ప్రధాన మంత్రి కార్యాలయం
రామ నవమి సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
प्रविष्टि तिथि:
26 MAR 2026 12:11PM by PIB Hyderabad
పవిత్ర రామ నవమి సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగం, తపస్సు, నిగ్రహానికి మారుపేరైన మర్యాద పురుషోత్తముడు రాముని జీవితం.. ఎలాంటి పరిస్థితినైనా స్థైర్యం, సంకల్పంతో ఎదుర్కొనే స్ఫూర్తిని ప్రజలకు ఇస్తుందని శ్రీ మోదీ చెప్పారు.
శ్రీరాముని ఆదర్శాలకున్న గొప్పతనాన్ని ప్రధాని వివరించారు. అవి భారతీయులకు మాత్రమే కాకుండా మొత్తం మానవాళికి ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా రాశారు:
‘‘దేశ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. త్యాగం, తపస్సు, నిగ్రహానికి మారుపేరైన మర్యాద పురుషోత్తముని జీవితం.. మనకు ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది. ఆయన ఆదర్శాలు భారతీయులకే కాకుండా మానవాళి మొత్తానికి ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేస్తాయి. శ్రీరాముని కృపతో అందరికీ మేలు కలగాలని, తద్వారా వికసిత, ఆత్మనిర్భర భారత్ లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నాను.’’
(रिलीज़ आईडी: 2245655)
आगंतुक पटल : 50
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam