రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గణేష్ ఉత్సవాల సందర్భంగా రికార్డు స్థాయిలో 380 ప్రత్యేక రైళ్లను నడుపుతున్న భారతీయ రైల్వే


జోన్ల వారీగా ప్రత్యేక రైళ్లు: సెంట్రల్ 296, వెస్ట్రన్ 56, కేఆర్సీఎల్ 6, సౌత్ వెస్ట్రన్ 22.

ఆగస్టు 11 నుంచి ప్రారంభమైన గణేశ ఉత్సవాల ప్రత్యేక రైళ్లకు పండుగ సమీపిస్తున్న కొద్దీ మరిన్ని ట్రిప్పుల జోడింపు

Posted On: 21 AUG 2025 8:43PM by PIB Hyderabad

భారతీయ రైల్వే 2025 గణేశ ఉత్సవాల కోసం 380 ప్రత్యేక రైళ్ళను ప్రకటించిందిఇవి పండుగ సమయంలో భక్తులు,  ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి. 2023లో 305,  2024లో 358 గణేశ ఉత్సవాల ప్రత్యేక రైళ్లు నడపగా ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచారు

మహారాష్ట్రకొంకణ్ ప్రాంతంలో భారీగా ఉండే పండగ ప్రయాణికుల రద్దీని పరిష్కరించడానికి సెంట్రల్ రైల్వే అత్యధికంగా 296 సర్వీసులను నడపనుందిపశ్చిమ రైల్వే 56,  కొంకణ్ రైల్వే (కేఆర్సీఎల్) 6, సౌత్ వెస్ట్రన్ రైల్వే 22 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశాయి.

కొంకణ్ రైల్వే మీదుగా నడిచే గణేశ ఉత్సవాల ప్రత్యేక రైళ్లను కోలాడ్ఇందాపూర్మన్గావ్గోరేగావ్ రోడ్వీర్సాపే వార్మ్నేకరంజాడివిన్హేర్దివాంఖావతికలంబానీ బుద్రుక్ఖేడ్అంజనిచిప్లున్కమాతేసవార్దాఅరవలి రోడ్సంగమేశ్వర్ రోడ్రత్నగిరిఅడవాలివిలావడేరాజాపూర్ రోడ్వైభవ్వాడి రోడ్నంద్గావ్ రోడ్నంద్గావ్ రోడ్నంద్గావ్ రోడ్కంకవలి వద్ద నిలిపివేశారు.  కార్వార్గోకామా రోడ్కుమ్టాముర్దేశ్వర్మూకాంబికా రోడ్కుందాపురఉడిపిముల్కీసూరత్కల్ స్టేషన్లలో ఆపుతారు.

గణపతి పూజ ఈనెల  27 నుంచి సెప్టెంబర్ వరకు జరుగుతుందిఅంచనా ప్రకారం పండుగ రద్దీని తీర్చడానికి ప్రత్యేక రైళ్లను ఈనెల 11 నుంచి ప్రారంభించారుపండుగ సమీపిస్తున్న కొద్దీ వీటి ట్రిప్పులను క్రమంగా పెంచుతున్నారు.

ప్రత్యేక రైళ్ల సవివర షెడ్యూల్ ను ఐఆర్సీటీసీ వెబ్ సైట్రైల్ వన్ యాప్కంప్యూటరైజ్డ్ పీఆర్ఎస్ లో అందుబాటులో ఉంచారు.

భారతీయ రైల్వే నిరంతరంముఖ్యంగా డిమాండ్ ఎక్కువగా ఉండే పండగ సమయాల్లో ప్రజలకు సురక్షితమైననమ్మదగినసౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాలను అందించడానికి కట్టుబడి ఉంది.  

 

***


(Release ID: 2159599) Visitor Counter : 3