నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ నైపుణ్య కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దే ప్రణాళిక

నాడు పోస్టు చేయడమైనది: 16 MAR 2026 3:26PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ స్కిల్ ఇండియా మిషన్ (ఎస్ఐఎంకింద వివిధ పథకాల పరిధిలో నిర్వహిస్తున్న కేంద్రాల ద్వారా నైపుణ్య శిక్షణను నైపుణ్యాభివృద్ధిఔత్సాహిక పారిశ్రామిక మంత్రిత్వ శాఖ అందిస్తోందివీటి ద్వారా అన్ని వర్గాలకు చెందిన వారికీ తమ నైపుణ్యాలను మెరుగుపరచుకొనేందుకు అవసరమైన శిక్షణ లభిస్తుందిప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై), జన శిక్షణ సంస్థాన్ (జేఎస్ఎస్), నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (ఎన్ఏపీఎస్), పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ)ల్లో చేపడుతున్న క్రాఫ్ట్స్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్ (సీటీఎస్వంటి పథకాల పరిధిలో ఈ నైపుణ్య కేంద్రాలను నిర్వహిస్తున్నారుభవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా భారతీయ యువతకు పారిశ్రామిక నైపుణ్యాలను అందించడమే ఈ ఎస్ఐఎం లక్ష్యం.

పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ ప్రణాళిక రూపకల్పనకుదానిని అమలు చేసేందుకు ఎంఎస్‌డీఈ దిగువ పేర్కొన్న చర్యలను చేపట్టింది.

  • సాంకేతికవృత్తి విద్యా శిక్షణ (టీవీఈటీరంగంలో నాణ్యతకు భరోసానిచ్చేలా నిబంధనలనుప్రమాణాలను రూపొందించే నియంత్రణా సంస్థగా నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీవీఈటీ)ను ఏర్పాటు చేశారుపారిశ్రామిక సంస్థలను అవార్డింగ్ బాడీ (ఏబీ)లుగా లేదా అసెస్మెంట్ ఏజెన్సీ (ఏఏ)లుగా ఎన్‌సీవీఈటీ గుర్తిస్తుంది.

  • పరిశ్రమల్లో ఉన్న డిమాండ్‌కు తగ్గట్టుగా అర్హతలను అవార్డింగ్ సంస్థలు రూపొందిస్తాయిఅలాగే జాతీయ వృత్తుల వర్గీకరణ-2015 ప్రకారంగుర్తించిన వృత్తులతో వాటిని అనుసంధానించాల్సి ఉంటుందివాటికి పరిశ్రమ ధ్రువీకరణ అవసరంపరిశ్రమ అవసరాల ప్రకారం 9026 కోర్సులను ఎన్‌సీవీఈటీ ఆమోదించిందివాటిలో 2599 చెల్లుబాటు అయ్యేవిగాక్రియాశీలకంగా ఉన్నాయిమిగిలిన 6,427ను ఆర్కైవ్ చేశారు.

  • వాస్తవ పారిశ్రామిక వాతావరణంలో ఐటీఐ విద్యార్థులకు శిక్షణ అందించడానికి పరిశ్రమల సహకారంతో ఫ్లెక్సీ ఎంవోయూ పథకాన్నిడ్యూయల్ ట్రైనింగ్ సిస్టమ్ (డీఎస్టీ)లను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (డీజీటీఅమలు చేస్తోంది.

  • రాష్ట్రప్రాంతీయ స్థాయిలోని విద్యాసంస్థలకు పరిశ్రమలతో సంబంధాలను ఏర్పాటు చేయడానికి ఐబీఎంసిస్కోమైక్రోసాఫ్ట్ఏడబ్ల్యూఎస్ఆటోడెస్క్ తదితర ఐటీ సంస్థలతో అవగాహనా ఒప్పందాలను డీజీటీ కుదుర్చుకుంది. ఆధునిక పరిజ్ఞానాల్లో సాంకేతికవృత్తిపరమైన నైపుణ్య శిక్షణను అందించడంలో ఈ ఒప్పందాలు సహపడతాయి.

  • పీఎంకేవీవై పరిధిలో భవిష్యత్తు మార్కెట్టుపరిశ్రమ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏఐ/ఎంఎల్రోబోటిక్స్మెకట్రానిక్స్డ్రోన్ టెక్నాలజీగ్రీన్ టెక్అడ్వాన్స్డ్ మ్యానుఫాక్చరింగ్ తదితర రంగాల్లో ఇండస్ట్రీ 4.0 అవసరాలకు అనుగుణంగా ఆధునిక నైపుణ్యాలతో కూడిన ఉద్యోగాలను ప్రత్యేకంగా రూపొందించారు.

  • 5జీ నెట్‌వర్క్ టెక్నీషియన్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్సైబర్ సెక్యూరిటీ అసిస్టెంట్డ్రోన్ టెక్నీషియన్సోలార్ టెక్నీషియన్ వంటి నూతన ఉద్యోగాలకు శిక్షణ అందించేందుకు సీటీఎస్ పరిధిలో అత్యాధునికమైన/భవిష్యత్తు అవసరాలకు తగిన నైపుణ్య కోర్సులను డీజీటీ ప్రవేశపెట్టింది.

  • ఆయా రంగాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాల నాయకత్వంలో 36 సెక్టార్ స్కిల్ కౌన్సిల్ (ఎస్ఎస్‌సీ)లను ఏర్పాటు చేశారుఇవి సంబంధిత రంగాలకు అవసరమైన నైపుణ్య అవసరాలను గుర్తించినైపుణ్య సామర్థ్య ప్రమాణాలను నిర్దేశిస్తాయి.

  • కొత్తగా పుట్టుకొస్తున్న ఆర్థిక అవకాశాలకు అనుగుణంగాపారిశ్రామిక అవసరాలకు తగిన నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని సిద్ధం చేసే లక్ష్యంతో అహ్మదాబాద్ముంబయిల్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో రెండు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్‌ (ఐఐఎస్సంస్థలను ఏర్పాటు చేశారు.

2023 నాటి జీ20 న్యూఢిల్లీ నాయకుల ప్రకటన ప్రకారం వివిధ దేశాల్లో నైపుణ్యాలను అర్హతలను పోల్చదగినవిగాపరస్పరం గుర్తించేలా ప్రయత్నాలు కొనసాగుతున్నాయిఅవసరమైన నైపుణ్యాలుఅర్హతలతో ఉద్యోగాలను అనుసంధానించేలా అంతర్జాతీయ ప్రామాణిక విధానాన్ని అభివృద్ధి చేయడంలో సాధ్యాసాధ్యాల అధ్యయనానికి అంతర్జాతీయ కార్మిక సంస్థతో కార్మికఉపాధి మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది.

నైపుణ్యాభివృద్ధివృత్తి విద్యశిక్షణ రంగాల్లో సహకారం కోసం భాగస్వామ్య దేశాలతో ఎంఎస్‌డీఈ ఒప్పందాలు కుదుర్చుకుందిప్రస్తుతం ఆస్ట్రేలియాడెన్మార్క్ఫ్రాన్స్జర్మనీజపాన్ఖతార్సింగపూర్యూఏఈ మొత్తం దేశాలతో క్రియాశీలక ఒప్పందాలను ఎంఎస్‌డీఈ కలిగి ఉందిదేశీయఅంతర్జాతీయ కార్మిక మార్కెట్లలో భారతీయ శ్రామిక శక్తికి ఉద్యోగావకాశాలను విస్తరించే లక్ష్యంతో సాంకేతిక మార్పిడిసహకారాత్మక శిక్షణ కార్యక్రమాలుఉత్తమ పద్ధతులను పంచుకొనే వీలును ఈ ఒప్పందాలు అందిస్తాయిఅలాగే నైపుణ్యాలుఅర్హతలకు గుర్తింపు సాధించే దిశగా ప్రయత్నిస్తాయివిదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంతకం చేసిన వలసతరలింపు భాగస్వామ్య ఒప్పందాల్లో ఎంఎస్‌డీఈ ముఖ్యమైన భాగస్వామిగా ఉందిద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా నైపుణ్యాలున్న వారు విదేశాలకు సులభంగా వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వాలతో ఎంఎస్‌డీఈ సమయానుగుణంగా కలసి పనిచేస్తుంది.

విదేశాల్లో ఉద్యోగ అవకాశాలకు తగినట్టుగా భారతీయ యువతను సిద్ధం చేసేందుకు బెంగళూరుభువనేశ్వర్గువాహటిహైదరాబాద్కాన్పూర్లూథియానావారణాసిల్లో స్కిల్ ఇండియా అంతర్జాతీయ కేంద్రాలు (ఎస్ఐఐసీ)ను ఎంఎస్‌డీఈ ఏర్పాటు చేసిందినైపుణ్య కార్మికులు సురక్షితంగాపూర్తి అవగాహనతో విదేశాలకు వెళ్లేలా తోడ్పాటును అందించేందుకు.. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డొమైన్ స్కిల్ శిక్షణభాషా శిక్షణ అందించడంవిదేశాలకు వెళ్లే ముందు అవగాహనను కల్పించడమే ఈ కేంద్రాల ప్రధాన లక్ష్యం.

దీనికి అదనంగాఈ కేంద్రాల్లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన (పీకేవీవైపరిధిలో ప్రీ-డిపార్చర్ ఓరియెంటేషన్ శిక్షణ (పీడీవోటీఅందిస్తారుతాము వెళ్లాలనుకొనే దేశాలకు సంబంధించిన భాషసాంస్కృతిక అంశాలుకార్మిక చట్టాలుసురక్షిత వలస పద్ధతులపై అభ్యర్థులకు అవగాహన కల్పిస్తారు..

ఈ సమాచారాన్ని నైపుణ్యాభివృద్ధిఔత్సాహిక పారిశ్రామిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదాశ్రీ జయంత్ చౌధరి ఈ సమాచారాన్ని లోక్‌సభలో లిఖితపూర్వకంగా అందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2240961) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali