అణుశక్తి విభాగం
azadi ka amrit mahotsav

పార్లమెంటులో ప్రశ్న: అణు కేంద్రాల భద్రతపై పునఃసమీక్ష

Posted On: 20 AUG 2025 4:25PM by PIB Hyderabad

ప్రపంచంలో ఎక్కడైనా అణు భద్రతకు సంబంధించి ఏదైనా పెద్ద సంఘటన జరిగినప్పుడు భద్రతను మరింత బలోపేతం చేసేందుకు భద్రతా అంశాలను పరిశీలిస్తుంటారు. జపాన్‌లో రిక్టర్ స్కేల్‌పై 9.0 తీవ్రతతో భూకంపం (గ్రేట్ ఈస్ట్ జపాన్ భూకంపం), 2011లో ఫుకుషిమా దైచి అణు ప్రమాదం తర్వాత భూకంపాలువరదలుప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించటానికి భారత ఎన్ పీపీల కోసం ఏఈఆర్బీ స్వతంత్రంగా ఇటువంటి పునః సమీక్ష నిర్వహించిందిఈ భద్రతా అంచనాలుచేపట్టిన చర్యలు ఇటీవల రష్యాజపాన్ లో రిక్టర్ స్కేలుపై 8.6 తీవ్రతతో సంభవించిన భూకంపానికి కూడా వర్తిస్తాయిఈ భూకంపాల ప్రభావం భారత అణు విద్యుత్ ప్లాంట్లపై లేదుఅయినప్పటికీ నియంత్రణ మార్గదర్శకాలకు అనుగుణంగా భద్రతపై అంచనా వేయాల్సి ఉంటుంది.

తీరప్రాంతాల్లోని అణు విద్యుత్ కేంద్రాలను ఆయా ప్రాంతాల్లో సంభవించే భూకంపాలుసునామీలుతుఫాన్లువరదలు వంటి వాటికి సంబంధించిన సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించారువాటి భద్రతను మెరుగుపరచడానికి క్రమం తప్పకుండా పర్యవేక్షణకాలానుగుణంగా సమీక్షలునవీకరణలు (అవసరమైతే)  కూడా చేపడతారుభద్రతా వ్యవస్థల నిర్మాణాలువ్యవస్థలువిపత్కర పరిస్థితులను తట్టుకుని సమర్థవంతంగా పనిచేసేలా రూపొందించారు. అంతేకాకుండాఇలాంటి విపత్తులకు సంబంధించి ప్రామాణిక కార్యాచరణ విధానాలు అమల్లో ఉన్నాయిఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి శిక్షణ ఇస్తారు.

 

కూడంకుళం ప్రాజెక్టులో ఒక్కొక్కటి 1000 మెగావాట్ల సామర్థ్యం గల మొత్తం ఆరు అణు విద్యుత్ రియాక్టర్లు ఉన్నాయిదీని మొత్తం సామర్థ్యం 6000 మెగావాట్లుఇందులో రెండు రియాక్టర్లు (కేకేఎన్పీపీ1, 2- 2X1000 మెగావాట్లుప్రస్తుతం పనిచేస్తున్నాయిమిగిలిన నాలుగు రియాక్టర్లు (కేకేఎన్పీపీ-3 నుండి వరకు, 4 x 1000 మెగావాట్లునిర్మాణంలోప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.

ఈ సమాచారాన్ని కేంద్ర సైన్స్సాంకేతికఎర్త్ సైన్సెస్,  సహాయ మంత్రి (స్వతంత్ర), పీఎంఓసిబ్బంది సహాయ మంత్రిప్రజా ఫిర్యాదులుపింఛన్లుఅణుశక్తి శాఖఅంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఇవాళ లోక్ సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 

 
 
***

(Release ID: 2158734)
Read this release in: English , Urdu , Hindi , Bengali