ఉప రాష్ట్రపతి సచివాలయం
శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట విషాదం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి
Posted On:
01 NOV 2025 3:00PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో గల కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట విషాదం పట్ల భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీ.పీ. రాధాకృష్ణన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ దురదృష్టకర సంఘటనలో ప్రాణనష్టం అత్యంత బాధాకరమన్న ఉపరాష్ట్రపతి, ఈ విషాదం చాలా బాధ కలిగించిందన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
***
(Release ID: 2185522)
Visitor Counter : 3