ప్రధాన మంత్రి కార్యాలయం
ఛఠ్ మహాపర్వం ముగింపు సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
28 OCT 2025 7:56AM by PIB Hyderabad
ఛఠ్ మహాపర్వం ముగింపు సందర్భంగా భక్తులందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
నాలుగు రోజుల పాటు జరిగిన ఈ గొప్ప పండుగ ఈ ఉదయం భగవాన్ సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించటంతో ముగిసిందని ప్రధానమంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా, ఛఠ్ పూజ సంప్రదాయంతో భారతదేశంలో దివ్య వైభవం కనిపించిందని ఆయన అన్నారు.
భక్తులు, ఈ పండుగలో పాల్గొన్న వారందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఛఠీ మాత ఆశీస్సులతో అందరి జీవితాల్లో కాంతులు వెల్లివిరియాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"ఈరోజు ఉదయం సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించటంతో ఛఠ్ మహాపర్వం శుభప్రదంగా ముగిసింది. ఈ నాలుగు రోజుల ఛఠ్ పూజ సందర్భంగా దివ్య వైభవాన్ని మనం చూశాము. ఈ పవిత్ర పండుగలో పాల్గొన్న భక్తులందరికీ, వ్రతం ఆచరించిన వారికి, మా కుటుంబసభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు! ఛఠీ మాతా అనంతమైన ఆశీర్వాదాలతో మీ జీవితాలు ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను"
***
(Release ID: 2183450)
Visitor Counter : 6
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam