ప్రధాన మంత్రి కార్యాలయం
మహా అష్టమి సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
30 SEP 2025 8:35AM by PIB Hyderabad
మహా అష్టమి శుభ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరికీ సుఖశాంతులనూ, ఉత్తమమైన ఆరోగ్యాన్నీ అందించాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. అమ్మవారి స్తుతిని కూడా శ్రీ మోదీ పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని ఇలా పొందుపరిచారు...
‘‘నవరాత్రి లో భాగమైన మహా అష్టమి సందర్భంగా, దేశ ప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు. పవిత్రమైన ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరి జీవనంలో సుఖశాంతులతో పాటు అద్భుతమైన ఆరోగ్యాన్ని అందించాలని నేను కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
***
MJPS/ST
(రిలీజ్ ఐడి: 2173076)
సందర్శకుల సూచీ సంఖ్య : : 26
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam