సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జ్ఞాన భారతం కార్యక్రమం

प्रविष्टि तिथि: 08 DEC 2025 3:36PM by PIB Hyderabad

భారత్‌లో చేతిరాత ప్రతుల జ్ఞాన సంపదపై సర్వేను చేపట్టడంపూర్తి వివరాల్ని సేకరించడంసంరక్షించడండిజిటల్ రూపంలోకి మార్చడంప్రజలకు అందుబాటులో ఉంచడం అనే లక్ష్యాలతో జ్ఞాన భారతం పేరిట ఒక ప్రధాన కార్యక్రమాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ చేపడుతుందని ఈ సంవత్సరపు కేంద్ర బడ్జెటు (84వ పేరా)లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందిఈ కార్యక్రమంలో భాగంగా విద్యాసంస్థలూవస్తు ప్రదర్శనశాలలూగ్రంథాలయాలూసేకరణాభిలాషుల సహాయ సహకారాలను తీసుకునిఒక కోటికి పైగా రాత ప్రతులను పరిరక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారుసమాచారాన్ని దేశవిదేశాలకు అందుబాటులో ఉంచడానికి వీలుగా  ఆధునిక సాంకేతికతనూకృత్రిమ మేధనూ ఉపయోగించుకుంటూ జాతీయ డిజిటల్ భాండాగారాన్ని  ఏర్పాటు చేస్తారుఈ కార్యక్రమానికి 2025-2031 మధ్య కాలానికి రూ.491.66 కోట్లను ఆర్థిక స్థాయీసంఘం (ఎస్ఎఫ్‌సీమంజూరు చేసింది.
జ్ఞాన భారతం డిజిటల్ వెబ్ పోర్టల్‌ను ప్రధానమంత్రి ప్రారంభించారు. 31 సంస్థలతో అవగాహన ఒప్పందంపై సంతకాలయ్యాయివాటిలో 19 సంస్థలు క్లస్టర్ సెంటర్లుగానూమిగతా 12 సంస్థలు స్వతంత్ర కేంద్రాలుగానూ సేవలను అందిస్తాయిఇవి అయిదు జ్ఞాన భారత కీలక విభాగాలు.. 1. సర్వేకేటలాగింగ్, 2. సంరక్షణసామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు, 3. సాంకేతికతడిజిటలీకరణ; 4. భాషా విజ్ఞానంఅనువాదం, 5. పరిశోధనప్రచురణప్రజాసంబంధాలకు.. సంబంధించిన సేవల్ని అందిస్తాయిదేశమంతటా క్లస్టర్ సెంటర్లకూస్వతంత్ర కేంద్రాలకూ తోడ్పడటానికి సాంకేతిక భాగస్వాముల్ని ఖరారు చేశారుఇంతవరకు సుమారు 3.5 లక్షల రాతప్రతులకు జ్ఞాన భారతం కార్యక్రమంలో భాగంగా డిజిటల్ రూపాన్నిచ్చారు.                      
సంస్థల్నీపండితుల్నీసమాజాల్నీసేకరణాభిలాషుల్నీ ఏకం చేస్తూ దేశంలో చేతిరాత పుస్తకాల బృహత్ వారసత్వాన్ని పరిరక్షించడండిజిటలీకరించడంపునరుత్తేజితం చేయడమనే జాతీయ వాగ్దానాన్ని ఢిల్లీ డిక్లరేషన్‌లో ప్రకటించారు. (దీనిని జ్ఞాన భారతం సంకల్ప పత్రం అని కూడా పేర్కొన్నారు). రాతప్రతులు భారత నాగరికత సజీవ స్మృతులు అని ఈ డిక్లరేషన్ స్పష్టం చేసిందిసాంప్రదాయిక జ్ఞానానికి సమకాలీన సందర్భ శుద్ధిని సంతరించడానికి ఆధునిక సంరక్షణ పద్ధతులూభారీ స్థాయిలో డిజిటల్ లభ్యతలతో పాటు పరిశోధనను నవీకరించాల్సిన అవసరం ఎంతయినా ఉందని కూడా ఇది పిలుపునిస్తోందివారసత్వ పరిరక్షణను ప్రజా ఉద్యమంగా మలిచిప్రపంచ స్థాయిలో సహకారాన్ని ప్రోత్సహించడం ద్వారా  రాతప్రతుల ఆధారిత జ్ఞానార్జనకు భారత్‌ను ఒక ప్రపంచ కేంద్రంగా ఈ డిక్లరేషన్ నిలబెడుతూనే విభిన్న రాతప్రతుల్నీజ్ఞాన సంప్రదాయాల్నీ కాపాడడంలో కూడా ఒక ముఖ్య పాత్రను పోషిస్తోంది.    
జ్ఞాన భారతం అఖిల భారత స్థాయిలో అమలవుతున్న కార్యక్రమంకాబట్టి దీని పరిధి దేశంలో ఏ
నిర్దిష్ట రాష్ట్రానికోప్రాంతానికో పరిమితం కాదుదీనికి అనుగుణంగా మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో గల డాక్టర్ హరిసింగ్ గౌర్ విశ్వవిద్యాలయంతో ఎంఓయూను కుదుర్చుకున్నారు.
సంగీత నాటక అకాడమీ సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో భాగంగా ఉన్న ఒక స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థఇది భారతదేశ శాస్త్రీయసాంప్రదాయకగిరిజనజానపద ప్రదర్శన కళల్నీఒడిస్సీ నాట్యంఒడిస్సీ సంగీతంసంబల్‌పురీ నాట్యాన్నీ పరిరక్షిచడంతో పాటు ప్రోత్సహించడానికి ఉత్సవాల్నీకార్యశాలల్నీప్రదర్శనల్నీఇతర కార్యక్రమాల్నీ నిర్వహిస్తూ ఉంటుందిసంగీత ఉత్సవాల్నీసెమినార్లనీకార్యశాలల్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటుందిఒడిస్సీ నాట్యంఒడిస్సీ సంగీత కళాకారులకు సంగీత నాటక అకాడమీ పురస్కారంతో పాటు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం వంటి జాతీయ అవార్డులనూ ప్రదానం చేస్తోంది.
కోల్‌కతా లోని తూర్పు మండల సాంస్కృతిక కేంద్రం (ఈజడ్‌సీసీసాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థఈజడ్‌సీసీ ఒడిశా సహా తన సభ్య రాష్ట్రాల్లో జానపద కళను ప్రోత్సహిస్తోంది.   సాంస్కృతిక కార్యక్రమాల్నీఉత్సవాల్నీ నిర్వహిస్తూ చైతన్యవంతమైన జానపద నృత్య కళారూపైన సంబల్‌పురీ నృత్య కార్యక్రమాల్ని తరచుగా ఏర్పాటు చేస్తూ ఉంటుంది.
ఈ సమాచారాన్ని కేంద్ర పర్యాటకసాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ ఈ రోజు లోక్‌సభలో రాతపూర్వకంగా ఇచ్చిన ఒక సమాధానంలో తెలిపారు.

 

***


(रिलीज़ आईडी: 2200661) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी