వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్‌లో అమెరికా సహాయక వాణిజ్య ప్రతినిధి నేతృత్వంలోని బృంద పర్యటన సందర్భంగా ప్రకటన

నాడు పోస్టు చేయడమైనది: 16 SEP 2025 7:28PM by PIB Hyderabad

భారత్అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చల ప్రధాన సంధానకర్త గౌరవ బ్రెండన్ లించ్ నేతృత్వంలో.. అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయ అధికారుల బృందం 2025 సెప్టెంబరు 16న భారతదేశానికి వచ్చింది. భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం సహా ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై.. వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శితో చర్చించారు.

భారత్అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ప్రాధాన్యాన్ని అంగీకరిస్తూ.. వాణిజ్య ఒప్పందంలోని వివిధ అంశాలపై సానుకూలభవిష్యతత్ దృక్పథంతో కూడిన చర్చలు జరిగాయిపరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేసే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేయాలని నిర్ణయించారు

 

***

 


(రిలీజ్ ఐడి: 2167471) సందర్శకుల సూచీ సంఖ్య : : 30
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी