రైల్వే మంత్రిత్వ శాఖ
భారత రాష్ట్రపతి నుంచి జాతీయ ఇంధన సంరక్షణ అవార్డు-2025ను అందుకున్న మియానా రైల్వేస్టేషన్
గుణలోని మియానా స్టేషన్లో ఎల్ఈడీ లైటింగ్, బీఎల్డీసీ ఫ్యాన్లు, స్మార్ట్ లైటింగ్ సిస్టమ్స్ ద్వారా 9,687 యూనిట్ల విద్యుత్ ఆదా
నాడు పోస్టు చేయడమైనది:
15 DEC 2025 6:59PM by PIB Hyderabad
ఇంధన సంరక్షణలో భారతీయ రైల్వే కీలక ఘట్టాన్ని చేరుకుంది. జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో మియానా రైల్వే స్టేషన్కు జాతీయ ఇంధన సంరక్షణ అవార్డు-2025ను గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము అందజేశారు. పశ్చిమ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీమతి శోభనా బందోపాధ్యాయ ఈ అవార్డును అందుకున్నారు. రవాణా విభాగం (రైల్వేస్టేషన్)లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన యూనిట్గా మియానా రైల్వేస్టేషన్కు గుర్తింపు లభించింది.
ఈ అవార్డును ఎనర్జీ ఎఫిషియెన్సీ బ్యూరో (బీఈఈ) అందిస్తుంది. ఇంధన సంరక్షణలో అత్యుత్తమ కృషి చేసినందుకు ఈ పురస్కారం ద్వారా సత్కరిస్తుంది. ఎల్ఈడీ లైటింగ్, బీఎల్డీసీ ఫ్యాన్లు, 30 నుంచి 70% స్మార్ట్ లైటింగ్ సర్య్కూట్ ఆపరేషన్ వ్యవస్థలను సమర్థవంతంగా ఉపయోగించినందుకుగానూ మియానా రైల్వేస్టేషన్ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ చర్యల ద్వారా 9,687 యూనిట్ల విద్యుత్ను స్టేషన్ ఆదా చేయగలిగింది. దీనిద్వారా ఇంధన సామర్థ్యం, సుస్థిరాభివృద్ధిపై భారత రైల్వే దృష్టి సారిస్తుందని స్పష్టమవుతోంది.
ఇంధన పొదుపు, వ్యయ నియంత్రణ, పర్యావరణ అనుకూల కార్యకలాపాలకు భారతీయ రైల్వే ప్రాధాన్యతనిస్తుంది. ఈ విధానాల సమర్థవంతమైన అమలు, సుస్థిరాభివృద్ధికి మియనా రైల్వేస్టేషన్ ఆదర్శంగా నిలిచింది.
(రిలీజ్ ఐడి: 2204505)
సందర్శకుల సూచీ సంఖ్య : : 27