రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

రష్యా అధ్యక్షుడికి ఆతిథ్యమిచ్చిన భారత రాష్ట్రపతి


ఎన్నో ఏళ్లుగా స్థిరంగా ఉన్న మన స్నేహం.. రాబోయే రోజుల్లోనూ మరింత బలపడుతుంది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

प्रविष्टि तिथि: 05 DEC 2025 10:14PM by PIB Hyderabad

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఇవాళ (డిసెంబర్ 5, 2025) రాష్ట్రపతి భవన్‌లో కలిశారుగౌరవార్థంగా విందును కూడా ఏర్పాటు చేశారు.

అధ్యక్షుడు పుతిన్‌కుఆయన ప్రతినిధి బృందానికి రాష్ట్రపతి భవన్‌కు స్వాగతం పలికిన భారత రాష్ట్రపతి.. పుతిన్‌ పర్యటన కీలక ఘట్టాన్ని సూచిస్తుందన్నారుభారత్-రష్యా వ్యూహాత్మక భాగస‌్వామ్యానికి ఇది 25వ వార్షికోత్సవమని తెలిపారుఅక్టోబర్ 2000వ సంవత్సరంలో పుతిన్ అధ్యక్షుడిగా మొదటిసారి భారత్‌ను సందర్శించినప్పుడు ఈ భాగస్వామ్యం మొదలైందని చెప్పారు.

భారత్-రష్యా ప్రత్యేకవిశేష భాగస్వామ్యానికి అధ్యక్షుడు పుతిన్‌ అందిస్తున్న మద్దతువ్యక్తిగత ప్రాధాన్యతను రాష్ట్రపతి ప్రశంసించారు.

శాంతిస్థిరత్వంపరస్పర సామాజిక-ఆర్థికసాంకేతిక పురోగతికి సంబంధించి ఉమ్మడి ప్రాధాన్యత ద్వారా మన భాగస్వామ్యానికి మార్గనిర్దేశం లభిస్తుందని ఆమె అన్నారుబహుముఖ భాగస్వామ్యానికి ఈ 2025వ సంవత్సరం మంచి ఫలితాలనిచ్చిందని చెప్పారుఈ ఏడాదిలో ఉన్నత-స్థాయి రాజకీయ మార్పిడులువాణిజ్యంఆర్థిక వ్యవస్థరక్షణపౌర అణు సహకారంఅంతరిక్షంసైన్స్ అండ్ టెక్నాలజీవిద్యసంస్కృతిక్రియాశీలక ప్రజల సంబంధాల వంటి అంశాల్లో మెరుగైన పురోగతి సాధ్యమైందని వెల్లడించారు.

భారత్-రష్యా 23వ వార్షిక సమావేశ ఉమ్మడి ప్రకటన మన బంధాల ప్రత్యేక స్వభావాన్ని ప్రతిబింబిస్తుందనిద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు సమగ్రమైన వ్యవస్థను అందిస్తుందని రాష్ట్రపతి అన్నారు.

ఇరుదేశాల ప్రజల మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక బంధాన్ని రాష్ట్రపతి స్మరించుకున్నారుప్రాచీన వాణిజ్య మార్గాల నుంచి మహాత్మాగాంధీలియో టాల్‌స్టాయ్ మధ్య లేఖల ద్వారా జరిగిన స్ఫూర్తిదాయకమైన ఉత్తరప్రత్యుత్తరాల వరకుఒకరి గొప్ప సాంస్కృతికసాహిత్యకళాత్మక వారసత్వంపై మరొకరికున్న పరస్పర అభిమానం వరకు ఈ సాంస్కృతిక బంధం విస్తరించిందన్నారు.

రెండు దేశాల మధ్య ఏళ్లుగా స్థిరంగా ఉన్న స్నేహంరాబోయే ఏళ్లల్లోనూ కొనసాగుతుందని ఇరువురు నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు

 

(रिलीज़ आईडी: 2200039) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali