గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన ఉద్భవ్-2025: జాతీయ స్థాయిలో మెరిసిన గిరిజన ప్రతిభ, పతకాల పట్టికలో అగ్రస్థానంలో తెలంగాణ


ముగిసిన ఆరో జాతీయ ఈఎంఆర్ఎస్ సాంస్కృతిక, సాహిత్య ఉత్సవం: దేశీయ ప్రతిభ సత్తా చాటిన 1500 మందికి పైగా గిరిజన విద్యార్థులు

కేఎల్ విశ్వవిద్యాలయంలో ఉద్భవ్-2025ను ముగించిన ఎన్ఈఎస్‌టీఎస్: గిరిజన సంస్కృతి, కళలు, యువ నాయకత్వాన్ని చాటి చెప్పిన ఉత్సవం

प्रविष्टि तिथि: 08 DEC 2025 9:11AM by PIB Hyderabad

గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలో గిరిజన విద్యార్థుల కోసం జాతీయ విద్యా సొసైటీ (ఎన్ఈఎస్‌టీఎస్నిర్వహించిన ఆరో జాతీయ ఈఎంఆర్ఎస్ సాంస్కృతికసాహిత్యకళా ఉత్సవం ఉద్భవ్ 2025 ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లావడ్డేశ్వరంలో ఉన్న కేఎల్ విశ్వవిద్యాలయంలో ముగిసిందిఈ కార్యక్రమాన్ని ఎన్ఈఎస్‌టీఎస్ నిర్వహించగాఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఏపీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ గురుకులంఆతిథ్యమిచ్చిందికేఎల్ విశ్వవిద్యాలయం అందించిన సంస్థాగత సహకారంతో 2025 డిసెంబర్ నుంచి వరకు ఈ కార్యక్రమం జరిగింది.

 

ముగింపు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమమహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి జీ సంధ్యారాణిసామాజిక సంక్షేమందివ్యాంగులువయో వృద్ధుల సంక్షేమంసచివాలయంగ్రామ వాలంటీర్ శాఖ మంత్రి డాక్టర్ డీఎస్ స్వామిపర్యాటకంసాంస్కృతికసినిమాటోగ్రఫీ శాఖలతో పాటు గుంటూరు జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న శ్రీ కందుల దుర్గేశ్ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమంగిరిజన సంక్షేమం విభాగం కార్యదర్శి శ్రీ ఎంఎం నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారువీరి హాజరు ఈ కార్యక్రమ గౌరవాన్ని పెంచిందిఈ పోటీల్లో పాల్గొన్న వారికి స్ఫూర్తినిచ్చింది.

ఉత్తమ ప్రదర్శన చేసిన గిరిజన విద్యార్థులను అతిథులు అభినందించారుగిరిజన విద్యసంస్కృతీ పరిరక్షణసాధికారతను బలోపేతం చేయడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కనబరుస్తున్న అంకితభావాన్ని స్పష్టం చేశారుసుసంపన్నమైన భారత గిరిజన వారసత్వాన్ని ప్రదర్శించడమే కాకుండా.. గిరిజన యువతలో ఆత్మవిశ్వాసంనాయకత్వ లక్షణాలుజాతీయ స్థాయి గుర్తింపును పెంపొందిచడంలో ఉద్భవ్ లాంటి వేదికలు ఉత్ప్రేరకంగా పని చేస్తాయన్నారు.

ఎన్ఈఎస్‌టీఎస్ కమిషనర్ శ్రీ అజిత్ కుమార్ శ్రీవాస్తవ (ఐఆర్ఏఎస్), ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమంగిరిజన సంక్షేమ విభాగం కార్యదర్శి శ్రీ ఎంఎం నాయక్ (ఐఏఎస్మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం జరిగిందిఎన్ఈఎస్‌టీఎస్ఏపీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ అధికారులతో పాటు తన బృందం అందించిన తోడ్పాటుతో ఆర్గనైజింగ్ కార్యదర్శిఏపీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ (గురుకులంకార్యదర్శి శ్రీమతి ఎమ్ గౌతమి (ఐఏఎస్ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారువారి సమన్వయంతో అన్ని కార్యక్రమాలు సజావుగా పూర్తయ్యాయి.

ఈ ఉత్సవంలో 22 రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన మొత్తం 1,558 విద్యార్థులు పాల్గొన్నారువారిలో 524 మంది బాలురు, 1,024 మంది బాలికలు ఉన్నారుఅలాగే 45 మంది బృంద నాయకులు 178 మంది ఎస్కార్టులు, 22 మంది కంటింజెంట్ మేనేజర్లు, 22 మంది లైసన్ అధికారులు, 10 మంది అధికారులు, 19 మంది ఎన్ఈఎస్‌టీఎస్ అధికారులు, 137 మంది సబ్ కమిటీ సభ్యులు, 48 మంది జ్యూరీ సభ్యులు, 60 మంది రాష్ట్రఏపీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ అధికారులు పాల్గొన్నారుమూడు రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవంలో భారత గిరిజన తెగల గొప్పతనాన్నివైవిధ్యాన్ని చాటి చెప్పేలా 49 సాంస్కృతికసాహిత్యసృజనాత్మకకళా ప్రదర్శన పోటీలు జరిగాయిఈ పోటీల తొలి రోజు 18 విభాగాల్లోనూరెండో రోజు 22 విభాగాల్లోమూడో రోజు విభాగాల్లో పోటీలు జరిగాయిప్రతి ప్రదర్శన ఉత్తమ ప్రతిభనుసాంస్కృతిక అవగాహననుకళాత్మక అభినయాన్ని చాటి చెప్పింది.

 

వివిధ కేటగిరీల్లో విజేతల ఫలితాలను ముగింపు ఉత్సవంలో ప్రకటించారుపతకాల పట్టికలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవగా.. తదుపరి స్థానాల్లో జార్ఖండ్ఒడిశాఛత్తీస్‌గడ్మధ్యప్రదేశ్ ఉన్నాయిమొత్తం 105 ప్రథమ బహుమతులు, 105 ద్వితీయ బహుమతులు, 105 తృతీయ బహుమతులతో పాటు ఓవరాల్ స్టేట్ ఛాంపియన్‌షిప్‌ను అందించారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ వారి అంకిత భావాన్ని గుర్తిస్తూ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అందించారు.

ఉద్భవ్ 2025లో గుర్తించిన 12 విభాగాల్లో విజేతలు పుణెలోని యశదాలో నిర్వహించే జాతీయ కళా ఉత్సవ్‌లో ఈఎంఆర్ఎస్‌కు ప్రాతినిధ్యం వహిస్తారుఇక్కడ దేశం నలుమూలల నుంచి వచ్చే బృందాలు పాల్గొంటాయిగిరిజన హస్తకళలువిజువల్ ఆర్ట్స్సంప్రదాయ ప్రదర్శనలుదేశీయ సృజనాత్మక వ్యక్తీకరణలు ఈ కార్యక్రమానికి శోభను తీసుకొచ్చాయిఇవి గిరిజన తెగలు పరిరక్షిస్తున్న సాంస్కృతిక సంపదనుకళా సంప్రదాయాలను ప్రదర్శించాయి.

గిరిజన విద్యార్థులకు జాతీయ స్థాయి వేదికను అందించి విశ్వాసాన్ని పెంపొందించివారి సాంస్కృతిక గుర్తింపును ప్రదర్శించే వీలు కల్పించడం ద్వారా సబ్‌ కా సాథ్సబ్ కా వికాస్సబ్ ‌కా విశ్వాస్సబ్ కా ప్రయాస్ అనే ప్రధానమంత్రి దార్శనికతను ఉద్భవ్-2025 బలోపేతం చేస్తుందిఅలాగే అభివృద్ధి అంతరాలను పూరించడంలోవిద్యాసాంస్కృతిక సామర్థ్యాలను బలోపేతం చేయడంలోగిరిజనయ యువతలో నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించడంలో ఈఎంఆర్ఎస్‌లు పోషిస్తున్న పాత్రను ఈ ఉత్సవం తెలియజేస్తుంది.

దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన యువతకు సమగ్ర విద్యసాంస్కృతిక సాధికారతసృజనాత్మక అవకాశాను అందించేలా తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ.. ఎన్ఈఎస్‌టీఎస్ ఆరో సంచిక విజయవంతంగా ముగిసిందిస్థానిక ప్రతిభను గుర్తించడానికిసాంస్కృతికసాహిత్య రంగాల్లో నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు అవసరమైన వేదికలను అందించడానికి ఈ సంస్థ అంకితమై ఉంది.

 

***


(रिलीज़ आईडी: 2200273) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil