గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ కీలక ఖనిజ మిషన్‌ కింద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పై సదస్సును నిర్వహించనున్న గనుల మంత్రిత్వ శాఖ

Posted On: 15 SEP 2025 4:43PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ జాతీయ కీలక ఖనిజ మిషన్ (నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఎన్సీఎంఎంకింద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈపై కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ 16 సెప్టెంబర్ 2025న హైదరాబాద్ లో సదస్సును నిర్వహిస్తోందిఈ కార్యక్రమంలో కీలకమైన ఖనిజ బ్లాకుల వేలం ఆరో విడత ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది.

కీలకమైన ఖనిజాలలో పరిశోధనఅభివృద్ధిఆవిష్కరణలను వేగవంతం చేయడానికిభారతదేశ ఇంధనంసాంకేతికత,   వ్యూహాత్మక రంగాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన ఈ సదస్సు ప్రముఖంగా వివరిస్తుందిఇది స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికబలమైన భాగస్వామ్యాలుమొత్తం ప్రభుత్వ విధానం ద్వారా ఎన్సీఎంఎం కు పునాది వేస్తుంది.

కేంద్ర బొగ్గు,  గనుల శాఖ మంత్రి శ్రీ జికిషన్ రెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారుస్వావలంబనను పెంపొందించడంపెట్టుబడులను ప్రోత్సహించడంకీలకమైన ఖనిజాలలో సాంకేతికతను అభివృద్ధి చేయడం కోసం ఈ సదస్సులో కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తారు.

కీలకమైన ఖనిజాల రంగంలో పరిశోధనఅభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళే సమగ్ర ప్రణాళికను రూపొందించడానికి పరిశ్రమఆర్ అండ్ డివిద్యాసంస్థలతో కలిసి గుర్తింపు పొందిన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (హబ్స్ను ఈ సదస్సు ఒకే వేదికపైకి తెస్తుంది

భారత్ ను  కీలక ఖనిజాల శుద్ధికి ప్రధాన కేంద్రంగా మార్చడంపై గనుల మంత్రిత్వ శాఖ-సీఈఈడబ్ల్యూ నివేదికను ఈ సదస్సులో విడుదల చేస్తుందిభారతదేశ వ్యూహాత్మక ఖనిజ లక్ష్యాలకు అనుగుణంగా దేశీయ మైనింగ్సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడానికి ప్రభుత్వ నిబద్ధతకు ప్రతీకగా ఎన్సీఎంఎం కింద గుర్తింపు పొందిన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కు అవార్డులు కూడా ప్రదానం చేస్తారు

 

***


(Release ID: 2166998) Visitor Counter : 2
Read this release in: English , Urdu , Hindi , Tamil