కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సంపూర్ణ ఆరోగ్య కార్యక్రమాలతో స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ ను పాటిస్తున్న ఈఎస్ఐసీ ఆసుపత్రులు

Posted On: 18 SEP 2025 1:48PM by PIB Hyderabad

8వ జాతీయ పోషకాహార మాసోత్సవంతో పాటు  దేశవ్యాప్తంగా పక్షం రోజుల  ఆరోగ్య ప్రచారం - “స్వస్థ్   నారీసశక్త్ పరివార్ అభియాన్ను ఆరోగ్య,  కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్ఎఫ్డబ్ల్యూఈ నెల 17 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు నిర్వహిస్తోందిప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 17 సెప్టెంబర్, 2025న   8వ జాతీయ పోషకాహార మాసోత్సవంతో పాటు పక్షం రోజుల ఆరోగ్య ప్రచారం - "స్వస్థ్ నారీసశక్త్ పరివార్ప్రచారాన్ని  కూడా ప్రారంభించారుకార్మికఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీదేశవ్యాప్తంగా 160 ఈఎస్ఐ ఆసుపత్రులలో సంపూర్ణ  ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం ద్వారా స్వస్థ్ నారీసశక్త్ పరివార్ ప్రచారంలో  పాల్గొంటోంది.

ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్,  హాస్పిటల్ఫరీదాబాద్

దేశవ్యాప్త స్వస్థ్ నారీసశక్త్ పరివార్ ప్రచారం మొదటి రోజునఫరిదాబాద్ లోని ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్,  ఆసుపత్రి మహిళల ఆరోగ్యంముందస్తు జాగ్రత్తలుసమాజ అవగాహన కల్పిస్తూ అనేక కార్యక్రమాలను నిర్వహించిందిఅధ్యాపకులువైద్య అధికారులుసిబ్బంది సమక్షంలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ పూజా గోయల్,   అసిస్టెంట్ ప్రొఫెసర్నోడల్ ఆఫీసర్ డాక్టర్ రోహిత్ ధాకా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ముందు జాగ్రత్తలు ద్వారా ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడం,  పని చేసే మహిళలకువారి కుటుంబాలకు మెరుగైన  వైద్య సేవలను అందించడంపై ఈఎస్ఐసీ నిరంతర నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది.

షాహి ఎక్స్ పోర్ట్ ,  ధృవ్  గ్లోబల్ సంస్థల్లో కార్మికుల కోసం ఆరోగ్య శిబిరాలు నిర్వహించారుఇక్కడ మహిళలు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సిడిలు),  క్షయవ్యాధికి సంబంధించి ప్రశ్నావళి ఆధారిత స్క్రీనింగ్ చేయించుకున్నారుహిమోగ్లోబిన్బ్లడ్ షుగర్బీపీమధుమేహంరక్తహీనతసాధారణ క్యాన్సర్ల నిర్ధారణ కోసం క్లినికల్ పరీక్షలు కూడా నిర్వహించారుజీవనశైలి రుగ్మతలురుతుక్రమ సమయంలో పరిశుభ్రతవ్యాక్సినేషన్పోషకాహారంరక్తహీనత నివారణపై అవగాహనకౌన్సెలింగ్ సెషన్లు జరిగాయినిక్షయ్ మిత్రల నమోదుక్షయవ్యాధి నివారణ ప్రతిజ్ఞలు కూడా నిర్వహించారు.

స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించడానికి ఫరీదాబాద్లోని ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీహాస్పిటల్లో రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశారురక్త దాతలను,సింగిల్ డోనర్ ప్లేట్ లెట్ (ఎస్డిపిదాతలను సత్కరించారుదాతలకు హిమోగ్లోబిన్బ్లడ్ గ్రూప్ పరీక్షలు చేశారుసురక్షితమైన రక్త మార్పిడి పద్ధతుల కోసం దాతల  రక్తం యూనిట్లకు వైరల్ మార్కర్ల  స్క్రీనింగ్ చేశారుసమాజంలో స్వచ్ఛంద రక్తదాన సంస్కృతిని మరింత ప్రోత్సహించడానికి ఈ శిబిరంలో అవగాహన సెషన్లు కూడా ఏర్పాటు చేశారు

ఫరీదాబాద్లోని ఈఎస్ఐసీలో క్యాన్సర్ అవగాహన,  స్క్రీనింగ్ కోసం సంపూర్ణ మహిళా ఆరోగ్య శిబిరాన్ని కూడా నిర్వహించారుమహిళా లబ్ధిదారులు క్షయరక్తపోటుడయాబెటిస్,  రక్తహీనత కోసం స్క్రీనింగ్  తో పాటు ప్రసవానికి ముందు పరీక్షలుపోషకాహార స్క్రీనింగ్,  కౌన్సెలింగ్ పొందారునోటిరొమ్ము,  గర్భాశయ క్యాన్సర్ల కోసం ప్రత్యేక పరీక్షలు జరిగాయిగర్భాశయ క్యాన్సర్‌ను ముందుగా గుర్తించేందుకు పాప్ స్మెర్ పరీక్షలు కూడా నిర్వహించారుఈ కార్యక్రమాల ద్వారామహిళా సాధికారతకుకుటుంబాల శ్రేయస్సుకు  ముఖ్యమైన సాధనాలుగా ముందస్తు రోగ నిర్ధారణనివారణ సంరక్షణ,  ఆరోగ్య విద్య  ప్రాముఖ్యతను ఈఎస్ఐసీ చాటిచెప్పింది.

ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్సనత్‌నగర్, హైదరాబాద్

హైదరాబాద్  సనత్‌నగర్ లోని ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్,  హాస్పిటల్ కొత్తగా నిర్మించిన 200 పడకల ఆసుపత్రి భవనంలో 17 సెప్టెంబర్ 2025న ఇన్ హౌస్ క్యాంప్ సేవలను ప్రారంభించిందిదేశవ్యాప్తంగా జరుపుకుంటున్న స్వస్థ్ నారిసశక్త్ పరివార్అభియాన్‌లో భాగంగా ఈ శిబిరాన్ని నిర్వహించారువ్యాధి నివారణ,  ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల ద్వారా మహిళలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించడం,  కుటుంబాలను శక్తిమంతం  చేయడం ఈ ప్రచార కార్యక్రమం లక్ష్యం.

ఈ ప్రారంభోత్సవానికి ఈఎస్ఐసీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డాక్టర్ సౌరవ్ కుమార్ దత్తా అధ్యక్షత వహించారుహైదరాబాద్ లోని ఈఎస్ఐసీ ప్రాంతీయ కార్యాలయం రీజినల్ డైరెక్టర్ శ్రీ రాజీవ్ లాల్ఇతర సీనియర్ అధికారులు,  అధ్యాపకులు పాల్గొన్నారు

ఈ కార్యక్రమం ఈఎస్ఐసీ  సనత్‌నగర్‌లో ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడంలోనూబీమా లబ్ధిదారులకు,  సమాజానికి మెరుగైన వైద్య సంరక్షణను అందుబాటులోకి తేవడంలోనూ ఒక ప్రధాన సూచికగా నిలుస్తుంది.  సమగ్ర శిబిర సేవలతో కూడిన కొత్త 200 పడకల సౌకర్యంరోగులకు తక్కువ ఖర్చుతో పూర్తి ఆరోగ్య సంరక్షణను అందించాలనే ఈఎస్ఐసీ  నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.

ప్రచార కార్యక్రమం ప్రణాళికకు అనుగుణంగా క్యాంపస్ లో ఆరోగ్య పరీక్షా శిబిరాలురక్తదాన శిబిరాలు,  ప్రతిజ్ఞస్వచ్ఛతా హి సేవా ప్రతిజ్ఞయోగా సెషన్లు,  ఫార్మా-కో-విజిలెన్స్ వీక్ వేడుకలతో సహా అనేక కార్యకలాపాలు  నిర్వహించారు.ఈ కార్యక్రమాలు ఆరోగ్య అవగాహనవ్యాధి నివారణ,  సమాజ భాగస్వామ్యం పట్ల ఈఎస్ఐసీ  సమగ్ర విధానాన్ని ప్రముఖంగా తెలియచేశాయి.

స్వస్థ్ నారీసశక్త్ పరివార్ అభియాన్ కింద రోజంతా జరిగిన  కార్యకలాపాలు క్లిష్టమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడమే కాకుండా జీవనశైలి మార్పుపోషకాహారంమహిళల ఆరోగ్య సవాళ్లపై అవగాహన పెంచాయిజాతీయ ఆరోగ్య ప్రాధాన్యతలకు మద్దతు ఇవ్వడానికిఆరోగ్యకరమైనసాధికార,  సుస్థిర  సమాజాన్ని నిర్మించడానికి  ఈఎస్ఐసీ కట్టుబడి ఉంది.

 

***


(Release ID: 2168327)
Read this release in: English , Hindi , Tamil