స్థాయి ధ్రువీకరణకు మరింత బలాన్ని చేకూరుస్తోందిప్రస్తుతం కొనసాగుతున్న బీఐఎస్ ఐఎస్ఐఎస్ఓ 9001:2015 పురోగతితో పాటు ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆయుర్వేద సైన్స్ ఇంక్యుబేషన్ సెంటర్‌గా ఇది పోషిస్తున్న పాత్ర ఆయుర్వేద నాణ్యతా ప్రమాణాలను గణనీయంగా పెంచుతుందిఆయుర్వేద పరిశోధనఆవిష్కరణలను అత్యున్నత స్థాయి శాస్త్రీయ ఖచ్చితత్వంఅత్యుత్తమ ప్రమాణాల వైపు ఇది నడిపిస్తుందిఅని తెలిపారు.

బెంగళూరు సీఏఆర్ఐ అధిపతి డాక్టర్ సులోచన భట్ మాట్లాడుతూ.. "ఐఎస్ఓ 15189:2022 గుర్తింపును సాధించటం మా సంస్థకు ఎంతో గర్వకారణంరోగుల అవసరాలే లక్ష్యంగా అత్యంత నాణ్యమైనవిశ్వసనీయమైన వ్యాధి నిర్ధారణ సేవలను అందించటంలో మాకున్న అంకితభావానికి ఇది నిదర్శనంమా క్లినికల్ సామర్థ్యాన్ని పెంచడమే కాకసీసీఆర్ఏఎస్ పరిధిలోని అగ్రశ్రేణి సంస్థగా మా పాత్రను ఈ ఘనత మరింత బలోపేతం చేస్తుందిడాక్టర్ విద్యశ్రీ అంచన్ (రీసెర్చ్ ఆఫీసర్పాథాలజీ), సీఏఆర్ఐ బృందం చేసిన నిరంతర కృషి వల్లే ఇది సాధ్యమైందిఅని అన్నారు.

ప్రస్తుతం ఈ ప్రయోగశాలకు బయోకెమిస్ట్రీ, హెమటాలజీ విభాగాల్లో 50 రకాల పరీక్షలకుగానూ ఎన్ఏబీఎల్ గుర్తింపు ఉందిఇక్కడ బ్లడ్ గ్లూకోజ్హెచ్‌బీఏ1సీకాలేయంమూత్రపిండాల పనితీరుకు సంబంధించిన పరీక్షలులిపిడ్థైరాయిడ్ ప్రొఫైల్స్ఎలక్ట్రోలైట్స్కంప్లీట్ బ్లడ్ కౌంట్స్ వంటి సమగ్ర రోగ నిర్ధారణ సేవలు అందుబాటులో ఉన్నాయివీటి ద్వారా శరీరంలోని మెటబాలిక్హార్మోన్ల సమతుల్యతరక్తానికి సంబంధించిన సమస్యలను అత్యంత ఖచ్చితత్వంతో అంచనా వేసేందుకు వీలుంటుంది.

2025-26లో ఈ ప్రయోగశాల 9,300 మందికి పైగా రోగులకు సేవలందిస్తూ, 1.52 లక్షలకు పైగా వైద్య పరీక్షలు చేసిందిఇది పెరుగుతున్న ఆ సంస్థ సామర్థ్యాన్నినాణ్యమైన రోగ నిర్ధారణ సేవల పట్ల వారికున్న నిబద్ధతను తెలియజేస్తుందిఅత్యాధునిక సాంకేతిక వ్యవస్థలుడిజిటల్ రిపోర్టింగ్ సాధనాలు అందుబాటులో ఉండటం వల్ల రోగులకు పరీక్షా ఫలితాలు వేగంగా అందడమే కాక.. ఖచ్చితత్వమూ పెరిగిందిఎస్‌ఎంఎస్‌ఈమెయిల్వాట్సాప్ ద్వారా రోగులు రిపోర్టులను పొందే సదుపాయం కూడా ఉంది.

క్లినికల్, పరిశోధనరోగ నిర్ధారణ సేవల్లో ఈ సంస్థ సాధిస్తున్న నిరంతర వృద్ధిని ఈ విజయం మరింత స్పష్టం చేస్తోంది. 2021లో 18,918గా ఉన్న ఓపీడీ రోగుల సంఖ్య.. 2026 నాటికి 51,300 దాటిందిఇది ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసాన్నిసంస్థ విస్తృతిని ప్రతిబింబిస్తోందిప్రయోగశాలలోని పరీక్షల సంఖ్యలోనూ అద్భుతమైన వృద్ధి కనిపిస్తోంది. 2021లో కేవలం 2,770గా ఉన్న పరీక్షలు, 2026 నాటికి 1.55 లక్షలకు పైగా పెరిగాయిఇది ఆ సంస్థ మెరుగైన రోగ నిర్ధారణ సామర్థ్యాన్ని చాటిచెబుతోందిపంచకర్మపారా-సర్జికల్ ప్రక్రియలు దాదాపు ఇరవై రెట్లు విస్తరించాయిపరిశోధనా కార్యకలాపాలు కూడా ఏటా 20-25 ప్రాజెక్టులతో స్థిరంగాపటిష్టంగా కొనసాగుతున్నాయిజూలై 2024లో ఇన్‌పేషెంట్ సేవలు ప్రారంభమైనప్పటి నుంచి బెడ్ ఆక్యుపెన్సీ దాదాపు పూర్తి స్థాయికి చేరుకుందిసమగ్ర వైద్య సేవలకు పెరుగుతున్న ఆదరణను ఇది సూచిస్తుందిఅంతేకాకఔషధ మొక్కల ధ్రువీకరణలో ఈ సంస్థ పాత్రను బలోపేతం చేసుకుందికొన్నేళ్లుగా మొక్కల ప్రామాణీకరణ పనులను గణనీయంగా పెంచింది.

ఈ విజయం సాధించటానికి సంస్థ నిరంతర కృషి, సంస్థాగత నిబద్ధతే కారణంప్రారంభంలో సెమీ-ఆటోమేటెడ్ బయోకెమిస్ట్రీ అనలైజర్‌తో మొదలైన ఈ ప్రయోగశాలనుఆయుష్ మంత్రిత్వ శాఖ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కీమ్ ద్వారా పూర్తిస్థాయి ఆటోమేటెడ్ వ్యవస్థలతో ఆధునీకరించారునవంబర్ 2022లో ఎన్ఏబీఎల్ ప్రాథమిక స్థాయి ధ్రువీకరణ పొందిన తర్వాత కఠినమైన నాణ్యత ప్రమాణాలుపక్కా డాక్యుమెంటేషన్క్షుణ్ణమైన అంచనా ప్రక్రియల ద్వారా ఉన్నతమైన ఐఎస్ఓ 15189:2022 ప్రమాణాల స్థాయికి ఈ ప్రయోగశాల ఎదిగింది.

వైద్యపరమైన నిర్ణయాలు తీసుకోవటానికి విశ్వసనీయమైన రోగ నిర్ధారణ సమాచారాన్ని అందించటం, రోగులు కోలుకునే క్రమాన్ని పర్యవేక్షించటంపరిశోధన ఫలితాలను మరింత బలోపేతం చేయటం ద్వారా ఆయుర్వేదఆయుష్ ఆధారిత చికిత్సలకు మద్దతునివ్వటంలో ఈ ప్రయోగశాల కీలక పాత్ర పోషిస్తోంది.

2021-22లోనే ఎన్ఏబీహెచ్ఎన్ఏబీఎల్ ప్రాథమిక స్థాయి ధ్రువీకరణను పొందిన తొలి సీసీఆర్ఏఎస్ సంస్థగా బెంగళూరు సీఏఆర్ఐ నిలిచిందిప్రస్తుతం బీఐఎస్ ఐఎస్ఐఎస్ఓ 9001:2015 గుర్తింపు దిశగా ఇది అడుగులు వేస్తోందినాణ్యతఖచ్చితత్వంఅత్యుత్తమ ప్రమాణాల పట్ల ఈ సంస్థకున్న నిబద్ధతను ఇది మరింత బలపరుస్తుంది.

గుర్తింపు పొందిన పరీక్షల సంఖ్యను భవిష్యత్తులో మరింతగా పెంచాలని, రోగ నిర్ధారణ సామర్థ్యాలను మెరుగుపరచాలని ఈ సంస్థ యోచిస్తోందిదీనిద్వారా ప్రజలకు సమగ్రమైనసులభంగా అందుబాటులో ఉండేతక్కువ ఖర్చుతో కూడిన ఆరోగ్య సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2251289) సందర్శకుల సూచీ సంఖ్య : : 24
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Kannada