కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియాలో లాజిస్టిక్స్ సంస్కరణలు, డిజిటల్ ఆవిష్కరణల ద్వారా వికసిత్ భారత్ కోసం కృషి చేస్తోన్న తపాలా విభాగం
నిర్ణీత సమయంలో దేశీయ డెలివరీలను పెంచడం, అంతర్జాతీయ లాజిస్టిక్స్ను వేగంవతం చేసే ఎనిమిది కొత్త సదుపాయాలను ప్రకటించిన కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా
3.57 కోట్లకు పైగా ఆధార్ నమోదులు, అప్డేట్లు.. 43 లక్షల పాస్పోర్ట్ దరఖాస్తుల ప్రక్రియ విజయవంతంగా పూర్తి
దేశవ్యాప్తంగా 9.13 లక్షలకు పైగా పీఎం విశ్వకర్మ టూల్కిట్లు డెలివరీ… డాక్ ఘర్ నిర్యత్ కేంద్రాల ద్వారా విదేశాలకు రూ. 148.19 కోట్ల విలువైన రూ. 6.94 లక్షల షిప్మెంట్లు
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్లో కొత్తగా 3.5 కోట్ల ఖాతాల ప్రారంభం.. 99 శాతానికి ఇంటి వద్దే సేవలు, 59 శాతం మహిళలే
బాలికల పొదుపును ప్రోత్సహించేందుకు 81 లక్షలకు పైగా సుకన్య సమృద్ధి యోజన ఖాతాల ప్రారంభం
Posted On:
17 OCT 2025 7:31PM by PIB Hyderabad
ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా మీడియా సమావేశం నిర్వహించారు. గత ఏడాది కాలంగా తపాలా శాఖ (డీఓపీ), టెలికమ్యూనికేషన్ల శాఖ సాధించిన విజయాలను ఆయన వివరించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతతో సంప్రదాయ పోస్టల్ నెట్వర్క్ నుంచి నమ్మకం, సాంకేతికత, సమ్మిళితత్వంతో కూడిన ప్రతి భారతీయ కుటుంబానికి సేవ చేసే పౌర-కేంద్రీకృత లాజిస్టిక్స్, డిజిటల్ సేవల సంస్థగా తపాలా శాఖ సాధించిన అద్బుతమైన పరివర్తనను కేంద్ర మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు.
2024 జూన్ నుంచి 2025 సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా సేవలను అందించడంలో తపాలా శాఖ గణనీయమైన పురోగతిని సాధించింది. దీనికి సంబంధించిన ముఖ్యాంశాలు:
* 3.57 కోట్లకు పైగా ఆధార్ నమోదులు, అప్డేట్లు పూర్తయ్యాయి. 10 కొత్త పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. 43 లక్షల పాస్పోర్టుల ప్రక్రియ పూర్తయింది.
* దేశవ్యాప్తంగా 9.13 లక్షలకు పైగా పీఎం విశ్వకర్మ టూల్కిట్లను డెలివరీ చేసింది. డాక్ ఘర్ నిర్యత్ కేంద్రాల ద్వారా రూ. 148.19 కోట్ల విలువైన 6.94 లక్షల షిప్మెంట్లు విదేశాలకు వెళ్లాయి.
* బాలికల పొదుపును ప్రోత్సహించేందుకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 3.5 కోట్ల ఖాతాలను (99% ఇంటి వద్దే, 59% మహిళలు), 81.09 లక్షల సుకన్య సమృద్ధి యోజన ఖాతాలను తెరిచింది.
తపాలా విభాగాన్ని మెయిల్, పార్శిల్, అంతర్జాతీయ సంబంధాలు, పీఓఎస్బీ, పీఎల్ఐ, పౌర కేంద్రీకృత సేవలు అనే ఆరు ఉప విభాగాలుగా పునర్వవస్థీకరించారు. సాంకేతికత, హెచ్ఆర్, ఆర్థిక నిర్వహణ, వినియోగదారుల సంతృప్తి అన్న లక్ష్యాలతో ఈ విభాగాలు పనిచేస్తున్నాయి.
ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తికి అనుగుణంగా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ (సీఈపీటీ) స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఐటీ 2.0 ప్రాజెక్టుతో పోస్టల్ విభాగం డిజిటల్ పరివర్తన సాధిస్తోంది. లాజిస్టిక్స్ వ్యవస్థను బలోపేతం చేస్తూ వేగవంతమైన, మరింత నమ్మదగిన డెలివరీలను అందించేందుకు ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీలతో తపాలా విభాగం భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకుంది. ఇది వస్తు డెలవరీ, లాజిస్టిక్స్కు సంబంధించిన మార్కెట్లో వృద్ధి, పోటీతత్వాన్ని పెంచుతూనే కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. వీటితో పాటు పునరాభివృద్ధి చేసిన సీఆర్ఎం (కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్) వేదిక సంప్రదాయ ఫిర్యాదుల పరిష్కారానికి మాత్రమే పరిమితం కాకుండా.. వినియోగదారుల నమ్మకం, విశ్వసనీయతను మెరుగుపరిచేందుకు చురుకైన, అభిప్రాయాల ఆధారిత చర్యలపై దృష్టి సారిస్తోంది.
దేశీయ, అంతర్జాతీయ రవాణా వ్యవస్థను మరింత ముందుకు తీసుకుపోయేందుకు కొన్ని కొత్త తరహా సేవల్ని కేంద్ర మంత్రి ప్రకటించారు. 24, 48 గంటల డెలివరీకి సంబంధించిన 24 స్పీడ్ పోస్ట్- 48 స్పీడ్ పోస్ట్, పూర్తి ట్రాకింగ్తో ప్యాకేజీలను తదుపరి రోజే చేరవేసే సౌకర్యం కూడా ఉంది. డైరెక్ట్ లైన్ ద్వారా విదేశాలకు వేగంగా షిప్పింగ్ చేయనుంది. దీనికోసం తపాలా శాఖ.. వివిధ వాణిజ్య సంస్థలతో భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకుంది. స్పీడ్ పోస్ట్ ఇంటర్నేషనల్, పార్సెల్ లాస్ట్ మైల్..సౌకర్యాల ద్వారా ప్రపంచ దేశాలకు డెలివరీ విషయంలో నిర్ణీత గడువులను అనుసరించటం- మెరుగపరచటంతో పాటు భారత ఎగుమతి, క్షేత్రస్థాయి కనెక్టివిటీని బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
దేశీయంగా తపాలా శాఖ డిజిటల్ చిరునామా వ్యవస్థను తీసుకొచ్చింది. దీనిని డిజిపిన్గా పిలుస్తారు. ఇది దేశం మొత్తాన్ని ఖచ్చితమైన 4మీx4మీల భాగాలుగా విభజించింది. ప్రతి బ్లాక్కు ప్రత్యేకమైన 10-అక్షరాల సంకేతం ఉంది. ఈ మార్గదర్శక కార్యక్రమం పౌర కేంద్రీకృత తపాలా సేవల్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇది జియోస్పెషియల్ ప్రభుత్వ పాలను బలోపేతం చేయటంతో పాటు అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలలో సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది బీఎఫ్ఎస్ఐ రంగంలో డిజిటల్ కేవైసీని సులభతరం చేస్తుంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఈ-గవర్నెన్స్, సేవాలను అందరికి అందుబాటులోకి తేవటంలో విప్లవాత్మక మార్పులతో కూడిన నవ యుగాన్ని ప్రారంభిస్తుంది.
లాజిస్టిక్స్ సంస్కరణలు, డిజిటల్ ఆవిష్కరణల నుంచి సమ్మిళిత వృద్ధి, ఎగుమతుల సులభతరం చేయటం వరకు తపాలా విభాగం పనిచేస్తోంది. వికసిత్ భారత్కు తనవంతు తోడ్పాటునందించేందుకు తపాలాశాఖ ఎప్పటికప్పుడు పునర్వవస్థీకరణ చెందుతోంది.
****
(Release ID: 2180753)
Visitor Counter : 8