జాతీయ మానవ హక్కుల కమిషన్
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో ఫిబ్రవరి మధ్య కాలం నుంచి ఇప్పటి వరకు కల్తీ పాలు తాగి

16 మంది మృతి చెందారన్న వార్తా కథనాన్ని సుమోటోగా తీసుకున్న భారత ఎన్‌హెచ్‌ఆర్‌సీ

రెండు వారాల్లోగా ఈ ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ

బాధితుల ఆరోగ్య పరిస్థితి, దర్యాప్తు వివరాలు, మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు నష్ట పరిహారం చెల్లించి ఉంటే

వాటి వివరాలను నివేదికలో పొందుపరచాలని ఆదేశం

నాడు పోస్టు చేయడమైనది: 26 MAR 2026 11:27AM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా లాలాచెరువుచౌడేశ్వరీ నగర్స్వరూప్ నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు తాగటం వల్ల ఫిబ్రవరి మధ్య నుంచి ఇప్పటి వరకు 16 మంది మరణించినట్లు మీడియాలో వచ్చిన వార్తా కథనాలను భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీసుమోటోగా స్వీకరించిందిమీడియా కథనం ప్రకారం.. ఒకే లక్షణాలతో బాధపడుతున్న నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారుపాలల్లో విషపూరిత రసాయనమైన ఇథిలీన్ గ్లైకాల్‌ను కలవటం వల్ల శరీరంలోని పలు అవయవాల పనితీరు దెబ్బతిన్నట్లు తెలుస్తోందినర్సాపురం గ్రామంలోని ఒక డెయిరీలో ఈ కల్తీ జరగ్గా.. ఆ డెయిరీ ద్వారా పరిసర ప్రాంతాల్లోని దాదాపు 100 ఇళ్లకు పాల సరఫరా అవుతాయి.

వార్త కథనంలోని అంశాలు నిజమైతేబాధితుల మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లేనని కమిషన్ తెలిపిందిరెండు వారాల్లోగా ఈ ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిడీజీపీకి నోటీసులు జారీ చేసిందిబాధితుల ఆరోగ్య పరిస్థితిదర్యాప్తు వివరాలుమృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు నష్ట పరిహారం చెల్లించి ఉంటేవాటి వివరాలను నివేదికలో పొందుపరచాలని కమిషన్ ఆదేశించింది.

మార్చి 23, 2026 నాటి మీడియా నివేదిక ప్రకారం.. ఫిబ్రవరి నెల మధ్య కాలంలో ప్రజలు అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోందిఆ సమయంలో బాధితులు కడుపునొప్పివాంతులుమూత్రం రాకపోవటంమూత్రపిండాల పనితీరులో లోపం వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారుబాధితుల్లో ఎక్కువ మంది వృద్ధులుచిన్న పిల్లలే ఉన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2245656) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी