పార్లమెంటరీ వ్యవహారాలు
ఎన్వైపీఎస్ వెబ్ పోర్టల్ నవీకరించిన వెర్షన్ను ఆవిష్కరించిన కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
04 FEB 2026 5:11PM by PIB Hyderabad
నేషనల్ యూత్ పార్లమెంట్ స్కీమ్ (ఎన్వైపీఎస్) వెబ్ పోర్టల్ను నవీకరించి, ఎన్వైపీఎస్ 2.O పేరుతో నూతన వెర్షన్ను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆవిష్కరించింది. గత వెర్షన్ ద్వారా గుర్తింపు పొందిన విద్యా సంస్థలకు మాత్రమే ఇందులో పాల్గొనే అవకాశం ఉండేది. ఎన్వైపీఎస్ 2.O ద్వారా దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు, బృందాలు, సాధారణ పౌరులు కూడా పాల్గొనవచ్చు. ఇందుకోసం సంస్థాగత భాగస్వామ్యం, బృంద భాగస్వామ్యం, వ్యక్తిగత భాగస్వామ్యం వంటి విభాగాలున్నాయి.
ఛత్తీస్గఢ్లోని గ్రామీణ ప్రాంతాలు, చిన్న సంస్థలు, సమూహాలతో సహా లింగం, కులం, మతం, జాతి, ప్రాంతం, నివాస స్థలంతో సంబంధం లేకుండా దేశ పౌరులందరూ పాల్గొనే అవకాశాన్ని ఇది కల్పిస్తుంది. ఎన్వైపీఎస్ పరిధిని విస్తరించటానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా విభాగాలకు, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభలకు, వివిధ విద్యాబోర్డులకు (సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ) మంత్రిత్వ శాఖ లేఖలు రాసింది. దీనికి సంబంధించిన ప్రచార వీడియోను సంసద్ టీవీలో ప్రసారం చేస్తుంది.
యూత్ పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనే విధానం, నిర్వహణకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి-
చట్టం, న్యాయశాఖ సహాయమంత్రి (స్వతంత్ర), పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి శ్రీ అర్జున్ మేఘవాల్ ఇవాళ లోక్సభలో లిఖితపూర్వక సమాధానంగా ఈ సమాచారాన్ని అందించారు.
(రిలీజ్ ఐడి: 2223799)
సందర్శకుల సూచీ సంఖ్య : : 22