సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
సాంస్కృతిక వారసత్వం, మ్యూజియాల డిజిటలైజేషన్
प्रविष्टि तिथि:
01 DEC 2025 3:37PM by PIB Hyderabad
సాంస్కృతిక వారసత్వ సంరక్షణ, మ్యూజియాలను డిజిటైజేషన్, సాంస్కృతిక ప్రచారానికి సంబంధించి కృత్రిమ మేధ, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి ఆధునిక సాంకేతికతల వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న వివిధ కార్యక్రమాల్లో నేషనల్ మిషన్ ఆన్ మాన్యుమెంట్స్ (జాతీయ స్మారక చిహ్నాలు, పురాతన వస్తువుల మిషన్) , యాంటిక్విటీస్, మ్యూజియాల డిజిటైజేషన్ కార్యక్రమం, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఆధారంగా సందర్శకుల అనుభవాలు వంటివి ఉన్నాయి. సాంస్కృ తిక మంత్రిత్వ శాఖ ఆధీనంలోని అనేక మ్యూజియాల్లో సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు, మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఏఆర్-వీఆర్, ప్రొజెక్షన్లు, డిజిటల్ కియోస్క్ల వంటి ఆధునిక డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాలను అమలు చేస్తున్నారు. మ్యూజియాల్లో ప్రదర్శనలో ఉన్న వివిధ కళాఖండాలను డిజిటైజ్ చేయడానికి సంస్కృతి మంత్రిత్వ శాఖ ‘‘జటాన్’’ అనే ప్రత్యేక సాంకేతికతను కూడా ఉపయోగిస్తోంది.
జటాన్ సాంకేతికత ద్వారా ఇప్పటి వరకు 8 ప్రఖ్యాత జాతీయ స్థాయి మ్యూజియాలు, 2 ఏఎస్ఐ మ్యూజియాలు డిజిటైజ్ చేశారు. ఇప్పటివరకు డిజిటైజ్ చేసిన పురాతన వస్తువులను https://www.museumsofindia.gov.in/repository లింక్ ద్వారా వీక్షించవచ్చు.
సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తులిప్ కార్యక్రమం ద్వారా అట్టడుగున ఉన్న కళాకారులను బలోపేతం చేసేందుకు, ఈ-మార్కెటింగ్ ద్వారా వారి ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేసేందుకు, అమ్మకాల కోసం ఒక వేదికను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
భారత పురావస్తు సర్వే సంస్థ ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని ఖజురాహో సమీపంలో వింధ్య ప్రాంతంలో ఓ పురావస్తు మ్యూజియాన్ని నిర్వహిస్తుంది. 2023లో కొత్త ప్రదర్శన గ్యాలరీలు, మరిన్ని పురాతన వస్తువులను ప్రజల కోసం చేర్చి ఈ మ్యూజియాన్ని ఆధునీకరించారు.
ఈ సమాచారాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ నేడు క్సభలో లిఖితపూర్వక సమాధానంలో అందించారు.
***
(रिलीज़ आईडी: 2197107)
आगंतुक पटल : 7