ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పురోగతి కోసం చురుకుగా ఉండడం ముఖ్యమని సూచించే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 13 FEB 2026 12:04PM by PIB Hyderabad

పురోగతిని సాధించడానికి సూర్యుని మాదిరిగా ఎప్పటికీ చురుకుగా ఉండడం ముఖ్యమని స్పష్టం చేసే ఓ సంస్కృ‌త సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. ఆ సూక్తి ఇలా ఉంది..:

‘‘చరన్ వై మధు విన్దతి చరన్ స్వాదుముంబరమ్

సూర్యస్య పశ్య శ్రెమాణం యో న తన్ద్రయతే చరంశ్చరైవేతి’’.

‘‘సర్వ కాలాల్లో చురుకుగా ఉండే సూర్యుని మాదిరిగా.. ముందుకు సాగిపోయే వారికి ప్రపంచంలో సర్వ శ్రేష్ఠ బహుమతులూ సొంతమవుతాయికాబట్టిమనిషి ఎప్పుడూ ఏదో ఒక పనిని చేస్తూ ఉండాలి’’ అనే సందేశాన్ని ఈ సుభాషితం మనకు చెబుతోంది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -

‘‘సూర్య భగవానుడు శక్తినీఉత్సాహాన్నీ మనందరి జీవితంలో నింపుతుంటాడుఈ రోజుననే ప్రారంభించిన ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్‌లీ యోజన’ కూడా ఆ రవి కారణంగానే ప్రకాశిస్తోందిఇది దేశప్రజలకు స్వచ్ఛ ఇంధనం వైపు మొగ్గు చూపేటట్లు నిరంతర స్ఫూర్తిని అందిస్తోంది.

‘‘చరన్ వై మధు విన్దతి చరన్ స్వాదుముంబరమ్

సూర్యస్య పశ్య శ్రెమాణం యో న తన్ద్రయతే చరంశ్చరైవేతి’’ అని పేర్కొన్నారు.

 

***

 

(రిలీజ్ ఐడి: 2227461) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Marathi , हिन्दी , Bengali , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam