రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రూ.2.93 లక్షల కోట్ల రికార్డు స్థాయి మూలధన వ్యయం, హైస్పీడ్ కనెక్టివిటీ, సరుకు రవాణా వ్యవస్థ బలోపేతం, భద్రతే ప్రధాన ప్రాధాన్యతలుగా భారత రైల్వేకు నిధుల కేటాయింపు


భారతదేశవ్యాప్తంగా ఏడు కొత్త హైస్పీడ్ కారిడార్లు, ప్రధాన నగరాల మధ్య తగ్గనున్న దూరం.. సౌత్ హైస్పీడ్ డైమండ్ ద్వారా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరికి ప్రయోజనం

సుమారు 4,000 కి.మీ మేర విస్తరించనున్న హైస్పీడ్ రైల్ కారిడార్ల ద్వారా రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం: అశ్వినీ వైష్ణవ్

తూర్పు-పశ్చిమ ప్రాంతాల మధ్య వాణిజ్యాన్ని బలోపేతం చేసేందుకు దంకుని (డబ్యూబీ) నుంచి సూరత్ వరకు 2,052 కి.మీ. పొడవైన నూతన సరుకు రవాణా కారిడార్ ప్రకటన

దాదాపు రూ.1.20 లక్షల కోట్ల కేటాయింపులతో భద్రతకే తొలి ప్రాధాన్యత: అశ్వినీ వైష్ణవ్

భారత్‌లో రూపొందించి, అభివృద్ధి చేసిన ప్రొపల్షన్ సిస్టమ్స్ అగ్ర దేశాలైన అమెరికా, జర్మనీ, స్విట్జర్లాండ్, స్పెయిన్ వంటి దేశాలకు ఎగుమతి: అశ్వినీ వైష్ణవ్

నాడు పోస్టు చేయడమైనది: 01 FEB 2026 7:51PM by PIB Hyderabad

భారత రైల్వే శరవేగంగా విస్తరణకు సిద్ధమవుతుందిఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో కేటాయించిన రూ.2,78,000 కోట్ల భారీ నిధులను ప్రధానంగా హైస్పీడ్ కనెక్టివిటీసరుకు రవాణాభద్రతపై వెచ్చించాలని భావిస్తోంది.

కేంద్ర బడ్జెట్ 2026–27లో భారతీయ రైల్వేలకు మునుపెన్నడూ లేనివిధంగా రూ.2,93,030 కోట్ల మూలధన వ్యయాన్ని కేటాయించారురైల్వే రంగానికి కేటాయించిన అత్యధిక నిధుల కేటాయింపు ఇదే.

రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటం, సామర్థ్యాన్ని విస్తరించటంప్రయాణికుల భద్రతను మెరుగుపరచడానికి ప్రభుత్వ నిరంతర కృషిని ఈ కేటాయింపులు స్పష్టం చేస్తున్నాయిఆర్థిక వృద్ధికిలాజిస్టిక్స్ సామర్థ్యానికి రైల్వే మౌలిక సదుపాయాలే కీలకమని ఇది ప్రతిబింబిస్తోందిసరుకు రవాణాను మెరుగుపరచటంరవాణా ఖర్చులను తగ్గించటంరద్దీగా ఉండే మార్గాల్లో ఒత్తిడిని తగ్గించటంఆధునిక రైళ్లుపునరాభివృద్ధి చేసిన స్టేషన్ల ద్వారా ప్రయాణికులకు మెరుగైన అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ నిరంతర పెట్టుబడులు కొనసాగుతున్నాయి.

దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా, పర్యావరణహితమైన ప్రయాణ వ్యవస్థలను ప్రోత్సహించేందుకు ఏడు నగరాల మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్లను 'గ్రోత్ కనెక్టర్స్'గా అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందిఈ కారిడార్లలో ముంబై-పూణెపూణె-హైదరాబాద్హైదరాబాద్-బెంగళూరుహైదరాబాద్-చెన్నైచెన్నై-బెంగళూరుఢిల్లీ-వారణాసివారణాసి-సిలిగురి ఉన్నాయిఈ కారిడార్ల ద్వారా నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గటమే కాకప్రయాణికులు ఒక రవాణా మార్గం నుంచి మరో రవాణా మార్గానికి సులభంగా మారేందుకు దోహదపడతాయి.

కొత్త కారిడార్ల ప్రకటనతో రైలు రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. దక్షిణ భారతదేశంలో చెన్నై-బెంగళూరు-హైదరాబాద్ హైస్పీడ్ వ్యవస్థ సౌత్ హైస్పీడ్ త్రిభుజం (లేదా డైమండ్)లా ఏర్పడి ప్రధాన ఆర్థికఐటీ కేంద్రాలను అనుసంధానిస్తుందిదీనిద్వారా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని కేంద్ర రైల్వేసమాచారప్రసారఎలక్ట్రానిక్ఐటీ శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఇవాళ రైల్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

చెన్నై-బెంగళూరు మధ్య ప్రయాణ సమయం సుమారు ఒక గంట 13 నిమిషాలుబెంగళూరు-హైదరాబాద్ మధ్య గంటలుచెన్నై-హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయం గంటల 55 నిమిషాలకు మాత్రమే పరిమితమవుతుందని కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారుకర్ణాటకతెలంగాణఆంధ్రప్రదేశ్తమిళనాడుకేరళపుదుచ్చేరి రాష్ట్రాలకు ఈ రవాణా వ్యవస్థ అభివృద్ధి ఉత్ప్రేరకంలా మారటమే కాకఆయా ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేస్తుంది.

ముంబై-పూణె హైస్పీడ్ కారిడార్ ద్వారా పశ్చిమమధ్య భారతదేశానికి ప్రయాణ సమయం సుమారు 48 నిమిషాలు తగ్గటమే కాకరెండు ప్రధాన నగరాలను సమర్థవంతంగా అనుసంధానిస్తుందిపూణె-హైదరాబాద్ కారిడార్ ద్వారా సుమారు ఒక గంట 55 నిమిషాల ప్రయాణ సమయం తగ్గుతుందిదీన్ని దక్షిణ భారత నగరాలతో అనుసంధానించటం ద్వారా దేశవ్యాప్తంగా హైస్పీడ్ స్పైన్ ఏర్పడిప్రయాణికులకుఆయా ప్రాంతాల ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనం చేకూరుస్తుంది.

ఉత్తర, తూర్పు భారతదేశంలో ఢిల్లీ-వారణాసి హైస్పీడ్ కారిడార్ ద్వారా సుమారు గంటల 50 నిమిషాలకు ప్రయాణ సమయం తగ్గుతుందివారణాసిపాట్నా మీదుగా పశ్చిమబెంగాల్‌లోని సిలిగురి వరకు నిర్మించే హైస్పీడ్ కారిడార్ ద్వారా వారణాసి-సిలిగురి మధ్య ప్రయాణం కేవలం గంటల 55 నిమిషాల్లోనే పూర్తవుతుందిదీనిద్వారా ఢిల్లీఉత్తరప్రదేశ్బీహార్పశ్చిమబెంగాల్‌ను కలుపుతూ నూతన ఆర్థిక కారిడార్ ఏర్పడటమే కాకఆయా ప్రాంతాల అభివృద్ధినిఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేస్తుంది.

సుమారు 4,000 కి.మీ మేర విస్తరించనున్న హైస్పీడ్ రైల్ కారిడార్ల ద్వారా రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందనితద్వారా భవిష్యత్ రవాణా వ్యవస్థలో రైల్వే రంగం ప్రధానంగా నిలుస్తుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

సరుకు రవాణాలాజిస్టిక్స్ సామర్థ్యాన్ని భారీగా పెంచే దిశగా కేంద్ర బడ్జెట్‌లో కీలక ప్రతిపాదన చేశారుపశ్చిమబెంగాల్‌‌లోని దంకుని నుంచి గుజరాత్‌లోని సూరత్ వరకు.. ఒడిశాఛత్తీస్‌గఢ్మధ్యప్రదేశ్మహారాష్ట్ర మీదుగా నూతన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌ను ప్రతిపాదించారు. 2,052 కి.మీ పొడవున్న ఈ కారిడార్ ను ప్రస్తుత వెస్ట్రన్ డెడికేటెట్ ఫ్రైట్ కారిడార్‌తో అనుసంధానిస్తారుదీనివల్ల పశ్చిమ తీరంలోని ఓడరేవులకు సరుకు రవాణా సాఫీగా సాగుతుందిప్రస్తుతమున్న తూర్పుపశ్చిమ డీఎఫ్‌సీలు పూర్తి సామర్థ్యం మేరకు పనిచేస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారుఈ కారిడార్లో రోజూ సుమారు 400 సరుకు రవాణా రైళ్లు నడుస్తున్నాయిభవిష్యత్తులో పెరగబోయే డిమాండ్ ను తట్టుకోవటానికి అదనపు కారిడార్ల నిర్మాణం అవసరమని ఆయన పేర్కొన్నారు.

తూర్పు-పశ్చిమ కారిడార్వివిధ ప్రాంతాల మధ్య వాణిజ్య ప్రవాహాన్ని బలోపేతం చేస్తుందిప్రస్తుతమున్న రైల్వే వ్యవస్థలో రద్దీని తగ్గించటమే కాకసరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచటం ద్వారా పారిశ్రామిక వృద్ధికిసరఫరా వ్యవస్థలకు మద్దతుగా నిలుస్తుంది.

భద్రతకు తొలి ప్రాధాన్యతనిస్తూ దాదాపు రూ.1.20 లక్షల కోట్లను ప్రత్యేకంగా భద్రతా పనులకు కేటాయించినట్లు కేంద్రమంత్రి స్పష్టం చేశారుకొన్నేళ్లుగా నిరంతరాయంగా పెట్టిన పెట్టుబడులు ఇప్పటికే ఆశించిన ఫలితాలను ఇచ్చాయనిదీనివల్ల రైల్వే ప్రమాదాలు దాదాపు 95 శాతం తగ్గినట్లు కేంద్రమంత్రి వెల్లడించారురైల్వే రంగంలో భద్రతను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారుఇందులో భాగంగా రైలు పట్టాలుఇంజిన్లుగూడ్స్ వ్యాగన్లుపాసింజర్ కోచ్‌ల నిర్వహణను మెరుగుపరచటంకవచ్ స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకురావటంసీసీటీవీ కెమెరాల ఏర్పాటుఓవర్ హెడ్ ఎలక్ట్రికల్ (ఓహెచ్ఈవ్యవస్థల ఆధునీకరణరైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయటంవినియోగదారులకు సేవలను మెరుగుపరచటంప్రయాణికులకు అవసరమైన వసతుల కల్పన వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు.

రైల్వే సాంకేతికతలో ప్రొపల్షన్ వ్యవస్థలు అత్యంత కీలకమని, భారతదేశంలో రూపొందించితయారుచేసిన అత్యాధునిక ప్రొపల్షన్ వ్యవస్థలను అమెరికాస్విట్జర్లాండ్జర్మనీఫ్రాన్స్స్పెయిన్ వంటి ప్రపంచ అగ్రదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.

మౌలిక సదుపాయాల కల్పన రికార్డు స్థాయి విజయాలను కేంద్రమంత్రి ప్రస్తావిస్తూ.. 35,000 కి.మీ కొత్త రైల్వే ట్రాక్‌ల నిర్మాణం, 47,000 కి.మీ మేర రైల్వే విద్యుద్దీకరణ చేసినట్లు చెప్పారుబ్రాడ్ గేజ్ నెట్‌వర్క్‌లో 99.5 శాతానికి పైగా విద్యుద్దీకరణ పూర్తయినట్లు తెలిపారువీటితో పాటు వందేభారత్ స్లీపర్చైర్ కార్ రైళ్లుఅమృత్ భారత్నమో భారత్ రైళ్ల తయారీతో పాటు రికార్డు స్థాయిలో కొత్త వ్యాగన్లను చేర్చటం వంటివి వేగంగా జరుగుతున్నాయన్నారు.

రోడ్డు రవాణాతో పోలిస్తే రైలు రవాణా ద్వారా సుమారు 95 శాతం తక్కువగా కాలుష్యం జరుగుతుందని శ్రీ అశ్వినీ వైష్ణవ్ అన్నారుఇది పర్యావరణంవాతావరణం పట్ల ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉండటమే కాకరైల్వేలను పర్యావరణహిత ప్రజా రవాణా వ్యవస్థగా మార్చాలన్న ప్రధానమంత్రి దార్శనికతను ప్రతిబింబిస్తుందని తెలిపారు.

దేశాభివృద్ధికి, ఆర్థిక వృద్ధికిసమ్మిళిత అనుసంధానానికి భారత రైల్వే కీలక ఆధారమని కేంద్ర బడ్జెట్ 2026-27లో కేటాయించిన రికార్డు స్థాయి నిధులు తెలియజేశాయిఈ బడ్జెట్‌లో ప్రకటించిన కార్యక్రమాల ద్వారా వేగవంతమైన కనెక్టివిటీసమర్థవంతమైన లాజిస్టిక్స్పటిష్ఠమైన మౌలిక సదుపాయాలను అందిస్తూవికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా దేశ నిర్మాణంలో భారత రైల్వే కీలక పాత్ర పోషిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2222202) సందర్శకుల సూచీ సంఖ్య : : 64
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi , Odia , Tamil