రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

వైజాగ్‌లో మిలన్‌-2026ను ప్రారంభించిన రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్


పెరుగుతున్న సముద్ర సవాళ్లను సమష్టిగా ఎదుర్కోవడానికి ప్రపంచ సమాజం చేతులు కలపాలని పిలుపు

" సముద్ర చట్టాలపై ఐక్యరాజ్యసమితి సదస్సు విధాన ప్రణాళికలు

సమగ్ర ప్రపంచ నావికా వ్యవస్థ ద్వారా మరింత బలోపేతమవుతాయి"

అంతర్జాతీయ నియమాలు, నావిగేషన్ స్వేచ్ఛ ఆధారంగా

అందరికీ సమాన హక్కులు గల నౌకా వాణిజ్య వ్యవస్థ ఏర్పాటు భారత్ ఆకాంక్ష

"సాగర్ నుంచి మహాసాగర్ దాకా ప్రధానమంత్రి శ్రీ మోదీ దార్శనికత పరిణామం... ఈ ప్రాంతంతో పాటు విదేశీ భాగస్వాములతో పరస్పర సహకారం బలోపేతం పట్ల భారత్ లోతైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది"

"భారత్ విశ్వసనీయమైన విశ్వ-మిత్రగా, ఈ ప్రాంతంలో

నిర్మాణాత్మక, ఆధారపడదగిన పాత్రను పోషిస్తూనే ఉంటుంది"

నౌకా వాణిజ్యంలో సహకారాత్మక భాగస్వామ్యం, భద్రత-నియమ ఆధారిత సమష్టి నౌకా వాణిజ్య వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా భారత నావికాదళం నిర్వహిస్తున్న

మిలన్-2026లో పాల్గొన్న 74 దేశాల నావికాదళ అధిపతులు, ప్రతినిధులు

నాడు పోస్టు చేయడమైనది: 19 FEB 2026 3:25PM by PIB Hyderabad

సముద్ర రంగంలో పెరుగుతున్న సంక్లిష్టపరస్పర అనుసంధానిత సవాళ్లను అన్ని దేశాలు సమర్థంగా ఎదుర్కోవాలనీఇందుకోసం అన్ని దేశాలు పరస్పర గౌరవం ఇచ్చిపుచ్చుకునే స్ఫూర్తితో వ్యవహరించాలని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారుఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో మిలన్-2026ను ప్రారంభించిన ఆయన 74 దేశాల నావికా దళాల అధిపతులుప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు.

"అంతర్జాతీయ శాంతి స్థాపనలో నావికాదళాల పాత్ర కాలక్రమేణా పెరిగిందిగత కొన్ని దశాబ్దాలుగా విపరీతమైన ఆర్థిక వృద్ధి సాధ్యపడిందిఇది అంతర్జాతీయ వాణిజ్యంరవాణాలో భారీ వృద్ధికి దారితీసిందిజలసంధిజల మార్గాల యాజమాన్యం విషయంగా పోటీ పెరిగిందిఇది కొన్నిసార్లు ఉద్రిక్తతలకూ దారితీస్తున్నదినీటి అడుగున గల వనరులపైముఖ్యంగా రేర్ ఎర్త్ ఖనిజాలపై అంతర్జాతీయంగా అన్ని దేశాల దృష్టి పెరగడం ఈ ఉద్రిక్తతకు కొత్త కోణాన్ని జోడిస్తోందిఅదనంగా ఆయా దేశాలుప్రాంతాలకు సామ్రాజ్యాన్ని విస్తరించాలనే దుర్మార్గపు ఉగ్రవాద కార్యకలాపాల నుంచి మన జలాలను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందిఅని రక్షణ మంత్రి అన్నారు.

సాంప్రదాయిక ముప్పులు పైరసీసముద్ర ఉగ్రవాదంఅక్రమంగా చేపలు పట్టడంఅక్రమ రవాణాసైబర్ దాడులుకీలకమైన సరుకు రవాణా వ్యవస్థలను అడ్డుకోవడం వంటి కొత్త సవాళ్లతో ముడిపడి ఉన్నాయని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారువాతావరణ మార్పులు ప్రకృతి వైపరీత్యాలను తీవ్రతరం చేస్తున్నాయనీ... ఇవి మానవతా కార్యకలాపాలువిపత్తు సహాయ కార్యకలాపాలు మరింత తరచుగాతప్పనిసరిగా చేపట్టాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నాయన్నారుఏ ఒక్క నావికాదళం... ఎంత సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ... ఈ సవాళ్లను ఒంటరిగా పరిష్కరించలేదనీ... సురక్షితమైనమరింత భద్రత గల భవిష్యత్తును నిర్ధారించడానికి నావికాదళాల మధ్య మెరుగైన సహకారం అవసరమని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.

అంతర్జాతీయ జలాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల సమావేశం (యూఎన్‌సీఎల్‌వోఎస్అందించిన దృఢమైన విధాన ప్రణాళికను సమగ్ర ప్రపంచ నౌకా వాణిజ్య వ్యవస్థ ఏర్పాటు ద్వారా మరింత బలోపేతం చేయవచ్చని రక్షణ మంత్రి వ్యాఖ్యానించారుదేశాల మధ్య వివాద పరిష్కారంశాంతియుత సహజీవనం కోసం యూఎన్‌సీఎల్‌వోఎస్ సమగ్రమైనసమర్థమైన యంత్రాంగాన్ని అందిస్తుందన్నారుసమగ్ర ప్రపంచ నౌకా వాణిజ్య వ్యవస్థ సమాచార భాగస్వామ్యాన్ని సులభతరం చేస్తుందనీ... కమ్యూనికేషన్ల సంబంధాలను పరిరక్షించడంతో పాటు ప్రపంచ స్థాయిలో జాతీయ సరిహద్దుల రక్షణ సహా సముద్ర సంబంధిత ఉగ్రవాదం వంటి నేర కార్యకలాపాలనూ అణిచివేస్తుందని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుత అంతర్జాతీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ప్రస్తావించిన శ్రీ రాజ్‌నాథ్ సింగ్... మిలన్ వంటి వేదికలు వృత్తిపరమైన నైపుణ్యాన్ని ఒకచోట చేర్చిపరస్పర విశ్వాసాన్ని పెంపొందించిపరస్పర సామర్థ్యాలనూ పెంపొందించిఉమ్మడి సవాళ్లకు సమన్వయంతో కూడిన ప్రతిస్పందనలను సుసాధ్యం చేస్తాయని పేర్కొన్నారు. "మన ఓడలు కలిసి ప్రయాణించినప్పుడుమన నావికులు కలిసి శిక్షణ పొందినప్పుడుమన కమాండర్లు కలిసి చర్చించినప్పుడుభౌగోళిక-రాజకీయాలను అధిగమించిసహకారాత్మక ఆలోచనపై చర్చించడానికి ఒక అనుకూలమైన సమయాన్ని అందించే ఉమ్మడి అవగాహనను మనం నిర్మిస్తాంఅని ఆయన అన్నారు.

ఈ సహకారం అవసరాన్ని భారత్ చాలా కాలం కిందటే గుర్తించిందన్న రక్షణ మంత్రి... "ప్రాంతంలోని అందరికీ భద్రతవృద్ధి" (సాగర్దార్శనికతతో రూపొందించిన సముద్రాల పట్ల మన దేశపు విధానం "ప్రాంతాల అంతటా భద్రతవృద్ధి కోసం పరస్పరసమగ్ర పురోగతి" (మహాసాగర్దార్శనికతగా పరిణామం చెందిందన్నారు. "సాగర్అంటే సముద్రాల నుంచి మహాసాగర్” అంటే మహాసముద్రాలకు సాగిన ఈ పరిణామం... ఈ ప్రాంతానికి చెందినవిదేశీ భాగస్వాములతో కలిసి పనిచేయడం పట్ల భారత్ లోతైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు.

దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలను వివరించిన శ్రీ రాజ్‌నాథ్ సింగ్... మేం బహుపాక్షిక నిఘాసమన్వయంతో కూడిన గస్తీని నిరంతరం కొనసాగిస్తున్నాంమానవ సంబంధిత సంక్షోభాల సమయంలో మా దళాలు వేగంగా స్పందించాయితుఫానుల సమయాల్లో మేం అనేక ఉమ్మడి ప్రత్యేక ఆర్థిక మండలాల నిఘాహైడ్రోగ్రాఫిక్ సహాయంసహాయక మిషన్లలో పాలుపంచుకున్నాం” అని తెలిపారువిశ్వసనీయమైన విశ్వ-మిత్ర (ప్రపంచ మిత్రునిగా)గా భారత్ ఈ ప్రాంతంలో నిర్మాణాత్మకనమ్మదగిన బాగస్వామి పాత్రను పోషిస్తూనే ఉంటుందన్నారుసమగ్ర నౌకా వాణిజ్య భద్రతపరస్పర శ్రేయస్సు విడదీయరానివని... సారూప్య భావాలు కలిగిన దేశాల మధ్య సహకారంపరస్పర నమ్మకంభాగస్వామ్య నిబద్ధత ద్వారా మాత్రమే దీనిని సాధించవచ్చని ఆయన అన్నారు.

74 దేశాల భాగస్వామ్యంతో జరిగిన మిలన్-2026... విశ్వసనీయమైనబాధ్యతాయుతమైన నౌకా వాణిజ్య భాగస్వామిగా ప్రపంచ నౌకా వాణిజ్య సమాజం భారత్ పట్ల ఉంచిన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని రక్షణ మంత్రి తెలిపారు. “మిలన్-2026 భాగస్వామ్య దేశాలు నావికాదళాల పరస్పర సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి... వృత్తిపరమైన అనుభవాలుఅభ్యాసాలను పంచుకోవడం ద్వారా వృత్తిపరమైన సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడానికి... పరస్పర ప్రయోజనకరమైన బంధాలను అభివృద్ధి చేయడం ద్వారా స్నేహాలను మరింతగా విస్తచరించుకోవడానికి ప్రయత్నిస్తుందిఅంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా అంతర్జాతీయ నియమాలునావిగేషన్ స్వేచ్ఛ ఆధారంగా అన్ని దేశాలకు సమానమైన హక్కులుబాధ్యతలు గల సమగ్ర నౌకా వాణిజ్య వ్యవస్థను ఏర్పాటు చేయాలని మేం కోరుకుంటున్నాం” అని ఆయన అన్నారు.

అంతర్జాతీయ నౌకాదళాల సమీక్ష-2026 ప్రపంచ నౌకాదళాల మధ్య సద్భావనవృత్తి నైపుణ్యంపరస్పర గౌరవానికి స్పష్టమైన ప్రతీక అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారువారి జెండాలు భిన్నంగా ఉన్నప్పటికీఈ దేశాలన్నీ ఒకే సముద్ర  భాషను మాట్లాడుతూ... ప్రపంచ వనరులనుఆయా దేశాల జల సరిహద్దులను సురక్షితంగాభద్రంగాస్థిరంగా ఉంచడం పట్ల సమష్టి నిబద్ధతను ప్రదర్శిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.

తన ప్రారంభ వ్యాఖ్యల్లో నావికాదళ ప్రధానాధికారి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి ఈ మిలన్‌ను సముద్ర రంగ మహాకుంభ్‌తో పోల్చారుదీనిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నౌకా వాణిజ్య రంగ నిపుణులంతా కలిసి సముద్రాలను సురక్షితంగాభద్రంగాఅందరికీ అందుబాటులో ఉంచాలనే ఉమ్మడి నిబద్ధతఉద్దేశంతో ఏకమయ్యారని తెలిపారుభారత్ వంటి నౌకా వాణిజ్య దేశం నేటి సముద్ర సవాళ్లు సంక్లిష్టమైనవిపరస్పరం అనుసంధానితమైనవిబహుళ దేశాలకు సంబంధించినవి స్పష్టంగా గుర్తించిందన్నారువీటిని పరస్పర సహకారంభాగస్వామ్యం ద్వారా ఉత్తమంగా పరిష్కరించవచ్చని ఆయన స్పష్టం చేశారు.

నౌకా వాణిజ్య వాతావరణానికి సంబంధించిన ఈ సంక్లిష్ట విధానం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహాసాగర్ దార్శనికతతో ముడిపడి ఉందని నావికాదళ ప్రధానాధికారి పేర్కొన్నారుభాగస్వామ్యంసమష్టి బాధ్యత ఆధారంగా సమ్మిళితసహకార భావనలు కలగలసిన విధానం ఇది... భారత నౌకా వాణిజ్య శక్తిని స్పష్టం చేస్తూ భారత నావికాదళం ఈ సమ్మిళిత దార్శనికత మార్గనిర్దేశంలో ముందుకు సాగుతోందని ఆయన అన్నారుకలిసి పనిచేయడం ద్వారా భారత నావికాదళం... సమష్టి సామర్థ్యాన్ని పెంపొందించడానికినిరంతరం అభివృద్ధి చెందుతున్న నౌకా వాణిజ్య సవాళ్లకు వ్యతిరేకంగా ఉమ్మడి సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

మిలన్-2026 సందర్భంగా నావికాదళాలు సంక్లిష్టమైన సముద్ర విన్యాసాలుడ్రిల్స్సాధనలువృత్తిపరమైన నైపుణ్యాలను పంచుకోవడంఅర్థవంతమైన చర్చల్లో పాల్గొంటాయని అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి తెలిపారుపరస్పర అవగాహననమ్మకంలిసి పనిచేయడాన్ని మెరుగురుస్తూనే ఈ పరస్పర సంభాషణలు... అనుభవంనైపుణ్యాలను పరస్పరం పంచుకోవడంలోనూ సహాయపడతాయని ఆయన అన్నారు.

రక్షణ రంగ పరిశోధన-అభివృద్ధి విభాగం కార్యదర్శిడీఆర్‌డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్తూర్పు నావికాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లాభారత నావికాదళ మాజీ అధిపతులునావికాదళ అధిపతులుమిత్ర దేశాల ప్రతినిధులుభారత నావికాదళ సీనియర్ అధికారులునౌకల కమాండింగ్ అధికారులుసభ్య దేశాల సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారుఇది ఈ కార్యక్రమ దౌత్యవ్యూహాత్మక ప్రాముఖ్యాన్ని స్పష్టం చేసింది.

మిలన్-2026 ఇప్పటివరకు జరిగిన భారత నౌకాదళ కార్యక్రమాల్లోనే అతిపెద్దఅత్యంత సంక్లిష్టమైన ఎడిషన్లలో ఒకటిగా నిలుస్తుందిఇది 74 దేశాలకు చెందిన నావికాదళ నౌకలువిమానాలువృత్తి నిపుణులైన ప్రతినిధులను ఒకచోట చేర్చిందివృత్తిపరమైన సంబంధాలను మరింతగా పెంచుకోవడంకార్యాచరణ అనుకూలతను మెరుగుపరచడంపెరుగుతున్న పరస్పర అనుసంధాన భద్రతా వాతావరణంలో సమకాలీన నౌకా వాణిజ్య సవాళ్లపై భాగస్వామ్య అవగాహనను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం.

ఈ మిలన్-2026 ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్దేశించిన ప్రాంతాల వ్యాప్తంగా భద్రతవృద్ధి కోసం పరస్పరసమగ్ర పురోగతి (మహాసాగర్)’ దార్శనికతకు అనుగుణంగా ఉందిసముద్ర వనరులుసరిహద్దుల అంతటా శాంతిస్థిరత్వంశ్రేయస్సును ప్రోత్సహించే దిశగా భారత్ అనుసరిస్తున్న చురుకైన విధానాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.

ఈ కార్యక్రమాన్ని హార్బర్ దశసముద్ర దశ అను రెండు దశల్లో నిర్వహిస్తున్నారుహార్బర్ దశ వృత్తిపరమైన పరస్పర సంభాషణలను బలోపేతం చేయడంపరస్పర అవగాహనను పెంపొందించడంసమగ్రమైన భాగస్వామ్య కార్యక్రమం ద్వారా సహకారాన్నిప్రజల మధ్య సంబంధాలను పెంపొందించడంపై దృష్టి సారిస్తుందిఈ దశలోని కీలక కార్యకలాపాల్లో అంతర్జాతీయ నౌకా వాణిజ్య సదస్సుఈ రంగంలోని నిపుణుల మధ్య చర్చలుద్వైపాక్షిక భాగస్వామ్యాలుయువ అధికారుల మిలన్సభ్య దేశాల నావికాదళాల మధ్య క్రాస్-డెక్ సందర్శనలు బాగంగా ఉన్నాయిహార్బర్ దశలో ప్రీ-సెయిల్ ప్లానింగ్ సమావేశాలుకార్యాచరణ-సాంకేతిక ప్రదర్శనలునగర-సాంస్కృతిక పర్యటనలుక్రీడా కార్యక్రమాలుమిలన్ సాంస్కృతిక సాయంత్రం వంటి కార్యక్రమాలు భాగంగా ఉన్నాయిఇవి ఈ కార్యక్రమాల్లో పాల్గొనే సిబ్బందిప్రతినిధి బృందాలకు కార్యాచరణ భాగస్వామ్యానికి మించి అర్థవంతమైన సంభాషణ అవకాశాలను అందిస్తాయి.

సముద్రంలో అధునాతన కార్యాచరణ ప్రక్రియల శ్రేణి సముద్ర దశలో భాగంగా ఉంటుందిఈ కార్యక్రమంలో పాల్గొనే నౌకాదళాల మధ్య నౌకా వాణిజ్య సహకారంపరస్పరం సామర్థ్యాలను పెంపొందించుకోవడం లక్ష్యంగా వీటిని రూపొందించారుఈ కార్యక్రమాల్లో నౌకా వాణిజ్య భద్రతా కార్యకలాపాలువ్యూహాత్మక విన్యాసాలుకమ్యూనికేషన్ ప్రక్రియలు భాగంగా ఉంటాయిఇవి పరస్పర విశ్వాసంకార్యాచరణ సహోత్తేజాన్నిసామూహిక సంసిద్ధతను బలోపేతం చేస్తాయి.

మిలన్-2026 ద్వారా సహకారాత్మక నౌకా వాణిజ్య బాగస్వామ్యంసామూహిక భద్రత-నియమాల ఆధారిత సమగ్ర నౌకా వాణిజ్య వ్యవస్థను ప్రోత్సహించడం పట్ల తన నిబద్ధతను భారత నావికాదళం బలోపేతం చేస్తుందిహిందూ మహాసముద్ర ప్రాంతంతో పాటు మిగతా ప్రాంతాలకు భారత్ నమ్మకమైన భాగస్వామిగానికర భద్రతా ప్రదాతగా తన పాత్రను పునరుద్ఘాటిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2230387) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , English , Marathi , हिन्दी , Tamil