నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సాగర్‌మాల‌లో భాగంగా రైలు-రోడ్డు మార్గాల అనుసంధానం

Posted On: 29 JUL 2025 1:39PM by PIB Hyderabad

సాగర్‌మాల కార్యక్రమంలో భాగంగా 272 రోడ్డురైలు అనుసంధాన ప్రాజెక్టులను గుర్తించారువీటిని రోడ్డురవాణాహైవేల శాఖరైల్వేల మంత్రిత్వ శాఖప్రధాన ఓడరేవులునిర్దిష్ట ప్రాంతంలో ఫలానా వ్యాపారాన్ని నిర్వహించడానికి ప్రభుత్వ అనుమతిని పొందిన సంస్థలు (కన్సెషనేర్లువంటి ఏజెన్సీలు అమలు చేస్తున్నాయిమొత్తం 272 ప్రాజెక్టుల్లో 74 ప్రాజెక్టులు పూర్తి కాగా, 67 ప్రాజెక్టుల పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. 131 ప్రాజెక్టులు రూపకల్పన దశలో ఉన్నాయి.

సాగర్‌మాలను ఆరంభించినప్పడే సమగ్ర విధాన మార్గదర్శనంఉన్నత స్థాయి సమన్వయం కోసం ఉన్నత స్థాయిలో నేషనల్ సాగర్‌మాల ఎపెక్స్ కమిటీని ఏర్పాటు చేశారుఈ  కమిటీ ప్రణాళికతో పాటు ప్రాజెక్టుల అమలుకు సంబంధించిన అంశాలను సమీక్షిస్తుందికేంద్ర ప్రభుత్వ విభాగాలుమంత్రిత్వ శాఖలురాష్ట్ర ప్రభుత్వాలుఇంకా వివిధ ఆసక్తిదారుల మధ్య సమన్వయాన్ని ఏర్పరచడానికి మ్యారిటైం స్టేట్స్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎంఎస్‌డీసీసమావేశాలను మంత్రిత్వ శాఖ తరచుగా నిర్వహిస్తోంది.

సాగర్‌మాల కార్యక్రమంలో భాగంగా, 839 ప్రాజెక్టులను గుర్తించారుఈ  ప్రాజెక్టులను దాదాపు రూ.5.79 లక్షల కోట్ల అంచనా వ్యయంతో అమలు చేయాలని సంకల్పించారువీటిలో 119 ప్రాజెక్టులను రూ.2.42 లక్షల కోట్ల మొత్తం ప్రాజెక్టు వ్యయంతో ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యం (పీపీపీపద్ధతిలో అమలు చేస్తున్నారుమిగతా  ప్రాజెక్టులను ప్రభుత్వమే నేరుగా అందించే డబ్బుతో ఈపీసీ పద్ధతిలో చేపడుతున్నారు.

సాగర్‌మాల పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ప్రాజెక్టుల విషయంలోఆయా ప్రాజెక్టులను మరింత వేగంగా అమలు చేయడానికీనిధులను నిజాయతీతో సరి అయిన పద్ధతిలో నియమాల ప్రకారం ఖర్చుచేయడానికీ సంబంధించిన సాగర్‌మాల ఆర్థిక సహాయ మార్గదర్శక సూత్రాలను ఓడరేవులునౌకాయానంజలరవాణా మంత్రిత్వ శాఖ సవరించింది.

ఈ సమాచారాన్ని కేంద్ర ఓడరేవులునౌకాయానంజలరవాణా శాఖ మంత్రి శ్రీ సర్బానంద సొనోవాల్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలియజేశారు.‌

 

***


(Release ID: 2149797) Visitor Counter : 8