ప్రధాన మంత్రి కార్యాలయం
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026లో రియల్-టైమ్ సంజ్ఞా భాష అనువాదంతో ఏఐ- ఆధారిత వాడుకను ప్రస్తావించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
19 FEB 2026 6:14PM by PIB Hyderabad
ఈ రోజు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026ను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృత్రిమ మేధ యుగంలో యాక్సెసిబిలిటీ, సమ్మిళితత్వం పట్ల భారత్ అచంచలమైన నిబద్ధతను స్పష్టం చేశారు.
ఏఐ సాంకేతికత ద్వారా సంజ్ఞా భాషలో రియల్-టైమ్ అనువాదం ప్రారంభమైంది. దీని ద్వారా దివ్యాంగులు ఈ కార్యకలాపాల్లో పూర్తి స్థాయిలో పాల్గొనగలరు. విభజలను అనుసంధానించే, పౌరులందరినీ శక్తిమంతం చేసే ఆవిష్కరణలకు భారత్ మద్దతునిస్తూనే ఉంటుందని శ్రీ మోదీ తన ప్రసంగంలో ఉద్ఘాటించారు.
‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
"ఏఐ ఇంపాక్ట్ సదస్సు సందర్భంగా నా ప్రసంగంలో ఏఐని ఉపయోగించి సంకేత భాషలో రియల్-టైమ్ అనువాదం గురించి నేను ప్రస్తావించాను. ఇది ఏఐ రంగంలో యాక్సెసిబిలిటీ, సమ్మిళితత్వాల పట్ల మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. సాంకేతికతను, ప్రజల మధ్య అభిప్రాయాల బదిలీని దివ్యాంగులకూ అందుబాటులో ఉంచేందుకు సదా మేం కృషి చేస్తాం."
***
(రిలీజ్ ఐడి: 2230495)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6