ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామ రాజు జిల్లాలో బస్సు ప్రమాదం.. ప్రాణనష్టం.. సంతాపం తెలిపిన ప్రధానమంత్రి


పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియాను ప్రకటించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 12 DEC 2025 9:09AM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామ రాజు జిల్లాలో బస్సు ప్రమాదం ప్రాణనష్టానికి దారితీసినందుకు ప్రదానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల వంతున, గాయపడ్డ వారికి రూ.50,000 వంతున ఎక్స్‌గ్రేషియాను అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పీఎంఓ ఇండియా ఇలా తెలిపింది:
‘‘ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామ రాజు జిల్లాలో బస్సు ప్రమాదం ప్రాణనష్టానికి దారితీయడం చాలా బాధాకరం. బాధితులకూ, వారి కుటుంబ సభ్యులకూ ఈ కష్ట కాలంలో నేను ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
మృతుల కుటుంబ సభ్యులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను అందిస్తారు. గాయపడ్డ వారికి రూ.50,000 అందిస్తారు: ప్రధానమంత్రి’’ 


(रिलीज़ आईडी: 2202768) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam