ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

'సైబర్ సెక్యూరిటీ గ్రాండ్ ఛాలెంజ్ 2.0’ విజేతలను మొత్తం రూ.6.85 కోట్ల బహుమతులతో సత్కరించిన ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ, డీఎస్‌సీఐ

నాడు పోస్టు చేయడమైనది: 26 FEB 2026 3:19PM by PIB Hyderabad

'సైబర్ సెక్యూరిటీ గ్రాండ్ ఛాలెంజ్ 2.0’ (సీఎస్‌జీసీ 2.0) విజేతలను ఇవాళ ఎలక్ట్రానిక్స్సమాచార సాంకేతికత (ఎంఈఐటీవైకార్యదర్శి శ్రీ ఎస్.కృష్ణన్ సత్కరించారుఈ కార్యక్రమాన్ని ఇండియా డేటా సెక్యూరిటీ కౌన్సిల్ (డీఎస్‌సీఐసహకారంతో ఎంఈఐటీవై నిర్వహించిందిజాతీయ సైబర్ భద్రతా సామర్థ్యాన్ని బలోపేతం చేయటంకీలక సాంకేతిక రంగాల్లో నైపుణ్యాన్ని పెంపొందించటం ద్వారా సురక్షితమైనపటిష్ఠమైన డిజిటల్ వ్యవస్థకు మద్దతివ్వటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

మొత్తం రూ.6.85 కోట్లను బహుమతిగా అందించిన సైబర్ సెక్యూరిటీ గ్రాండ్ ఛాలెంజ్ 2.0 దేశంలోనే అత్యంత కీలకమైనది. ప్రభుత్వ మద్దతుతో సైబర్ సెక్యూరిటీ ఇన్నోవేషన్ ఛాలెంజిలలో ఇది ఒకటిగా నిలిచిందిసైబర్ సెక్యూరిటీ గ్రాండ్ ఛాలెంజ్ 2.0 విజేతలకు ట్రోఫీలతో పాటు కోటి రూపాయల నగదు బహుమతిని.. మొదటిరెండో రన్నరప్‌లకు రూ.50 లక్షలురూ.25 లక్షల చొప్పున అందించారు.

 

విజేతలువారు పరిష్కరించిన సమస్యల వివరాలు:

 

అంకుర సంస్థ

పరిష్కరించిన సమస్య

విజేత

కేంబ్రియాన్ స్కిల్‌దా టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఎల్ఎల్‌పీ (సీఎస్‌టీసీఎస్)

భవిష్యత్ తరం బయోమెట్రిక్ వ్యవస్థల భద్రత

మొదటి రన్నరప్

క్రిప్సిస్

క్లోన్, నకిలీ

యాప్‌ల నియంత్రణ

రెండో రన్నరప్

జిరిజ్.ఏఐ

ఏపీఐ సెక్యూరిటీ

జనవరి 2025లో మైగవ్ వేదిక ద్వారా ప్రారంభించిన సైబర్ సెక్యూరిటీ గ్రాండ్ ఛాలెంజ్.. దేశంలో ఆవిష్కరణలువ్యవస్థాపకతను ప్రోత్సహించటంలో ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందిఆరు కీలక రంగాలైన.. ఏపీఐ భద్రతడేటా సెక్యూరిటీవేరబుల్ డివైస్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీక్లోన్.. నకిలీ యాప్‌లను తగ్గించటంప్రమాదాన్ని గుర్తించటంతక్షణ స్పందనకు ఏఐభవిష్యత్ తరం బయోమెట్రిక్ వ్యవస్థల భద్రత వంటి వాటిల్లో నూతన ఆవిష్కరణలను ఇది ప్రోత్సహిస్తుందిఅంకుర సంస్థలు రూపొందించిన పరిష్కారాల మేధో సంపత్తి హక్కులు (ఐపీఆర్సంబంధిత కంపెనీలకు చెందటం ఈ కార్యక్రమం ప్రత్యేకత.

నాలుగు దశల్లో నిర్వహించిన ఈ పోటీలోని ప్రతి స్థాయిలో ప్రగతిశీల మూల్యాంకనంఆర్థిక సహకారం అందించారుప్రతి సమస్య పరిష్కారానికి ఆరుగురు చొప్పునమొత్తం 36 అంకుర సంస్థలను ఎంపిక చేశారుఎంపికైన అంకుర సంస్థలు పరిష్కారాలను మెరుగుపరచుకునేందుకుఅభివృద్ధి చేయటానికి ఒక్కో సంస్థకు రూ.5 లక్షల గ్రాంట్‌ను అందించారుకనీసం ఆమోదించదగిన దశలో ఈ అంకుర సంస్థలు క్రియాత్మక నమూనాలను తయారు చేయటానికి అవసరమైన సాంకేతికవాణిజ్య మార్గదర్శకత్వాన్ని పొందాయిప్రతి సమస్య పరిష్కారానికి ముగ్గురి చొప్పున 18 అంకుర సంస్థలు తుది దశకు చేరుకున్నాయివిజేత అంకుర సంస్థలకు ఒక్కొక్కటికీ రూ.10 లక్షల చొప్పున అందించారుఈ దశలో పరిష్కారాలను పరిశీలించిధ్రువీకరించిన తర్వాత ఐదు అంకుర సంస్థలను ఎంపిక చేసి ఒక్కోదానికి రూ.25 లక్షల చొప్పున అందించారుచివరగా గో-టు-మార్కెట్ దశలో వాణిజ్య సంసిద్ధతవిస్తరణమార్కెట్ అవకాశాలను అంచనా వేసిమూడు అంకుర సంస్థలను తుది విజేతలుగా ప్రకటించారుపోటీలో పాల్గొన్న స్టార్టప్‌లు ఉత్పత్తిని మెరుగుపరచుకోవటానికివినియోగ సామర్థ్యాన్నిమార్కెట్ సంసిద్ధతను పెంపొందించుకోవటానికి నిరంతర సాంకేతికవాణిజ్య మార్గదర్శకత్వాన్ని పొందాయి.

ఎంఈఐటీవై కార్యదర్శి శ్రీ ఎస్.కృష్ణన్ మాట్లాడుతూ.. "దేశంలో బలమైన స్వదేశీ భద్రత సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా సైబర్ సెక్యూరిటీ గ్రాండ్ ఛాలెంజ్ 2.0 కీలక ముందడుగుదేశీయ నైపుణ్యం అత్యంత అవసరమైన రంగాల్లో సైబర్ సెక్యూరిటీ ఒకటిసైబర్ భద్రతలో స్వదేశీ సాంకేతికత కీలకమైనదినిరంతరం మారుతున్న సాంకేతికతతో భద్రతాపరమైన సవాళ్లు ఎదుర్కోవటం వాస్తవంకాబట్టి దేశీయ వ్యవస్థతో అభివృద్ధి చేసిన పరిష్కారాలతో మనం సిద్ధంగా ఉండాలికచ్చితమైన మూల్యాంకన ప్రక్రియ ద్వారా ఈ ఛాలెంజ్‌ను నిర్వహించారుఇందులో విద్యార్థుల నేతృత్వంలోని బృందాలుఅంకుర సంస్థలుమహిళా పారిశ్రామికవేత్తలు పెద్దఎత్తున పాల్గోవటం ప్రోత్సాహకరంగా ఉందిఈ పోటీలో రూపొందించిన సమస్య పరిష్కారాలు నేటి డేటా ఆధారిత ఆర్థిక వ్యవస్థకు సముచితంగా ఉన్నాయిముఖ్యంగా ఏపీఐల వంటి విధానాల ద్వారా డేటా షేరింగ్ పెరుగుతున్న నేపథ్యంలో పటిష్టమైన డేటా రక్షణభద్రతా ప్రమాణాలు తప్పనిసరిశాశ్వత ప్రాతిపదికన దేశీయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవటానికి ఈ కార‌్యక్రమం గొప్ప అవకాశంఈ వేగాన్ని మున్ముందు కూడా కొనసాగించాలిసైబర్ సెక్యూరిటీ రంగంలో స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంపొందించటానికినిరంతర సహకారం ద్వారా సంస్థాగతవ్యవస్థ సామర్థ్యాన్ని బలోపేతం చేయటానికి ఎంఈఐటీవై కట్టుబడి ఉందిఅని పేర్కొన్నారు.

ఈ పోటీకి సంబంధించి మరిన్ని వివరాల కోసం సంప్రదించండి https://innovateindia.mygov.in/cyber-security-grand-challenge/

 

***


(రిలీజ్ ఐడి: 2233277) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Tamil