హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విపత్తుల నిర్వహణలో శ్రేష్ఠత్వాన్ని గుర్తిస్తున్న సుభాష్ చంద్ర బోస్ ఆపదా ప్రబంధన్ పురస్కార్


• విపత్తులను నిరోధించే, విపత్తులను ఎదుర్కోవడానికి సన్నద్ధమయ్యే, విపత్తులకు ప్రతిస్పందించే,

విపత్తుల నుంచి తిరిగి తేరుకునేలా దేశ శక్తియుక్తుల్ని పటిష్ఠపరిచే అత్యుత్తమ పద్ధతుల్నీ, మార్గదర్శక కృషినీ

పది మందికీ చాటిచెప్పడానికే ఈ అవార్డు

• ఏడాది పొడవునా నామినేషన్లు సమర్పించవచ్చు.. దరఖాస్తుల్ని నేషనల్ అవార్డ్‌స్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దాఖలు చేయాలి... స్వీయ నామినేషన్‌నీ, మూడో పక్షం నామినేషన్‌కీ అవకాశం

నాడు పోస్టు చేయడమైనది: 23 MAR 2026 5:02PM by PIB Hyderabad

సుభాష్ చంద్ర బోస్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా జనవరి 23న ప్రకటించే ‘సుభాష్ చంద్ర బోస్ ఆపదా ప్రబంధన్ పురస్కార్’ ఒక ప్రతిష్ఠాత్మక జాతీయ గౌరవంవిపత్తుల నిర్వహణ రంగంలో వ్యక్తులుసంస్థలందించే అమూల్య సేవలను గుర్తింపుగా ఈ అవార్డును ఇస్తున్నారువిపత్తులను నిరోధించేవిపత్తులను ఎదుర్కోవడానికి సన్నద్ధమయ్యేవిపత్తులకు ప్రతిస్పందించేవిపత్తుల నుంచి తిరిగి తేరుకునేలా దేశ శక్తియుక్తుల్ని పటిష్ఠపరిచే అసాధారణ కృషినీసర్వోత్తమ పద్ధతుల్నీ లోకానికి వెల్లడించాలనే సంకల్పంతో ఈ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  
విపత్తుల నిరోధంవిపత్తు ప్రసరించే ప్రభావాన్ని తగ్గించే దిశగా చర్యలు చేపట్టడంవిపత్తును సమర్థంగా ఎదుర్కోవడానికి సన్నద్ధం కావడంవిపత్తు వేళల్లో తగిన విధంగా ప్రతిస్పందన చర్యలు తీసుకోవడంసహాయ-పునరావాస చర్యలుపునర్నిర్మాణంపరిశోధననూతన ఆవిష్కరణముందస్తు హెచ్చరిక వ్యవస్థల కల్పనసమాజాన్ని చైతన్యపరచడంసామర్థ్యాలను పెంపొందించే చర్యలు సహా విపత్తు నిర్వహణకు సంబంధించిన అన్ని కోణాల్లోనూ అసాధారణ సేవలను అందించే వర్గాల్ని ఈ పురస్కారం గుర్తిస్తుంది. నూతన ఆవిష్కరణలనూఉత్తమ పద్ధతులనూ వెన్ను తట్టి ప్రోత్సహించడంసురక్షిత విపత్తు వేళ ఆటుపోటులకు తట్టుకుని నిలిచేదిగా భారత్ ను తీర్చిదిద్దే దిశగా తోడ్పడాల్సిందిగా వ్యక్తులకూసంస్థలకూ స్ఫూర్తిని అందించడం ఈ అవార్డు లక్ష్యాలువిపత్తు నష్టభయాన్ని తగ్గించడంతో పాటు మానవతాపూర్వక ప్రతిస్పందనల్లో అసాధారణ ప్రయత్నాలను గుర్తించి పండగ చేసుకోవడం కోసం ఈ పురస్కారాన్ని ఉద్దేశించారుఇది విజయవంతమైన నమూనాలను లోకానికి వెల్లడి చేయడంలోనూజాతీయ విపత్తు విరుచుకుపడే సందర్భాల్లో మరింత ఎక్కువ మందికి ప్రేరణ ఇవ్వడానికి ఈ అవార్డు దోహదం చేస్తుంది.  
పురస్కార కేటగిరీలు
• వ్యక్తి పరంగా ప్రశంస పత్రంపతకం
• సంస్థ పరంగా ప్రశంస పత్రంఫలకం
ఎవరు దరఖాస్తు పెట్టుకోవచ్చుఎవరిని నామినేట్ చేయొచ్చు?
అర్హత కలిగిన నామినీలు ఎవరెవరంటే
• వ్యక్తులు
• సంస్థలు
• జాతీయ స్థాయిరాష్ట్ర స్థాయి సంస్థలు
• జిల్లా అధికారులు
• పరిశోధనవిద్యా సంస్థలు
• ప్రభుత్వేతర సంస్థలుపౌర సమాజ సంస్థలు

• ప్రయివేట్ రంగ సంస్థలు

భారతీయ పౌరులతో పాటు సంస్థలూ ఈ పురస్కారానికి అర్హమైనవే.

నామినేషన్ ప్రక్రియ
• నామినేషన్లను సంవత్సరమంతా స్వీకరిస్తారు
• దరఖాస్తుల్ని జాతీయ పురస్కారాల పోర్టల్ https://awards.gov.in ద్వారా ఆన్‌లైన్లోనే సమర్పించాలి.

• స్వీయ నామినేషన్‌నూఅలాగే థర్డ్-పార్టీ నామినేషన్లను కూడా అనుమతిస్తారు.

 

***


(రిలీజ్ ఐడి: 2244210) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Punjabi , Gujarati