సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బౌద్ధ కళా రూపాలను అర్థం చేసుకోవటానికి బాటలు వేసిన కుమారస్వామి: ప్రొఫెసర్ నమన్ అహుజా

అధ్యయనం చేయాల్సిన భారతదేశ వారసత్వం ఇంకా ఉంది...

చిహ్నాలను సంబంధిత సందర్భాలతో అనుసంధానించాలి: డాక్టర్ కె.కె. చక్రవర్తి

Posted On: 09 SEP 2025 8:30PM by PIB Hyderabad

ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ (ఐజీఎన్ సీఏ), కల్చరల్ ఆర్కైవ్స్ అండ్ కన్జర్వేషన్ డివిజన్, 'మరో బుద్ధ ప్రతిమకు మూలంఅనే థీమ్ తో ఆనంద కెంటిష్ కుమారస్వామి నాలుగో స్మారక ఉపన్యాసాన్ని నిర్వహించిందిభారతీయ కళలు వాటి సౌందర్యాత్మక భావనలను అర్థం చేసుకునేందుకు ఆయన రచనలు మార్గం చూపించాయిఈ ఉపన్యాసాన్ని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీస్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఈస్తటిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ నమన్ పిఅహుజా ఇచ్చారుఈ కార్యక్రమానికి ప్రముఖ కళా చరిత్రకారుడుఐజీఎన్ సీఏ మాజీ సభ్య కార్యదర్శిరిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ కళ్యాణ్ కుమార్ చక్రవర్తి అధ్యక్షత వహించారుకల్చర్ ఆర్కైవ్స్ అండ్ కన్జర్వేషన్ డివిజన్ విభాగాధిపతి ప్రొఫెసర్ అచల్ పాండ్య ప్రసంగంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ నమన్ అహుజా మాట్లాడుతూ.. భారతీయ కళల అధ్యయనానికి ఆనంద కెకుమారస్వామి చేసిన సేవలుముఖ్యంగా మూర్తి పూజవిగ్రహారాధన ప్రారంభ మూలాలను అర్థం చేసుకోవటానికి ఆయన చేసిన పరిశోధనల గురించి వివరించారుగాంధార కళపై గ్రీకు ప్రభావం గురించి విస్తృతంగా ఆమోదయోగ్యమైన ఆల్ఫ్రెడ్ ఫౌచర్ సిద్ధాంతాన్ని తిరస్కరించటం ఆయన రచనల్లో కీలకమైనదన్నారుకుమారస్వామి 'దిఆరిజిన్ ఆఫ్ ది బుద్ధ ఇమేజ్అనే తన వ్యాసంలో.. బుద్దుడి విగ్రహాలు కేవలం గ్రీకు ప్రభావం వల్ల పుట్టలేదనిభారతీయ సంప్రదాయాలుతాత్వికత నుంచే వచ్చాయని రాశారుఈ ఆలోచనలు జాతీయవాద భావనలకు మాత్రమే పరిమితం కాకుండా భగవద్గీతలో వివరించినట్లుగావిగ్రహారాధనదేవునిపై నమ్మకంభక్తి వంటి వాటి నుంచి వచ్చాయని కుమారస్వామి భావించారని ప్రొఫెసర్ అహుజా వెల్లడించారుకుషాణుల కాలంలో ప్రసిద్ధి చెందిన మధురగాంధారఅమరావతిలోని బౌద్ధ విగ్రహాలు ప్రత్యేక లక్షణాలతో నియమానుగుణంగా రూపుదిద్దుకున్నాయని తెలిపారు.

ఇటీవల జరిగిన పరిశోధనల ఆధారంగామొదట్లో ఉన్న అన్ని చిత్రాలూ బుద్ధుడిని వర్ణించలేదనిచాలా వరకు అవి బోధిసత్వుల విగ్రహాలని ప్రొఫెసర్ అహుజా అన్నారుఒకటో శతాబ్దం నాటికి సూర్యుడులక్ష్మీబ్రహ్మఇంద్రుడు వంటి దేవతామూర్తులు బౌద్ధ సంస్కృతిలో భాగమయ్యాయని చెప్పారుబెంగాల్ లోని చంద్రకేతుగఢ్ లో లభించిన పురాతన వస్తువుల గురించి ప్రస్తావిస్తూరాతి శిల్పాలకు భిన్నంగా బంకమట్టిటెర్రకోటకలపదంతాలను ఉపయోగించినట్లు ప్రొఫెసర్ అహుజా వెల్లడించారుతవ్వకాల్లో లభించిన దంతాల అవశేషాల పేటికలుక్రీ.పూరెండో శతాబ్దం నుంచి క్రీ.రెండో శతాబ్దం మధ్య కాలానికి చెందినవనిఅవి బుద్ధుని జీవితంలోని సంఘటనలను కాలానుక్రమంలో కాకుండా శాతవాహనుల కళా సంప్రదాయంలో చిత్రీకరించినవన్నారుఅవి బౌద్ధ సిద్ధాంతాలు ప్రాంతీయ శైలిలోకి అనువాదం జరిగిన తీరుని వివరిస్తాయని అహుజా తెలిపారు.

ఈ ఆవిష్కరణలు కుమారస్వామి ప్రాథమిక వాదనలను పునః పరిశీలించాల్సిన అవసరాన్ని తెలియజేస్తాయంటూ ప్రొఫెసర్ అహుజా తన ప్రసంగాన్ని ముగించారుదైవారాధనవిగ్రహారాధన గురించి కుమారస్వామి అవగాహన అమూల్యమైనదైనప్పటికీ మధుర నుంచి బెంగాల్ వరకు లభించిన ఆధారాలు బుద్ధుడుబోధిసత్వుల విగ్రహాల సృష్టి ఒకటి కాదనిఅవి దశలవారీగాప్రాంతాలవారీగా మారినట్లు నిరూపిస్తున్నాయని స్పష్టం చేశారు.

భారతదేశంలో దాదాపు 30,000 స్మారక కట్టడాలుపురావస్తు ప్రదర్శనశాలల్లో ఎన్నో విగ్రహాలున్నప్పటికీదాని పురావస్తుశాసనాలకు సంబంధించి చాలా వరకు ఇంకా అధ్యయనం చేయలేదని డాక్టర్కె.కెచక్రవర్తి పేర్కొన్నారుచరిత్రతత్వశాస్త్రంమతంభౌతిక సంస్కృతిని ఒకే తాటిపైకి తీసుకురావటానికి జరుగుతున్న ప్రస్తుత ప్రయత్నాలు సరైనవన్నారుపాశ్చాత్య దృక్పథాన్ని వదిలిఉత్తరదక్షిణ భారత్ మధ్య జరిగిన కళా మాండలీకాలపై కుమారస్వామి చేసిన అధ్యయనం వల్ల ఉత్తర భారతంలో ప్రధానంగా కనిపించే రేఖాగణిత ఆకారాలు క్రమంగా దక్షిణ భారతదేశంలోని సున్నితమైనస్థూలమైన కళా శైలిగా పరిణామం చెందిన క్రమం స్పష్టంగా అర్థమైందని డాక్టర్ చక్రవర్తి వివరించారుప్రపంచ మేధావులతో కుమారస్వామి నిర్వహించిన సంభాషణలతో ఉత్తర-దక్షిణ భారత శిల్పకళా రీతులపై ఆయనకున్న అవగాహన తెలుస్తుందన్నారుదక్షిణమధ్య ఆసియాలో విగ్రహారాధనవిగ్రహం లేకుండా పూజించే సంప్రదాయాలు రెండూ ఏకకాలంలో ఉన్నాయని ఆయన చెప్పారుఇందుకు ఉదాహరణగాతాలాలో శివ-బుద్ధ సమ్మేళనం.. శైలితత్వశాస్త్రాల సమ్మేళనానికి నిదర్శనమని పేర్కొన్నారు.

తొలినాళ్లలో యక్షుడిని పోలి ఉన్న మధుర బుద్ధ విగ్రహాలు కాలక్రమేణా గాంధార శైలిలో దివ్యమైన రూపాలుగా మారాయని డాక్టర్ చక్రవర్తి తెలిపారుకుమారస్వామి దృష్టిలో బుద్ధుడు కేవలం ఒక చారిత్రక వ్యక్తి మాత్రమే కాదనిపురాణాలుతత్వశాస్త్రంవిశ్వవిజ్ఞాన శాస్త్రాల సమ్మేళనమని ఆయన వ్యాఖ్యానించారుప్రొఫెసర్ నమన్అహుజా కృషిని ప్రశంసిస్తూభారతదేశపు వారసత్వానికి సంబంధించి పరిశోధించని అంశాలు ఇంకా చాలా ఉన్నాయనిసంబంధిత చిహ్నాలను సందర్భానుసారంగా సమన్వయం చేయడం కోసం ఎదురుచూస్తున్నట్లు చెబుతూ ప్రసంగాన్ని ముగించారు.

ఈ కార్యక్రమంలో ప్రసంగించిన వారికిహాజరైన వారికి కల్చరల్ ఆర్కైవ్స్ డివిజన్ ఇన్‌ఛార్జ్అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శిల్పి రాయ్ కృతజ్ఞతలు తెలిపారుకళలుచరిత్రసాంస్కృతిక రంగాల నుంచి పెద్ద సంఖ్యలో పరిశోధకులుఉపాధ్యాయులుపండితులుకళాభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారుకళలుసంస్కృతికి సంబంధించి కుమారస్వామి ప్రతిపాదించిన ప్రాథమిక సూత్రాల ఆధారంగా ఈ వార్షిక ఉపన్యాసాన్ని నిర్వహించారు.

 

 

***

 

(Release ID: 2167052) Visitor Counter : 6