సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా చిన్న తరహా పరిశ్రమల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడానికి, డిజిటలీకరణను ప్రోత్సహించడానికి అనేక పథకాలను అమలు చేసిన ప్రభుత్వం


దేశవ్యాప్తంగా ఏర్పాటు కానున్న 20 కొత్త సాంకేతిక కేంద్రాలు (టీసీలు), 100 విస్తరణ కేంద్రాలు (ఈసీలు)
ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖకు చెందిన క్షేత్ర స్థాయి సంస్థల్లో ఏర్పాటైన 65 ఎగుమతుల సౌలభ్య కేంద్రాలు(ఈఎఫ్‌సీలు)

प्रविष्टि तिथि: 09 DEC 2025 10:58AM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా చిన్న తరహా పరిశ్రమల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడానికిడిజిటలీకకరణను ప్రోత్సహించడానికి వివిధ పథకాలను సూక్ష్మచిన్నమధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈమంత్రిత్వ శాఖ అమలు చేస్తోందివాటిలో ఎంఎస్ఈ-క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం (కామన్ ఫెసిలిటీ కేంద్రాలు), టూల్ రూంలు/టెక్నాలజీ కేంద్రాలుసూక్ష్మచిన్న పరిశ్రమలు (ఎంఎస్ఈ)- గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్ ఫైనాన్సింగ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ (గిఫ్ట్పథకంఎంఎస్ఎంఈ ఛాంపియన్ పథకం ఉన్నాయిఇవి ఎంఎస్ఎంఈల్లో ఆధునికీకరణనైపుణ్యం-నాణ్యతాభివృద్ధిఅధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంహరిత సాంకేతికత స్వీకరణనుపోటీతత్వాన్ని పెంచడానికి తోడ్పడతాయిఉద్యమ్ పోర్టల్ఎంఎస్ఎంఈ ఛాంపియన్స్ పోర్టల్గవర్నమెంట్ ఈ-మార్కెట్ ఫ్లేస్ (జీఈఎం), ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ (టీఆర్ఈడీఎస్), ఎంఎస్ఎంఈ మార్ట్ఎంఎస్ఎంఈ సంబంధ్ఆన్‌లైన్ వివాద పరిష్కార (ఓడీఆర్పోర్టల్ లాంటి కార్యక్రమాల ద్వారా డిజిటలీకరణను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందివీటి ద్వారా డిజిటల్ రిజిస్ట్రేషన్లుఆన్‌లైన్ సేకరణ-మార్కెట్ సౌలభ్యంరుణాల స్వీకరణఫిర్యాదుల పరిష్కారం తదితర సేవలకు వీలు కల్పించి దేశ వ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈలకు సహకారం అందిస్తుంది.

దేశ వ్యాప్తంగా 20 కొత్త టెక్నాలజీ కేంద్రాలు (టీసీలు), 100 ఎక్స్‌టెన్షన్ కేంద్రాలు (ఈసీలుఏర్పాటు చేయడానికి ‘కొత్త టెక్నాలజీ కేంద్రాలు/విస్తరణ కేంద్రాల స్థాపన’ అనే పథకాన్ని సూక్ష్మచిన్నమధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఎస్ఎంఈఅమలు చేస్తుందిదీని ద్వారా ఎంఎస్ఎంఈల ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా.. సాంకేతికతనైపుణ్యమున్న మానవ వనరులుమార్గదర్శక సేవలకు సంబంధించిన పరిష్కారాలను అందించడానికి టీసీల భౌగోళిక పరిధిని విస్తరించడమే దీని లక్ష్యంఇది క్షేత్రస్థాయిలో ఎంఎస్ఎంఈల మధ్య పోటీతత్వాన్నిలాభదాయకతను పెంచుతుందిఈ పథకం ద్వారా ఆకాంక్షాత్మక జిల్లాలైన గయ (బీహార్), బొకారో (జార్ఖండ్)లోని రెండు ప్రాంతాలతో సహా 20 ప్రదేశాల్లో కొత్త టెక్నాలజీ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది.

క్షేత్ర స్థాయిలో ఉన్న ఎంఎస్ఎంఈ అభివృద్ధి-సౌలభ్య కార్యాలయాలుఎంఎస్ఎంఈ టెక్నాలజీ కేంద్రాలుఎంఎస్ఎంఈ పరీక్షా కేంద్రాల్లో 65 ఎగుమతుల సౌలభ్య కేంద్రాలు (ఈఎఫ్‌సీ)లను ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందిఎగుమతుల్లో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు అవసరమైన మార్గదర్శకత్వాన్నిమద్దతును ఎంఎస్ఎంఈలకు అందించడమే దీని లక్ష్యం.

లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారాన్ని సూక్ష్మచిన్నమధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లిఖితపూర్వకంగా అందించారు.


(रिलीज़ आईडी: 2201201) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil , Kannada