గనుల మంత్రిత్వ శాఖ
రాంచీలో ఐబీఎమ్ ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి
Posted On:
12 SEP 2025 4:28PM by PIB Hyderabad
రాంచీలో కొత్తగా నిర్మించిన ఇండియా బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎమ్) ప్రాంతీయ కార్యాలయాన్ని బొగ్గు, గనుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు.
‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా ఒక మొక్కను శ్రీ జి. కిషన్ రెడ్డి కొత్త భవనం ఆవరణలో నాటి, దానికి నీరు పోశారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యతనూ, ఈ భూమి నాలుగు కాలాల పాటు మనుగడ సాగించడాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనూ ఈ మొక్కల పెంపకం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు గనుల శాఖ అదనపు కార్యదర్శి శ్రీ సంజయ్ లోహియా, ఐబీఎమ్ కంట్రోలర్ జనరల్ (స్వతంత్ర) శ్రీ పంకజ్ కులశ్రేష్ఠ కూడా పాల్గొన్నారు.
ప్రబంధన్ నగర్, ముర్మా, నయాసరాయి, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, రాంచీ, జార్ఖండ్ - 835303 చిరునామాలో ఏర్పాటు చేసిన ఐబీఎమ్ ప్రాంతీయ కార్యాలయంలో విధులను నిర్వహించే ఉద్యోగులు నియంత్రణ పూర్వక పర్యవేక్షణను పటిష్ఠపరచనున్నారు. గనుల తవ్వకానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడంతో పాటు ‘వికసిత్ భారత్’ దృష్టికోణానికి అనుగుణంగా గనుల తవ్వకం రంగంలో మన దేశం అభివృద్ధిని సాధించడానికి వారి వంతు తోడ్పాటును అందించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఉద్యోగులను, శ్రామికులను ఉద్దేశించి ప్రసంగించారు.
***
(Release ID: 2166169)
Visitor Counter : 2