గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఖనిజాల విషయంలో స్వావలంబన, ఆవిష్కరణలపై జాతీయ స్థాయి సెమినార్‌ను హైదరాబాద్‌లో నిర్వహించిన గనుల మంత్రిత్వ శాఖ


జాతీయ కీలక ఖనిజాల మిషన్‌ను ముందుకుతీసుకెళ్తున్న మంత్రిత్వ శాఖ

ఖనిజాల విషయంలో స్వావలంబన, ఆవిష్కరణలకు సంబంధించి

రోడ్‌మ్యాప్‌ను ప్రకటించిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి

Posted On: 16 SEP 2025 6:10PM by PIB Hyderabad

జాతీయ కీలక ఖనిజాల మిషన్ (నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఎన్‌సీఎంఎంఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌పై హైదరాబాద్‌లో జరిగిన సెమినార్‌కు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జీకిషన్ రెడ్డి అధ్యక్షత వహించారుఖనిజాల విషయంలో స్వావలంబనను ప్రోత్సహించడంపెట్టుబడులను ఆకర్షించడం.. ఈ రంగంలో సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించటంపై ప్రభుత్వానికి ఉన్న దార్శనికతను మంత్రి వివరించారుఖనిజాన్వేషణను వేగవంతం చేయడానికిదిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు.. రక్షణఎలక్ట్రానిక్స్పునరుత్పాదక ఇంధన రంగాలకు అవసరమైన కీలక ఖనిజాలకు సంబంధించిన బలమైన వ్యవస్థను సృష్టించేందుకు తీసుకున్న చర్యలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారుఖనిజ రంగంలో స్థిరమైన వృద్ధి ఉండేలా చూసుకునేందుకు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలుప్రభుత్వం ఏకోన్ముఖంగా పనిచేయటం వంటి అంశాలకు ఉన్న ప్రాముఖ్యతను తెలియజేశారు

ఈ సెమినార్‌లో భాగంగా జాతీయ కీలక ఖనిజాల మిషన్ కింద గుర్తింపు పొందిన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈలు).. వాటికి అనుబంధంగా ఉన్న పరిశ్రమలువిద్యా సంస్థలుఆర్అండ్‌డీ సంస్థల భాగస్వామ్యంతో కీలక ఖనిజాలకు సంబంధించిన పరిశోధనఅభివృద్ధిని బలోపేతం చేయడంపై సుదీర్ఘంగా చర్చించారుఏడు సీఓఈల (ఐఐటీ బాంబేఐఐటీ హైదరాబాద్ఐఐటీ రూర్కీఐఐటీ (ఐఎస్ఎంధన్‌బాద్సీఎస్ఐఆర్-ఐఎంఎంటీ భువనేశ్వర్సీఎస్ఐఆర్-ఎన్ఎంఎల్ జంషెడ్‌పూర్ఎన్‌ఎఫ్‌టీడీసీ హైదరాబాద్‌అధిపతులు ఆయా సంస్థల్లో కీలక ఖనిజాలకు (ముడి పదార్థాలసంబంధించి కొనసాగుతోన్న పరిశోధనఆవిష్కరణలుఆచరణాత్మకత గురించి తెలియజేశారుప్రాధాన్యతలుమద్దతు విధానాలుపరిశోధనఅభివృద్ధికి సంబంధించిన విధివిధానాలను పరిశ్రమ ప్రతినిధులుపంచుకున్నారు.

ఈ సదస్సులో నాలుగు సాంకేతిక సమావేశాలు జరిగాయిఇవి కీలక ఖనిజాల సమర్థవంతమైన ప్రాసెసింగ్శుద్ధికి సంబంధించిన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేసేందుకు కావాల్సిన సంస్థాగత ఆర్అండ్‌డీ దార్శనికతపై దృష్టి సారించాయిఈ సమావేశాల్లో ‘పాలనతక్షణమే ఉపయోగించుకునే పద్ధతిలో సీఓఈలను సంస్థాగతీకరించడం.. పరిశ్రమ ప్రాధాన్యతలను గుర్తించడంఅర్అండ్‌డీ ప్రాజెక్టులలో భాగస్వామ్యాన్ని పెంచడం..  ఆర్‌‍‌అండ్‌డీ స్థాయి నుంచి టీఆర్ఎల్ 7/8 పైలట్ కేంద్రాలువాణిజ్యపరమైన విడుదల ముందు చేసే ప్రదర్శనల స్థాయి వరకు ఆవిష్కరణలను తీసుకెళ్లేందుకు భారీగా ఆచరణాత్మక ఆర్అండ్‍ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లటం.. భారతదేశ వ్యూహాత్మక రంగాల అవసరాలకు అనుగుణంగా సీఓఈల ఆర్అండ్‌డీ ఎజెండా ఉండేలా చూసుకోవటం’ అనే అంశాలపై చర్చించారు

ఈ చర్చలు ఏకోన్ముఖ ప్రభుత్వ విధానంసీఓఈలువాటి భాగస్వాముల మధ్య సన్నిహిత సహకారం.. ఆవిష్కరణలను వేగవంతం చేసేందుకుదిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకుకీలక ఖనిజాలలో దేశీయ సామర్థ్యాన్ని పెంపొందించడానికి పరిశ్రమల చురుకైన భాగస్వామ్యం అనే అంశాల ప్రాముఖ్యతను తెలియజేశాయిఎన్‌సీఎంఎం కింద భాగస్వామ్యాల ద్వారా పనిచేయటంపై ఈ సెమినార్‌లో చేపట్టిన చర్చలు బలమైన పునాది వేశాయికీలక ఖనిజాల పరిశోధనప్రాసెసింగ్సాంకేతిక ఆవిష్కరణలలో భారతదేశాన్ని ప్రపంచ నాయకత్వ స్థానంలో ఉంచేందుకు ఇవి ఒక రోడ్‌మ్యాప్‌గా ఉపయోగపడనున్నాయి

ఈ కార్యక్రమంలో మంత్రి జీకిషన్ రెడ్డి.. “కీలక ఖనిజాల ప్రాసెసింగ్‌లో భారత్‌ను కేంద్రంగా చేయటం” అనే సీఈఈడబ్ల్యూ నివేదికతో పాటు దేశీయ ప్రాసెసింగ్ సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉద్దేశించిన రోడ్‌మ్యాప్ బుక్‌లెట్‌ను విడుదల చేశారుగనుల మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు శ్రీ షకీల్ ఆలంఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీ.ఎస్మూర్తి.. విద్యా సంస్థలుపరిశ్రమ సహకారంపై పరిశీలనలను పంచుకున్నారుపరిశోధనసామర్థ్య నిర్మాణానికి కృషికి చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లకు అవార్డులను ఇచ్చారురేపటి నుంచి మంత్రిత్వ శాఖ పరిధిలోని అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో (సీపీఎస్‌యూఏకరీతి సంక్షేమ చట్రాన్ని అమలు చేస్తామని మంత్రి ప్రకటించారుఇందులో భాగంగా.. భద్రతగౌరవంసామాజిక భద్రత ఉండేలా చూసుకునేందుకు రూ. 1 కోటి బీమా పథకం కిందకు సాధారణ మైనింగ్ ఉద్యోగులందరూ వస్తారని తెలిపారు

13 రాష్ట్రాలలో 19 కాంపోజిట్ లైసెన్స్ (సీఎల్), 4 అద్దె గనుల (ఎంఎల్బ్లాక్‌లతో కూడిన 6వ విడత వేలాన్ని మంత్రి జీకిషన్ రెడ్డి ప్రారంభించారుఆంధ్రప్రదేశ్అరుణాచల్ ప్రదేశ్ఛత్తీస్‌గఢ్జార్ఖండ్కర్ణాటకమహారాష్ట్రఒడిశాపంజాబ్రాజస్థాన్తెలంగాణఉత్తరాఖండ్ఉత్తరప్రదేశ్పశ్చిమ బెంగాల్‌లలో విస్తరించి ఉన్న ఈ బ్లాక్‌లు స్వచ్ఛ విద్యుత్అధునాతన తయారీవ్యూహాత్మక రంగాలకు సంబంధించిన కీలక ఖనిజాలకు సంబంధించినవిఇందులో భూమిలో లభించే అరుదైన మూలకాలు (ఆర్ఈఈ), నియోబియంటాంటాలమ్సీసియంటంగ్‌స్టన్లిథియంటిన్గ్రాఫైట్వనాడియంకోబాల్ట్టైటానియంగాలియంజిర్కోనియంరాక్ ఫాస్ఫేట్పొటాష్ఇతర అరుదైన లోహాలు ఉన్నాయిటెండర్ పత్రాల అమ్మకం 2025 సెప్టెంబర్ 23న ప్రారంభమై.. 2025 నవంబర్ 24న సాయంత్రం సాయంత్రం 5:00 గంటల వరకు కొనసాగుతుందిబిడ్‌ల సమర్పణకు చివరి తేదీ 2025 డిసెంబర్ 1 (సాయంత్రం 5:00 గంటలు). మరిన్ని వివరాలు https://www.mstcecommerce.com/auctionhome/mlcln/ లో అందుబాటులో ఉన్నాయిగనుల మంత్రిత్వ శాఖ 55 బ్లాకులను సంబంధించిన అయిదు విడతల వేలాన్ని పూర్తి చేసిందిఇందులో 34 బ్లాకుల వేలం విజయవంతమైందిఈ వేలంపాటల నుంచి వచ్చే ఆదాయం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తుంది.

1వ విడత అన్వేషణ లైసెన్స్ (ఈఎల్ఎక్స్‌ప్లోరేషన్ లైసెన్స్బ్లాక్‌లకు సంబంధించిన ప్రాధాన్య బిడ్డర్లను మంత్రి జీకిషన్ రెడ్డి ప్రకటించారుసంస్థలు పరస్పరం చర్చించుకోవటానికి ఇది వెసులుబాటు కల్పిస్తుందిలిథియంరాగిబంగారంభూమిలోని అరుదైన మూలకాల వంటి విలువైన ఖనిజాల కోసం నిర్వహించిన ఈఎల్ బ్లాక్‌ల మొదటి వేలం విజయవంతంగా పూర్తయిందివేలం కోసం పెట్టిన 13 బ్లాక్‌లలో బ్లాక్‌లు రెండో రౌండ్‌కు చేరుకున్నాయిఇవి ఆంధ్రప్రదేశ్జార్ఖండ్కర్ణాటకమధ్యప్రదేశ్మహారాష్ట్రరాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఉన్నాయిఇది వేలానికి సంబంధించి ఆదాయాన్ని పెంచటంతో పాటు.. ఖనిజాన్వేషణలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యంహరిత సాంకేతికతలకు మద్దతునివ్వటంఇంధన పరివర్తనఅత్యాధునిక పరిశ్రమలను ప్రోత్సహిస్తుంది.

పారదర్శకమైనపెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం.. పరిశోధన ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించడంభారత వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా స్వావలంబనతో కూడిన ఖనిజ రంగ వ్యవస్థను తయారు చేయటంపై నిబద్ధతతో ఉన్నట్లు మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించిందికీలక ఖనిజాల రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగస్వాములందరికీ మంత్రిత్వ శాఖ కృతజ్ఞతలు తెలియజేసిందిభవిష్యత్తులో కూడా నిరంతరం కలిసి పనిచేయనున్నట్లు తెలిపింది

 

***


(Release ID: 2167408) Visitor Counter : 2
Read this release in: English , Urdu , Hindi