అణుశక్తి విభాగం
azadi ka amrit mahotsav

తొలిదశను దాటిన తమిళనాడులోని కల్పకం మోడల్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్

నాడు పోస్టు చేయడమైనది: 07 APR 2026 11:17AM by PIB Hyderabad

భారత అణు విద్యుత్ కార్యక్రమంలో కీలకమైన విజయం నమోదయిందిదీర్ఘకాల విద్యుత్ భద్రతను అందించడంలోస్వదేశీ అణు పరిజ్ఞాన సాంకేతికతలను ముందుకు తీసుకెళ్లడంలో సాధించిన విజయాన్ని సూచిస్తూ.. 2026 ఏప్రిల్ రాత్రి 8.25కు 500 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యమున్న ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (పీఎఫ్‌బీఆర్విజయవంతంగా తొలి క్రిటికాలిటీని సాధించింది (నియంత్రిత అణు విచ్ఛిత్తి గొలుసు చర్య ప్రారంభమైంది).  

డీఏఈ కార్యదర్శిఏఈసీ ఛైర్మన్ డాక్టర్ అజిత్ కుమార్ మహంతిఐజీసీఏఆర్ డైరెక్టర్ శ్రీ శ్రీకుమార్ జీ పిళ్లైభావిని సీఎండీ ఇన్‌చార్జి శ్రీ అల్లు అనంత్భావిని మాజీ సీఎండీహోమీ సేత్నా ఛైర్మన్ శ్రీ కేవీ సురేష్ కుమార్ సమక్షంలో తొలి క్రిటికాలిటీ ప్రారంభమైందిఅణు విద్యుత్ నియంత్రణా బోర్డు (ఏఈఆర్‌బీనిబంధనలను పాటించడంతో ఇది సాధ్యమైందిప్లాంటు వ్యవస్థల భద్రతను క్షుణ్నంగా సమీక్షించిన అనంతరం అవసరమైన అనుమతులను ఏఈఆర్‌బీ జారీ చేసింది.

పీఎఫ్‌బీఆర్‌కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్నినమూనాను ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చి (ఐజీసీఏఆర్), అణుశక్తి విభాగానికి చెందిన ఆర్ అండ్ డీ సెంటర్ దేశీయంగా అభివృద్ధి చేశాయిఅణుశక్తి విభాగంలోని ప్రభుత్వ రంగం సంస్థ అయిన భారతీయ నభికీయ విద్యుత్ నిగమ్ (భావినిదీనిని నిర్మించిప్రారంభించింది.

భారత్ అనుసరిస్తున్న దీర్ఘకాల అణు వ్యూహంలో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు అత్యంత ప్రధానమైనవిసంప్రదాయ థర్మల్ రియాక్టర్లలా కాకుండాయురేనియం-ఫ్లుటోనియం కలిపిన ఆక్సైడ్ (ఎంవోఎక్స్ఇంధనాన్ని పీఎఫ్‌బీఆర్ ఉపయోగిస్తుందిపీఎఫ్‌బీఆర్ కోర్ చుట్టూ యురేనియం-238 పొర ఉంటుందివేగవంతమైన న్యూట్రాన్లు శుద్ధి చేసిన యురేనియం-238ను విచ్ఛిన్నమయ్యే ప్లూటోనియం-239గా మారుస్తాయిదీనివల్ల రియాక్టర్ వినియోగించుకొనే దానికంటే అధిక ఇంధనాన్ని ఉత్పత్తి చేయగలుగుతుందిక్రమంగా బ్లాంకెట్‌లో థోరియం-232ను ఉపయోగించేలా ఈ రియాక్టర్‌ను రూపొందించారుథోరియం-232 ను యురేనియం-233గా మారుస్తారుఇది భారతదేశ అణు విద్యుత్ కార్యక్రమ మూడో దశను వేగవంతం చేస్తుంది.

ఈ ప్రత్యేకమైన సామర్థ్యం.. అణు ఇంధన వనరుల వినియోగాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందిఅదేవిధంగా పరిమిత యురేనియం నిల్వల నుంచి మరింత ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేసేందుకుఅదే సమయంలో భవిష్యత్తులో థోరియంను భారీ స్థాయిలో వినియోగించుకొనేందుకు మార్గం సుగమం అవుతుంది.

తొలి క్రిటికాలిటీని సాధించడంతోమూడు దశల అణు విద్యుత్ కార్యక్రమానికున్న పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకొనే దిశగా భారత్ మరింత ముందుకు సాగిందిప్రస్తుత ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ల సముదాయానికిభవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే థోరియం ఆధారిత రియాక్టర్లకు మధ్య ఒక కీలకమైన వారధిగా ఫాస్ట్ బ్రీడర్ టెక్నాలజీ నిలుస్తుందిదీనివల్ల దీర్ఘకాలిక శుద్ధ ఇంధన ఉత్పత్తి కోసం దేశంలో సమృద్ధిగా ఉన్న థోరియం వనరులను సద్వినియోగం చేసుకోవచ్చు.

భారత దేశానికున్న దేశీయ నమూనాఇంజినీరింగ్తయారీ వ్యవస్థల సామర్థ్యాన్ని ఈ విజయం ప్రదర్శిస్తుందిఈ రియాక్టర్లో అధునాతన రక్షణ వ్యవస్థలుఅధిక ఉష్ణోగ్రత కలిగిన ద్రవ సోడియంతో చల్లబరిచే సాంకేతిక పరిజ్ఞానంఅణు పదార్థాల పునర్వినియోగాన్ని సాధ్యం చేసే క్లోజ్డ్ ఫ్యూయల్ సైకిల్ విధానం ఉన్నాయితద్వారా ఇది సుస్థిరతను మెరుగుపరిచివ్యర్థాలను తగ్గిస్తుంది.

 

దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్నివస్తువులను ఉపయోగించి నమూనారూపకల్పననిర్మాణంలో భాగమైన అనేక మంది శాస్త్రవేత్తలుఇంజినీర్లుటెక్నీషియన్లుపారిశ్రామిక భాగస్వాముల అంకితభావాన్ని ఈ ప్రాజెక్టు ప్రతిబింబిస్తుందివారి ప్రయత్నాలు.. అధునాతన న్యూక్లియర్ ఇంజినీరింగ్‌లో పెరుగుతున్న దేశ సామర్థ్యాన్నిఆత్మనిర్భర భారత్‌ లక్ష్యానికి అనుగుణంగా సాంకేతిక స్వావలంబన సాధించే భారత దేశ నిబద్ధతను తెలియజేస్తున్నాయి.  

విద్యుదుత్పత్తి పరిధిని దాటి.. న్యూక్లియర్ ఫ్యూయల్ సైకిల్ టెక్నాలజీఅధునాతన పదార్థాలురియాక్టర్ ఫిజిక్స్భారీ స్థాయి ఇంజినీరింగ్‌లో వ్యూహాత్మక సామర్థ్యాలను ఫాస్ట్ బ్రీడర్ కార్యక్రమం బలోపేతం చేస్తుంది.

శుద్ధ ఇంధన పోర్ట్‌ఫోలియోను భారత్ విస్తరిస్తున్న నేపథ్యంలో అత్యధిక ఉష్ణ సామర్థ్యంతో విశ్వసనీయమైనతక్కువ కర్భన ఉద్ఘారాలున్నబేస్-లోడ్ విద్యుత్‌ను అందించడంలో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు కీలకపాత్ర పోషిస్తాయిమొదటి క్రిటికాలిటీని సాధించడం సాంకేతికపరమైన విజయం మాత్రమే కాకుండా.. వికసిత భారత్ కోసం సుస్థిరమైనస్వయం సమృద్ధి సాధించిన  ఇంధన భవిష్యత్తు దిశగా వేసిన ముఖ్యమైన అడుగును సూచిస్తుంది.

***


(రిలీజ్ ఐడి: 2249675) సందర్శకుల సూచీ సంఖ్య : : 28
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Tamil