జాతీయ మానవ హక్కుల కమిషన్
azadi ka amrit mahotsav

హైదరాబాద్‌లో రెండు రోజుల బహిరంగ విచారణ, శిబిరాన్ని ముగించిన ఎన్‌హెచ్ఆర్‌సీ: 109 కేసుల విచారణ


* 9 కేసుల్లో రూ.49.65 లక్షలు చెల్లించాలని సిఫార్సు, ఈ మొత్తంలో రూ.22.50 లక్షలు చెల్లించిన తెలంగాణ ప్రభుత్వం: మిగిలిన రూ.27.15 లక్షలు చెల్లించేందుకు అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం

* మహిళలు, చిన్నారులు, ఇతర బలహీన వర్గాల వారిపై జరుగుతున్న నేరాలపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఉన్నతాధికారులకు అవగాహన

* భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి పౌర ప్రతినిధులు ఎన్జీవోలు, మానవ హక్కుల కార్యకర్తలతో సమావేశమైన కమిషన్

Posted On: 29 JUL 2025 8:40PM by PIB Hyderabad

తెలంగాణలోని హైదరాబాద్‌లో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన 109 కేసుల విచారణ అనంతరం రెండు రోజుల ‘బహిరంగ విచారణశిబిరాన్ని’ జాతీయ మానవ హక్కుల కమిషన్ ముగించిందిబాధితులుఫిర్యాదిదారులుఅధికారుల సమక్షంలో ఎన్‌హెచ్ఆర్సీ ఛైర్‌పర్సన్ జస్టిస్ శ్రీ రామసుబ్రమణియన్సభ్యులు జస్టిస్ (డాక్టర్బిద్యుత్ రంజన్ సారంగిశ్రీమతి విజయ భారతి సయాని విచారణ చేపట్టారుసెక్రటరీ జనరల్ శ్రీ భరత్ లాల్డైరెక్టర్ జనరల్ (విచారణశ్రీ ఆర్‌పీ మీనారిజిస్ట్రార్ (న్యాయంశ్రీ జోగిందర్ సింగ్కమిషన్‌కు చెందిన ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బహిరంగ విచారణలో భాగంగా కమిషన్ ఏర్పాటు చేసిన రెండు బెంచులు 90 కేసులను విచారించాయివీటిలో ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాల కారణంగా చిన్నారుల మరణంనివాస ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద పెరిగిపోవడంఅగ్ని ప్రమాదాల్లో మరణాలుపులుల దాడులుగిరిజన మహిళల మానవ అక్రమ రవాణాగిరిజన కుటుంబాలను బలవంతంగా తరలించడంకనీస మానవ అవసరాలను నిరాకరించడంఅత్యాచారాలతో సహా మహిళలపై జరుగుతున్న దాడులుచిన్నారులపై జరిగిన నేరాలుపోలీసుల దురాగతాలుఆత్మహత్యలుదళితబంధు పథకం నిధుల దుర్వినియోగంకుటుంబ పింఛను కేసులుప్రాథమిక పాఠశాలలు అందుబాటులో లేకపోవడంగురుకులాల్లో కల్తీ ఆహారంపోషకాహర లోపం కేసులుపోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం తదితరమైనవి ఉన్నాయి.

అర్హతలను పరిశీలించిన అనంతరం తగిన ఆదేశాలను కమిషన్ జారీ చేసిందికమిషన్ ఇచ్చిన ముఖ్యమైన తీర్పుల్లో కొన్ని:

  • ఖమ్మం జిల్లాలో కుల వివక్షసామాజిక బహిష్కరణకు సంబంధించిన కేసులోఎన్‌హెచ్ఆర్సీ జోక్యం తర్వాత పోలీసులు చర్యలు తీసుకున్నారుగ్రామస్థులు ఆ కుటుంబంపై కుల వివక్ష లేదా సామాజిక బహిష్కరణను అమలు చేయకుండా చేశారు.

  • తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో 48 మంది విద్యార్థులు మరణించడం, 886 ఫుడ్ పాయిజన్ ఘటనల కేసుకు సంబంధించిన నివేదికను నాలుగు వారాల్లోగా సమర్పించాలని అయిదు గురుకుల పాఠశాలల కార్యదర్శులను కమిషన్ ఆదేశించింది.

  • అక్రమ అరెస్టులాఠీఛార్జికి సంబంధించిన మరో కేసులో పర్యావరణ అనుమతిప్లాంట్ ఏర్పాటు చేయడానికి సమ్మతితో సహా సంబంధిత పత్రాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్‌హెచ్ఆర్సీ ఆదేశించింది.

  • డీఆర్‌డీవో రాకెట్ ప్రొపెల్లెంట్ యూనిట్లో జరిగిన పేలుడులో మరణించిన నలుగురి కుటుంబాల్లో మూడింటికి మొత్తంగా రూ.50 లక్షల పరిహారాన్ని చెల్లించారుమరో బాధిత కుటుంబానికి సైతం పరిహారం అందించాలని కమిషన్ ఆదేశించింది.

  • పెరుగుతున్న వీధికుక్కల బెడదకు సంబంధించి అయిదో తరగతి విద్యార్థి సమర్పించిన కేసులోఈ సమస్యను తగ్గించేందుకు ప్రామాణిక నిర్వహణ విధానంతో రావాలని సంబంధిత అధికారులను కమిషన్ ఆదేశించింది.

  • గిరిజన మహిళల మానవ అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో తప్పు చేసిన కానిస్టేబుల్‌ను విధుల నుంచి తొలగించారుఅక్రమ రవాణాకు గురైన అనేక మంది గిరిజన మహిళలను రక్షించారు.

అనంతరంపెండింగ్‌లో ఉన్న19 కేసులను కమిషన్ ఫుల్ బెంచ్ విచారించిందివాటిలో కేసుల్లో బాధితులకు రూ. 49.65 లక్షల ఆర్థిక సాయం అందించాలని కమిషన్ సిఫారసు చేసిందివాటిలో రూ. 22.50 లక్షలను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చెల్లించిందిఅలాగే మిగిలిన రూ. 27.15 లక్షల మొత్తాన్ని చెల్లించడానికి అంగీకరించింది.

ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం మెరిట్ ఆధారంగా 29 కేసులను కమిషన్ ముగించిందిచెల్లింపులకు సంబంధించిన సాక్ష్యంతో పాటు అమలు నివేదిక చూపిన అనంతరం రెండు కేసులను ముగించారు.

2025, జులై 28న కేసుల విచారణ అనంతరం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపోలీస్ డైరెక్టర్ జనరల్ఇతర ఉన్నతాధికారులతో 2025, జులై 29న మానవ హక్కులకు సంబంధించిన వివిధ అంశాలపై కమిషన్ సమావేశం నిర్వహించిందిఎవరినీ విస్మరించకుండా ప్రభుత్వ విధానాలుసంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాల్సిన విధానంపై వారికి అవగాహన కల్పించిందిమానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా చేపట్టాల్సిన నివారణవ్యవస్థీకృత చర్యలకు ప్రాధాన్యమిచ్చిందిపర్యావరణంవాతావరణ మార్పులువ్యాపారాల వల్ల ప్రభావితమవుతున్న మానవ హక్కుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

మహిళలుచిన్నారులపై జరుగుతున్న నేరాలుతెలంగాణలో చాలా జిల్లాల్లో మరణాలకు దారితీస్తున్న మనిషి-జంతువు మధ్య సంఘర్షణపెద్ద సంఖ్యలో చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడటంఎస్సీ కార్పొరేషన్ ఎదుర్కొంటున్న సమస్యలుప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు లేకపోవడంచేప పిల్లలను ఉత్పత్తి చేసే వారితో సహా రైతుల దుస్థితిఎల్జీబీటీక్యూఐ సమాజం హక్కులుతదితర అంశాలపై చర్చించారు.

ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర అధికారులు చేపడుతున్న చర్యలను కమిషన్ ప్రశంసించిందితాము అవలంబిస్తున్న ఉత్తమ విధానాలను అధికారులు కమిషన్ ముందుంచారుమానవ హక్కుల ఉల్లంఘన బాధితులకు న్యాయం జరిగేలా సమయానుగుణంగా నివేదికలను తమకు సమర్పించాలని కమిషన్ సూచించిందిమానసిక ఆరోగ్యంవెట్టి చాకిరీఆహారంభద్రతా హక్కు సహా వివిధ అంశాలకు సంబంధించి కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని స్పష్టం చేసిందికమిషన్ సిఫారసులను పూర్తిగా పాటిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారు.

అనంతరం.. పౌర ప్రతినిధులుమానవ హక్కుల కార్యకర్త (హెచ్ఆర్‌డీ)లతో కమిషన్ సమావేశం నిర్వహించిందిమానవ హక్కుల పరిరక్షణప్రోత్సాహం కోసం ఎస్‌హెచ్ఆర్సీలుపౌర ప్రతినిధులతో కలసి పనిచేయడంపై తమకు విశ్వాసం ఉందని కమిషన్ పునరుద్ఘాటించిందివయోధికులుదివ్యాంగులుమంచానికే పరిమితమైన రోగులుతదితరులకు సంబంధించిన సమస్యలను ఎన్జీవో ప్రతినిధులుహెచ్‌ఆర్డీలు తెలియజేశారుసంరక్షులకు తోడ్పాటు ఇచ్చేలా తీవ్రమైన వైకల్యంతో ఇబ్బంది పడుతున్న దివ్యాంగజనులకు ఆర్థిక సాయం అందించాలని కోరారుగుర్తింపు ధ్రువపత్రాలను పొందడంలో పేద చిన్నారులకు ఎదురవుతున్న సమస్యలను వారు వివరించారురాష్ట్రంలో వారు చేస్తున్న కార్యక్రమాలను కమిషన్ ప్రశంసించిందిఎలాంటి భయంపక్షపాతం లేకుండా పనిని కొనసాగించాలని ప్రోత్సహించింది.

జాతీయ మానవ హక్కుల కమిషన్‌తో ఎన్జీవోలుహెచ్ఆర్డీల భాగస్వామ్యం దేశంలో మానవ హక్కులను బలోపేతం చేయడానికి తోడ్పడుతుందన్న ఎన్‌హెచ్ఆర్సీ ఛైర్‌పర్సన్ జస్టిస్ వీ రామసుబ్రమణియన్ పరిశీలనతో సమావేశం ముగిసిందిమానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి hrcnet.nic.in ద్వారా ఆన్ లైనులో ఫిర్యాదులను నమోదు చేయవచ్చని వారికి తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ అన్ని సమావేశాల్లోనూ పాల్గొన్నారు.

అనంతరంతెలంగాణలోని హైదరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ విచారణశిబిరం ఫలితాలను విలేకరులకు వివరించారు.

 

***


(Release ID: 2150091)
Read this release in: English , Urdu , Hindi