శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ క్వాంటం మిషన్ కోసం వ్యూహాత్మక వేదికగా ఆంధ్రప్రదేశ్‌


భారత క్వాంటం భవిష్యత్తు అమరావతి నుంచే ప్రారంభం

"అమరావతి క్వాంటం సెంటర్"కు శంకుస్థాపన

రూ.6,000 కోట్ల "నేషనల్ క్వాంటం మిషన్"తో ఎలైట్ దేశాల సరసన భారత్

భారత్ ప్రపంచ క్వాంటం ఆశయాన్ని బలపరుస్తున్న అమరావతి కేంద్ర ప్రారంభం

1,000 క్యూబిట్‌లు, 2,000 కిలోమీటర్ల క్వాంటం కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ భారత్ లక్ష్యం

రక్షణ, సైబర్ భద్రత, ఆరోగ్య సంరక్షణలో పరివర్తన కోసమే క్వాంటం టెక్

17 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 43 సంస్థల పరిధిలో జాతీయ క్వాంటం మిషన్

ప్రభుత్వ, దేశవ్యాప్త సమగ్ర విధానం ద్వారా అమరావతి క్వాంటం వ్యాలీకి ఊతం: డాక్టర్ జితేంద్ర సింగ్

నాడు పోస్టు చేయడమైనది: 08 FEB 2026 2:12PM by PIB Hyderabad

కేంద్ర శాస్త్ర-సాంకేతికభూ విజ్ఞాన శాస్త్ర శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర)ఎమ్‌వోఎస్ పీఎంవోసిబ్బందిప్రజా ఫిర్యాదులుపెన్షన్లుఅణుశక్తిఅంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రసంగిస్తూ, "ఇది కేవలం ఒక భవన శంకుస్థాపన మాత్రమే కాదుఇది భారత క్వాంటం భవిష్యత్తుకు పునాది రాయిఅని ప్రకటించారు.

క్వాంటం టెక్నాలజీని ఒక ఐచ్ఛికంగా కాకుండా వ్యూహాత్మక అవసరంగా అభివర్ణించిన కేంద్ర మంత్రి... రాబోయే దశాబ్దాల్లో భారత్ తన కమ్యూనికేషన్ వ్యవస్థలురక్షణ వ్యవస్థఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలుప్రపంచస్థాయి సాంకేతికతలో తన స్థానాన్ని సురక్షితం చేసుకోవడం కోసం ఈ రంగంలో నాయకత్వమే ఏకైక మార్గమని అన్నారు.

అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్చంద్రబాబు నాయుడు... రాష్ట్ర ఐటీఎలక్ట్రానిక్స్విద్యా శాఖా మంత్రి శ్రీ నారా లోకేష్... భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్... శాస్త్ర-సాంకేతిక శాఖ కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరండికర్... ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వికామకోటి... డాక్టర్ అమిత్ సింఘీ (ఐబీఎం రీసెర్చ్ ఇండియా)... డాక్టర్ హారిక్ విన్ (టీసీఎస్)... శ్రీ ఎం.వీసతీష్ (ఎల్ అండ్ టీసహా ఈ రంగానికి చెందిన సీనియర్‌ ప్రముఖులురాష్ట్ర సీనియర్ అధికారులుఅధ్యాపకులువిద్యార్థులు హాజరయ్యారుఈ కార్యక్రమంలో శంకుస్థాపన శిలాఫలకాన్నిఅమరావతి క్వాంటం వ్యాలీ లోగోను ఆవిష్కరించడం... ఐబీఎంటీసీఎస్ క్వాంటం క్లౌడ్ సేవలను ప్రారంభించడం... ఐబీఎం–టీసీఎస్ క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్‌ ఏర్పాటు... క్వాంటం టాలెంట్ హబ్‌ ప్రకటన... ఎస్ఆర్ఎమ్ విశ్వవిద్యాలయం ద్వారా క్వాంటం రిఫరెన్స్ కేంద్రం... క్వాంటం-సేఫ్ అప్లికేషన్స్ కార్యక్రమం... తొమ్మిది మంది పరిశ్రమ భాగస్వాములతో బహుళ అవగాహన ఒప్పందాలపై సంతకాలు... పరిశ్రమవిద్యాసంస్థలుప్రభుత్వాల మధ్య సమన్వయంతో కూడిన భాగస్వామ్యానికి నిదర్శనంగా నిలిచాయి.

ముఖ్యమంత్రి శ్రీ ఎన్చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ ఎంతగానో ప్రశంసించారుఆయనను "రేపటిలో జీవిస్తూఎల్లుండి గురించి కలలు కనే నాయకుడు"గా కేంద్ర మంత్రి అభివర్ణించారుహైదరాబాద్‌లోని హై-టెక్ సిటీలో ముఖ్యమంత్రి సాంకేతికత ఆధారిత పాలనను మొదటిసారిగా చూసిన తన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ... గత సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో సాధించిన వేగవంతమైన పురోగతి సహకార సమాఖ్య స్ఫూర్తినిప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వర్ణించే "డబుల్-ఇంజిన్విధానాన్ని అంటే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్నీ ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు.

గత వారం విశాఖపట్నంలో తాను పర్యటించిన విషయాన్ని ప్రస్తావించిన కేంద్ర మంత్రి... ఆ సందర్భంలో ప్రారంభించిన ఒక ప్రాజెక్టు ఉదాహరణను ఉటంకించారు. 2006లో ప్రతిపాదించిదాదాపు రెండు దశాబ్దాలుగా నిలిచిపోయిన జాతీయ సముద్ర విజ్ఞాన కేంద్రం ప్రాజెక్టును ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే పూర్తి చేసిందని ఆయన తెలిపారుఇది భారత డీప్ ఓషన్ మిషన్‌కు కీలక కేంద్రంగా పని చేస్తుందనీ, తద్వారా ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి ప్రకటించిన బ్లూ ఎకానమీ దార్శనికతను మరింత బలోపేతం చేస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు.

ప్రత్యేక జాతీయ క్వాంటం మిషన్ కలిగిన దేశాల సరసన ఈ రోజు భారత్ నిలిచిందని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారుసుమారు రూ.6,000 కోట్ల కేటాయింపుతో ఈ మిషన్ 17 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 43 సంస్థల్లో విస్తరించి ఉందన్నారుక్వాంటం కంప్యూటింగ్క్వాంటం కమ్యూనికేషన్క్వాంటం సెన్సింగ్మెట్రాలజీక్వాంటం మెటీరియల్స్పరికరాలపై దృష్టి సారించే నాలుగు థీమాటిక్ కేంద్రాల నిర్వహణలో ఇది ఉంటుందని ఆయన తెలిపారుఎనిమిది సంవత్సరాల్లోపు 1,000 ఫిజికల్ క్యూబిట్‌లతో క్వాంటం కంప్యూటర్‌లను అభివృద్ధి చేయడంసురక్షితమైన గ్రౌండ్-టు-గ్రౌండ్ క్వాంటం కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయడంసుదూర క్వాంటం కమ్యూనికేషన్‌ను ప్రారంభించడం, 2,000 కిలోమీటర్లలో ఇంటర్-సిటీ క్వాంటం కీ పంపిణీని సాధించడం జాతీయ లక్ష్యాల్లో భాగంగా ఉన్నాయని కేంద్ర మంత్రి వివరించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను ఉద్దేశించి కేంద్ర మంత్రి ప్రసంగిస్తూతదుపరి పారిశ్రామిక పరివర్తనకు క్వాంటం టెక్నాలజీ ఎందుకు కేంద్రంగా ఉందో వివరించారుప్రత్యర్థులు క్వాంటం కంప్యూటింగ్ సామర్థ్యాలను కలిగి ఉన్న ప్రపంచంలో సాంప్రదాయ కంప్యూటింగ్సైబర్ భద్రతా వ్యవస్థలు ప్రమాదంలో పడతాయని ఆయన పేర్కొన్నారుడేటా ఉల్లంఘనను క్వాంటం ఎన్‌క్రిప్షన్ దాదాపు అసాధ్యం చేస్తుందనీడీకోడ్ చేయడానికి ఖగోళ కాలపరిమితులు అవసరమని ఆయన వివరించారురక్షణసైబర్ భద్రతలో ఇది అపూర్వమైన వ్యూహాత్మక రక్షణను అందిస్తుందని తెలిపారు.

ఇతరత్రా అవయవాలకు నష్టం లేకుండా కణితులను మాత్రమే లక్ష్యంగా చేసుకోగలఅవయవ కదలికకు అనుగుణంగా వేగంగా మారగలరోగి వేగంగా కోలుకోవడానికి వీలు కల్పించే కచ్చితత్వం గల రేడియేషన్ చికిత్సలు సహా పరివర్తనాత్మక ఆరోగ్య సంరక్షణ ఉపయోగాలనూ ఆయన ప్రస్తావించారుఉపగ్రహ కమ్యూనికేషన్సురక్షిత కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలుఅధునాతన సెన్సింగ్ సామర్థ్యాలనూ క్వాంటం టెక్నాలజీ పునర్నిర్వచించగలదని ఆయన అన్నారు.

భారత్ కొన్ని దేశాల కంటే ఆలస్యంగా ఐటీ విప్లవంలోకి ప్రవేశించి ఉండవచ్చు... కానీ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల్లో ఆ జాప్యాన్ని పునరావృతం చేయదని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారుకృత్రిమ మేధబయోటెక్నాలజీఅంతరిక్షంసముద్ర లోతుల అన్వేషణలో సమాంతర మిషన్లతో భారత్ తదుపరి ప్రపంచ సాంకేతిక రంగంలో ముందంజలో ఉందన్నారుఇటీవల ప్రకటించిన బయోఫార్మా శక్తి కార్యక్రమాన్నీ ఆయన ప్రస్తావించారుబయోటెక్నాలజీపునరుత్పత్తిజన్యుశాస్త్రాలుసాఫ్ట్‌వేర్ ఆధారిత వ్యవస్థలుక్వాంటం కంప్యూటింగ్ దిశగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా పురోగమిస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

క్వాంటం టెక్నాలజీలో భారత్ ఇప్పటికే బి.టెక్ మైనర్ కోర్సులను ప్రవేశపెట్టిందనీఇప్పుడు ఎం.టెక్ కార్యక్రమాలకూ దానిని విస్తరించడానికి సన్నాహాలు చేస్తోందని కేంద్ర మంత్రి తెలిపారుశిక్షణ పొందిన అధ్యాపకులసంస్థాగత సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణాత్మక క్వాంటం విద్యా కార్యక్రమాలను ప్రారంభించే అవకాశం గురించి ఆయన ముఖ్యమంత్రితో చర్చించారుఅధునాతన ఫ్యాబ్రికేషన్ సౌకర్యాలుకేంద్ర పరిశోధనా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామనీ... అవి అంకురసంస్థలుపరిశోధకులువిద్యా సంస్థలకు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారుఐఐటీ మద్రాస్ ప్రారంభించిన... ఇప్పుడు దేశవ్యాప్తంగా అనుసరిస్తున్న... మార్గదర్శక పరిశోధన పార్క్ నమూనానూ ఆయన ప్రశంసించారు.

ఒంటరిగా పనిచేసే యుగం ముగిసిందని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారుప్రభుత్వంపరిశ్రమవిద్యాసంస్థలుఅంకురసంస్థలను ఏకీకృత జాతీయ ప్రయత్నంలో సమగ్రపరచడంలోనే అమరావతి క్వాంటం వ్యాలీ విజయం ఆధారపడి ఉందని తెలిపారుఐదు సంవత్సరాల కిందట అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను అనుమతించడంఅణుశక్తిలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని విస్తరించడం సహకార వృద్ధి పట్ల ప్రస్తుత ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయన్నారుభారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే పాక్షిక వాటా నుంచి 800 కోట్లకు పెరిగిందనీ... ఈ సమగ్ర విధానం కారణంగా రాబోయే సంవత్సరాల్లో ఇది 4500 కోట్లకు చేరుతుందని అంచనాలు చెబుతున్నాయని ఆయన వివరించారు.

కేంద్ర మంత్రి తన ప్రసంగాన్ని ముగిస్తూ... భారత క్వాంటం ప్రస్థానం పవిత్రమైన అమరావతి నగరం నుంచి ప్రారంభమవుతోందనివికసిత భారత్ దిశగా భారత్ ప్రస్థానంలో ముందడుగుకు వేదికగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని ప్రకటించారుజాతీయ మిషన్లతో తమ ఆవిష్కరణల వ్యవస్థలను అనుసంధానించే రాష్ట్రాలకు భారత ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుందనీ ఆయన హామీ ఇచ్చారుకేంద్రం-ఆంధ్రప్రదేశ్ మధ్య సహకారం దేశాన్ని ప్రపంచ క్వాంటం రంగంలో అగ్రగామిగా నిలిపే ప్రక్రియను వేగవంతం చేస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ పునరుద్ఘాటించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2225160) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil , Kannada