వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రైలు వాణిజ్య అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు భారత్, నేపాల్ ఒప్పందం


భారత్-నేపాల్ రవాణా మార్గాల విస్తరణపై తుది నిర్ణయం.. సంతకాలు

నాడు పోస్టు చేయడమైనది: 13 NOV 2025 3:30PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో కేంద్ర వాణిజ్యపరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్నేపాల్ ప్రభుత్వ పరిశ్రమవాణిజ్యసరఫరాల మంత్రి శ్రీ అనిల్ కుమార్ సిన్హా మధ్య నేడు ద్వైపాక్షిక సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో భారత్ నేపాల్ మధ్య ఉన్న రవాణా ఒప్పందానికి సంబంధించిన విధానాలను సవరిస్తూ అంగీకార పత్రాలను పరస్పరం మార్చుకున్నారుఈ సవరణ ద్వారా జోగ్బాని (భారత్) – బిరత్‌నగర్ (నేపాల్మధ్య రైలుమార్గం ద్వారా సరుకు రవాణా సులభతరం కానుందిఇందులో బల్క్ కార్గో (ప్యాకేజింగ్ లేకుండా పెద్ద మొత్తంలో రవాణా చేసే సరుకురవాణా విస్తరణ కూడా ఉందిఈ స్వేచ్ఛా విధానం  కోల్‌కతా–జోగ్బానికోల్‌కతా–నౌతన్వా (సునౌలి), విశాఖపట్నం–నౌతన్వా (సునౌలివంటి ప్రధాన రవాణా కారిడార్‌లకు విస్తరించనుందితద్వారా రెండు దేశాల మధ్య బహుమాధ్యమ వాణిజ్య అనుసంధానం బలోపేతం అవుతుందిఅంతేగాక ఇతర  దేశాలతో నేపాల్ వాణిజ్యం మెరుగుపడే అవకాశం ఉంది.

పైన పేర్కొన్న  అంగీకార పత్రం ద్వారా జోగ్బాని-బిరత్‌నగర్ రైలు మార్గం ద్వారా కంటైనర్ సరుకులుబల్క్ కార్గో రెండిటీ రవాణాకు ప్రత్యక్ష రైలు అనుసంధానం సాధ్యమైందిఇది కోల్‌కతావిశాఖపట్నం ఓడరేవుల నుంచి నేపాల్‌లోని మోరాంగ్ జిల్లాలో ఉన్న నేపాల్ కస్టమ్స్ యార్డ్ కార్గో స్టేషన్‌కు సరుకు రవాణాను సులభతరం చేస్తుందిభారత ప్రభుత్వ సహాయంతో నిర్మించిన ఈ రైలు మార్గాన్ని  2023 జూన్ 1న భారత్నేపాల్ ప్రధానమంత్రులు సంయుక్తంగా ప్రారంభించారు.

ఈ సమావేశంలో సమగ్ర చెక్‌ పోస్టులుఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధితో సహా సరిహద్దు అనుసంధానాన్నివాణిజ్య సౌకర్యాన్ని పెంపొందించడానికి కొనసాగుతున్న ద్వైపాక్షిక కార్యక్రమాలపై కూడా చర్చించారునేపాల్ అంతర్జాతీయ వాణిజ్యంలో గణనీయమైన వాటాను కలిగి ఉన్న భారత్.. ఇప్పటికీ ఆ దేశ అతిపెద్ద వాణిజ్యపెట్టుబడి భాగస్వామిగా కొనసాగుతోందిప్రస్తుత చర్యలు రెండు దేశాల మధ్య ఆర్థికవాణిజ్య సంబంధాలను మరింత బలపరచడమే కాకుండా  ఇతర దేశాలతో నేపాల్ వాణిజ్య సంబంధాలను కూడా మెరుగుపరిచేందుకు అవకాశం కల్పిస్తాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2189756) సందర్శకుల సూచీ సంఖ్య : : 67
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Gujarati