రైల్వే మంత్రిత్వ శాఖ
ప్రయాణ సమయాన్ని తగ్గిస్తూ సామర్థ్యాన్ని పెంపొందిస్తూ ఈ ఏడాదిలో 549 రైళ్ల వేగాన్ని పెంచిన భారతీయ రైల్వే
మెరుగైన సమయపాలన, వేగవంతమైన ప్రయాణాన్ని సామాన్యులకు అందిస్తూ 2025లో 122 కొత్త రైళ్లను ప్రవేశపెట్టిన రైల్వే
प्रविष्टि तिथि:
09 JAN 2026 6:15PM by PIB Hyderabad
రైల్వే కాలమాన పట్టిక (టీఏజీ) 2026 కింద భారతీయ రైల్వే వివిధ రైల్వే జోన్లలో కొత్త రైళ్లను ప్రవేశపెట్టటం, ఇప్పటికే ఉన్న సేవలను విస్తరించటం, పలు రైళ్ల రాకపోలను పెంచటం, కొన్నింటిని సూపర్ఫాస్ట్గా మార్చుతూ రైళ్లను వేగంగా నడపడం వంటి కీలక చర్యలను తీసుకుంది. సెంట్రల్ రైల్వే (సీఆర్) జోన్ పరిధిలో 30 రైళ్ల వేగాన్ని పెంచిన భారతీయ రైల్వే.. 6 రైళ్లను ఇతర ప్రాంతాలకు పొడగించటంతో పాటు 4 కొత్త రైళ్లను ప్రవేశపెట్టింది. తూర్పు తీర రైల్వేలో (ఈసీఓఆర్) 3 రైళ్ల వేగాన్ని పెంచటం, 4 రైళ్లను పొడిగించడంతోపాటు 4 కొత్త రైళ్లను ప్రవేశపెట్టింది. తూర్పు మధ్య రైల్వేలో (ఈసీఆర్) 12 రైళ్ల వేగాన్ని పెంచటం, 20 రైళ్లను పొడగించటం, 20 కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా గణనీయమైన సౌకర్యాలను నమోదు చేసింది. తూర్పు రైల్వేలో (ఈఆర్) 32 రైళ్ల వేగాన్ని పెంచటం, 4 రైళ్లను పొడిగించటంతో పాటు 6 కొత్త రైళ్లను భారతీయ రైల్వే ప్రవేశపెట్టింది.
ఒక రైలు వేగం, 2 రైళ్ల రాకపోకలను ఉత్తర మధ్య రైల్వే (ఎన్సీఆర్) పెంచింది. 4 రైళ్లను పొడిగించడంతోపాటు 2 కొత్త రైళ్లను ప్రవేశపెట్టింది. ఈశాన్య రైల్వే (ఎన్ఈఆర్) 12 రైళ్ల వేగాన్ని పెంచటంతో పాటు 2 రైళ్ల రాకపోకలను పెంచటం, 4 రైళ్లను పొడిగించింది. ఈ జోనులో 8 కొత్త రైళ్లను కొత్తగా ప్రవేశపెట్టారు. ఈశాన్య సరిహద్దు రైల్వే (ఎన్ఎఫ్ఆర్).. 36 రైళ్ల వేగాన్ని పెంచటంతో పాటు 10 కొత్త రైళ్లను ప్రవేశపెట్టింది. ఉత్తర రైల్వే (ఎన్ఆర్).. 24 రైళ్ల వేగాన్ని పెంచడంతోపాటు 10 రైళ్లను పొడిగించింది. ఇక్కడ 20 రైళ్లను కొత్తగా ప్రవేశపెట్టారు. వాయువ్య రైల్వే (ఎన్డబ్య్లూఆర్).. 89 రైళ్ల వేగం, 2 రైళ్ల రాకపోకలను పెంచింది. ఇది 6 రైళ్ల ప్రయాణ దూరాన్ని పొడిగించింది. వీటితో పాటు 12 కొత్త రైళ్లను కొత్తగా తీసుకొచ్చింది.
దక్షిణ రైల్వే (ఎస్ఆర్).. 75 రైళ్ల వేగాన్ని పెంచటంతో పాటు 2 రైళ్లను సూపర్ఫాస్ట్గా మార్చింది. ఇది 4 రైళ్లను పొడిగించింది.. 6 కొత్త రైళ్లను ప్రవేశపెట్టింది. అన్ని జోన్ల కంటే అత్యధికంగా నైరుతి రైల్వే (ఎస్డబ్ల్యూఆర్).. 117 రైళ్ల వేగాన్ని పెంచటం, 8 రైళ్లను సూపర్ఫాస్ట్గా మార్చటం, 6 రైళ్లను పొడిగించటం, 8 కొత్త రైళ్ల ప్రవేశపెట్టింది.
పశ్చిమ మధ్య రైల్వే (డబ్ల్యూసీఆర్).. 27 రైళ్ల వేగాన్ని పెంచటంతో పాటు 8 కొత్త రైళ్లను ప్రవేశపెట్టింది. పశ్చిమ రైల్వే (డబ్ల్యూ) 80 రైళ్ల వేగం, 2 రైళ్ల రాకపోకలను పెంచింది. 10 రైళ్లను పొడిగించటంతో పాటు 10 కొత్త రైళ్లను ఈ రైల్వే జోన్లో ప్రవేశపెట్టారు.
మొత్తంగా టీఏజీ- 2026 కింద దేశవ్యాప్తంగా 549 రైళ్ల వేగం పెరిగింది.. 10 రైళ్లను సూపర్ఫాస్ట్గా మార్చారు. వీటితో పాటు 8 రైళ్ల రాకపోకలను పెంచటం, 86 రైళ్లను పొడగించటంతో పాటు 122 కొత్త రైళ్లను ప్రవేశపెట్టారు.
ప్రవేశపెట్టిన రైళ్ల వివరాలు
టీఏజీ 2026 కింద ప్రవేశపెట్టిన 122 కొత్త రైళ్లలో ప్రీమియం, ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ ఉన్నాయి. వీటిలో టీఏజీ-టీఓడీ కింద ప్రవేశపెట్టిన 4 రైళ్లతో కలిపి మొత్తం 26 అమృత్ భారత్ రైళ్లు ఉన్నాయి. మొత్తం 60 సర్వీసులతో మెయిల్ లేదా ఎక్స్ప్రెస్ రైళ్లు అత్యధిక వాటాను కలిగి ఉన్నాయి. వీటిలో 8 రైళ్లను టీఏజీ-టీఓడీ ద్వారా ప్రవేశపెట్టారు. వీటితో పాటు 2 హమ్ సఫర్ రైళ్లు, 2 జన్ శతాబ్ది రైళ్లు, 2 నమో భారత్ రాపిడ్ రైల్వే సర్వీసులు, 2 రాజధాని రైళ్లను ప్రవేశపెట్టారు.
సెమీ-హైస్పీడ్ అనుసంధానతను పెంపొందించడానికి 28 వందే భారత్ రైళ్లను కూడా కొత్తగా తీసుకొచ్చారు. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 122 కొత్త రైళ్లను ఈ కాలంలో ప్రవేశపెట్టారు.
రైళ్ల వేగాన్ని పెంచటం
సమయపాలనను మెరుగుపరచటం, ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి టీఏజీ 2026 కింద మొత్తం 549 రైళ్ల వేగాన్ని పెంచారు. వీటిలో 376 రైళ్లను 5-15 నిమిషాల వరకు, 105 రైళ్లను 16-30 నిమిషాల వరకు, 48 రైళ్లను 31-59 నిమిషాల వరకు, 20 రైళ్లను 60 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ ప్రయాణ సమయం తగ్గించేలా రైళ్ల వేగాన్ని పెంచారు.
ఈ విషయంలో నైరుతి రైల్వే (ఎస్డబ్ల్యూఆర్) ప్రధాన సహకారం అందించింది. ఈ జోన్లో 66 రైళ్లను 5-15 నిమిషాలు, 29 రైళ్లను 16-30 నిమిషాలు, 12 రైళ్లను 31-59 నిమిషాలు, 10 రైళ్లను 60 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ వేగవంతం చేశారు. సెంట్రల్ రైల్వే (సీఆర్).. 13 రైళ్లను 5-15 నిమిషాలు, 13 రైళ్లను 16-30 నిమిషాలు, 4 రైళ్లను 31-59 నిమిషాల మేర వేగవంతం చేసింది. తూర్పు తీర రైల్వే (ఈసీఓఆర్).. 2 రైళ్లను 5-15 నిమిషాలు, ఒక రైలును 16-30 నిమిషాల మేర వేగవంతం చేసింది. తూర్పు మధ్య రైల్వే (ఈసీఆర్).. 7 రైళ్లను 5-15 నిమిషాలు, 2 రైళ్లను 16-30 నిమిషాలు, 2 రైళ్లను 31-59 నిమిషాలు, ఒక రైలును 60 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ వేగవంతం చేసింది. 29 రైళ్లను 5-15 నిమిషాలు, 3 రైళ్లను 16-30 నిమిషాల మేర వేగవంతం చేయడం ద్వారా తూర్పు రైల్వే (ఈఆర్) సేవలను మెరుగుపరిచింది.
ఉత్తర మధ్య రైల్వే (ఎన్సీఆర్).. ఒక రైలు ప్రయాణ సమయాన్ని 5–15 నిమిషాల మేర తగ్గించింది. 9 రైళ్లను 5–15 నిమిషాలు, 3 రైళ్లను 16–30 నిమిషాల మేర ఈశాన్య రైల్వే (ఎన్ఈఆర్) వేగవంతం చేసింది. ఈశాన్య సరిహద్దు రైల్వే (ఎన్ఎఫ్ఆర్).. 20 రైళ్లను 5–15 నిమిషాలు, 10 రైళ్లను 16–30 నిమిషాలు, 3 రైళ్లను 31–59 నిమిషాలు, 3 రైళ్లను 60 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ ప్రయాణ సమయం తగ్గించేలా వేగవంతం చేసింది. ఉత్తర రైల్వే (ఎన్ఆర్).. 22 రైళ్ల ప్రయాణ సమయాన్ని 5–15 నిమిషాలు, 2 రైళ్ల సమయాన్ని 16–30 నిమిషాల మేర తగ్గించింది. వాయువ్య రైల్వే (ఎన్డబ్ల్యూఆర్) 67 రైళ్లను 5–15 నిమిషాలు, 14 రైళ్లను 16–30 నిమిషాలు, 7 రైళ్లను 31–59 నిమిషాలు, ఒక రైలును 60 నిమిషాల కంటే ఎక్కువ ప్రయాణ సమయం ఆదా అయ్యేలా వేగవంతం చేసింది.
ఆగ్నేయ మధ్య రైల్వే (ఎస్ఈసీఆర్).. 9 రైళ్లను 5-15 నిమిషాలు, 2 రైళ్లను 16-30 నిమిషాల మేర వేగవంతం చేసింది. దక్షిణ రైల్వే (ఎస్ఆర్).. 53 రైళ్లను 5-15 నిమిషాలు, 10 రైళ్లను 16-30 నిమిషాలు, 9 రైళ్లను 31-59 నిమిషాలు, 3 రైళ్లను 60 నిమిషాల కంటే ఎక్కువ ప్రయాణ సమయం ఆదా అయ్యేలా వేగవంతం చేసింది. పశ్చిమ మధ్య రైల్వే (డబ్ల్యూసీఆర్) 25 రైళ్లను 5-15 నిమిషాలు, ఒక రైలును 16-30 నిమిషాలు, ఒక రైలును 31-59 నిమిషాల మేర వేగవంతం చేసింది. 53 రైళ్లను 5-15 నిమిషాలు, 15 రైళ్లను 16-30 నిమిషాలు, 10 రైళ్లను 31-59 నిమిషాలు, 2 రైళ్లను 60 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ ప్రయాణ సమయం తగ్గించేలా పశ్చిమ రైల్వే (డబ్ల్యూఆర్) వేగవంతం చేసింది.
ప్రయాణ సమయాన్ని తగ్గించడం, ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడంపై భారతీయ రైల్వేలు కలిగి ఉన్న బలమైన దృష్టిని టీఏజీ 2026 తెలియజేస్తోంది. వివిధ జోన్లలో 549 రైళ్ల వేగాన్ని పెంచడం ద్వారా ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా వేగవంతమైన, మరింత నమ్మదగిన రైల్వే సేవలను అందిస్తూ సమయపాలన, కార్యాచరణ సామర్థ్యం, అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది.
***
(रिलीज़ आईडी: 2213072)
आगंतुक पटल : 12