యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ సమగ్రత, సాంస్కృతిక అవగాహనను ప్రోత్సహించడానికి మై భారత్ యువజన కార్యక్రమాలు

నాడు పోస్టు చేయడమైనది: 16 MAR 2026 4:43PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా యువతలో జాతీయ సమైక్యతసాంస్కృతిక అవగాహననునాయకత్వ లక్షణాలను పెంపొందించడమే మేరా యువ భారత్ (మై భారత్అమలు చేస్తున్న యువజన కార్యక్రమాల లక్ష్యంయువతకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సహచరులతో మాట్లాడుకోవడానికీవిభిన్న సంస్కృతులను అర్థం చేసుకునేందుకుఅభివృద్ధి కార్యక్రమాలతోపాటు ఉపాధి అవకాశాల గురించి అవగాహన పెంచుకోవడానికి ఈ కార్యక్రమాలు వేదికగా నిలుస్తాయి.

 

ప్రస్తుతం మై భారత్ అమలు చేస్తున్న యువజన కార్యక్రమాల్లో అంతర్ రాష్ట్ర యువజన కార్యక్రమం (ఐఎస్‌వైఈపీ), అంతర్ జిల్లా యువజన కార్యక్రమం (ఐడీవైఈపీఉన్నాయివీటితో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహకారంతో గిరిజన యువజన కార్యక్రమం (టీవైఈపీ), కాశ్మీరీ యువజన కార్యక్రమాలను కూడా మై భారత్ నిర్వహిస్తోంది.

 

2023–24 ఆర్థిక సంవత్సరంలో మై భారత్ వార్షిక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా యువజన కార్యక్రమాలు ఏవీ లేవుఅయితే 2024–25 ఆర్థిక సంవత్సరంలో అంతర్ రాష్ట్రఅంతర్ జిల్లా యువజన కార్యక్రమాలను మై భారత్ వార్షిక కార్యాచరణ ప్రణాళికలో చేర్చారు. 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాల్లో హోం మంత్రిత్వ శాఖ సహకారంతో గిరిజన యువజన (టీవైఈపీకాశ్మీరీ యువజన (కేవైఈపీకార్యక్రమాలను మై భారత్ విజయవంతంగా అమలు చేసింది.

 

2024-25లో దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాల వివరాలు..

 

S. No.

Name of Programme

No. of Programmes
Conducted

No. of  Participants

 

 

1

Inter District Youth Exchange Programme (IDYEP)

89

2247

 

2

Inter State Youth Exchange Programme (ISYEP)

58

1447

 

3

Tribal Youth Exchange Programme (TYEP)

24

4787

 

4

Kashmiri Youth Exchange Programme (KYEP)

30

3438

 

 

Grand Total

201

11919

 

మై భారత్ నిర్వహించే యువజన కార్యక్రమాల లక్ష్యాలుప్రధాన అంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

అంతర్ రాష్ట్ర యువజన కార్యక్రమం (ఐఎస్‌వైఈపీ):

వివిధ రాష్ట్రాలకు చెందిన యువత మధ్య జాతీయ సమగ్రతసాంస్కృతిక మార్పిడిపరస్పర అవగాహనను పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యంఇది క్షేత్రస్థాయి సందర్శనలుభాష నేర్చుకోవడంఆహారపు అలవాట్లను పంచుకోవడంసాంస్కృతిక కార్యక్రమాలుఉత్తమ పద్ధతుల ద్వారా పరస్పర పరిచయాలకు వేదికగా నిలుస్తుంది.

 

అంతర్ జిల్లా యువజన కార్యక్రమం (ఐడీవైఈపీ):

వివిధ జిల్లాలకు చెందిన యువత మధ్య ఆలోచనలుజ్ఞానంఅనుభవాల మార్పిడిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ లక్ష్యంఇందులో పాల్గొనే యువతకు తాము సందర్శించే జిల్లాలోని సంప్రదాయాలుఆచారాలుసాంస్కృతిక వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికిఅభినందించడానికి తోడ్పడుతుందిఅలాగే అర్థవంతమైన పరస్పర చర్చలుసహకారాన్ని పెంపొందిస్తుంది.

గిరిజన యువజన కార్యక్రమం (టీవైఈపీ):

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ కార్యక్రమం అమలవుతోంది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు చెందిన గిరిజన యువతకు దేశ సాంస్కృతిక వారసత్వంపై అవగాహన కల్పించడంభిన్నత్వంలో ఏకత్వం స్ఫూర్తిని పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశంవారిని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడంజీవన నైపుణ్యాలను పెంపొందించడంకెరీర్ కౌన్సెలింగ్ అవకాశాలను కల్పించడం ఈ కార్యక్రమ లక్ష్యం.

కాశ్మీరీ యువజన కార్యక్రమం (కేవైఈపీ):

కాశ్మీర్ లోయకు చెందిన యువతకు దేశంలోని ఇతర ప్రాంతాలలో జరుగుతున్న సాంకేతిక, పారిశ్రామిక పురోగతిని పరిచయం చేయడం ఈ కార్యక్రమ లక్ష్యంఇది దేశంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలునైపుణ్యాభివృద్ధి అవకాశాలువిద్యఉపాధి మార్గాల గురించి వారికి అవగాహన కల్పిస్తుంది.

ఈ కార్యక్రమాల ద్వారా మై భారత్ యువత భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, సాంస్కృతిక అవగాహనను పెంచడందేశవ్యాప్తంగా ఉన్న యువకుల సమగ్ర అభివృద్ధికి తోడ్పాటును అందిస్తోంది.

ఈ సమాచారాన్ని యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సోమవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వకంగా అందించిన సమాధానంలో తెలిపారు.

 

***


(రిలీజ్ ఐడి: 2240951) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati