ప్రధాన మంత్రి కార్యాలయం
ఛత్తీస్గఢ్ అవతరణ దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
01 NOV 2025 9:24AM by PIB Hyderabad
ఛత్తీస్గఢ్ అవతరణ దినోత్సవం 25వ వార్షికోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రకృతికీ, సంస్కృతికి అంకితమైన ఛత్తీస్గఢ్ రాష్ట్రం పురోగతిలో సరికొత్త ప్రమాణాలను నిర్దేశిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ఒకప్పుడు నక్సలిజం బారిన పడిన అనేక ప్రాంతాలు ఇప్పుడు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లోని ప్రతిభావంతులైన ప్రజల కృషి, వ్యాపార నైపుణ్యాలు వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"ఛత్తీస్గఢ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం 25వ వార్షికోత్సవం సందర్భంగా నా సోదరీసోదరులందరికీ శుభాకాంక్షలు. ప్రకృతికీ, సంస్కృతికి అంకితమైన ఈ రాష్ట్రం పురోగతిలో ఈ రోజు సరికొత్త ప్రమాణాలను నిర్దేశిస్తోంది. ఒకప్పుడు నక్సలిజం బారిన పడిన అనేక ప్రాంతాలు ఇప్పుడు అభివృద్ధి కోసం పోటీ పడుతున్నాయి. కష్టపడి పనిచేసే తత్వం, నైపుణ్యం కలిగిన ప్రజల అంకితభావం, వ్యాపార నైపుణ్యాలతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిన భారత్ దార్శనికతను సాకారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నేను విశ్వసిస్తున్నాను."
***
(Release ID: 2185531)
Visitor Counter : 4
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam