ప్రధాన మంత్రి కార్యాలయం
దేవీ ఆరాధనతో ప్రాప్తించే దివ్య వాతావరణాన్నీ, ఆధ్యాత్మిక ఆనందాన్నీ ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
23 MAR 2026 8:50AM by PIB Hyderabad
నవ రాత్రులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యం విషయంలో స్వీయ ఆలోచనల్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. దేవీ మాత ఆరాధనతో అపార శాంతీ, శక్తీ లభిస్తాయని స్పష్టం చేశారు. దేవిని స్తుతించే ఒక భక్తి గీతాన్ని శ్రీ మోదీ పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘మా అంబే ఆరాధనతో భక్తిపూర్వక అద్భుత ఆనందాన్ని పొందవచ్చు. ఈ మార్గాన్ని అనుసరించడం వల్ల మనస్సుకు అంతులేని శాంతితో పాటు ఆత్మశక్తి కూడా లభిస్తుంద’’ని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2243863)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9