మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రొయ్యల పెంపకం, నిర్వహణ రంగంలో డ్రోన్ టెక్నాలజీ

Posted On: 23 JUL 2025 4:22PM by PIB Hyderabad

భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసర్చ్.. ఐసీఏఆర్అధీనంలో పనిచేస్తున్న మత్స్య పరిశోధన సంస్థలు డ్రోన్లకు సంబంధించిన పరిశోధనపై దృష్టి సారిస్తున్నాయిచెరువులుచేరుకోవడానికి వీలుండని ప్రాంతాల నుంచి విశ్లేషణ కోసం నీటి నమూనాలను సేకరించడానికీమేతమందుల పంపిణీబయోమాస్ అంచనాకూఆరోగ్య పర్యవేక్షణతో పాటు ఇతర కార్యకలాపాల్లోనూ డ్రోన్లను ఉపయోగించడం ప్రారంభించారువీటికి అదనంగా, ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన’ (పీఎంఎంఎస్‌వై)లో భాగంగా 70 కిలోల బరువును మోసే డ్రోన్ల సాయంతో చేపలనురొయ్యలను చెరువుల నుంచి మార్కెట్ వరకూ రవాణా చేయడానికి ఉద్దేశించిన ఒక నమూనా డ్రోన్‌ కు ఐసీఏఆర్‌ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇన్‌ల్యాండ్ ఫిషరీస్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐసీఏఆర్-సీఐఎఫ్ఆర్ఐరూపకల్పన చేస్తోంది.

చేపలురొయ్యల పెంపకం (ఆక్వాకల్చర్రంగంలో డ్రోన్ సాంకేతికతను ప్రవేశపెట్టడానికి విధివిధానాలను రూపొందించడం కోసం ఒక సాంకేతిక కమిటీని మత్స్య విభాగం ఏర్పాటు చేసింది.

నవకల్పనలునూతన ఆవిష్కరణలతో ముడిపడిన ప్రాజెక్టులుసంబంధిత కార్యకలాపాలుఅంకుర సంస్థలుఇంక్యుబేటర్లుప్రయోగాత్మక ప్రాజెక్టులు సహా సాంకేతికత ప్రదర్శన.. పీఎంఎంఎస్‌వైలోని సెంట్రల్ సెక్టర్ స్కీమ్ పరిధిలో చేపట్టే కార్యకలాపాల్లో భాగంగా ఉన్నాయివీటిలో మత్స్య పరిశ్రమచేపలురొయ్యల పెంపకంలో డ్రోన్ టెక్నాలజీని వినియోగించడాన్ని ప్రోత్సహించడానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తారుపర్యవేక్షణసరుకు మూల్యాంకనంపర్యావరణ సంబంధిత పర్యవేక్షణవ్యాధుల గుర్తింపురొయ్యల ఫారాలతో సహా చేపలురొయ్యల సాగుకు యంత్రాల సాయంతో మేత ఇవ్వడంనీటి నమూనాల సేకరణఖచ్చితత్వం ప్రాతిపదికన చేపలు పట్టడం వంటి ముఖ్య కార్యకలాపాలు మత్స్యపాలన రంగంలో చోటుచేసుకొన్న సాంకేతిక ప్రగతిని సూచిస్తున్నాయివీటిని పీఎంఎంఎస్‌వైకి చెందిన కేంద్ర రంగ పథకాల పరిధిలోకి చేర్చే వీలుంది.

ఈ సమాచారాన్ని కేంద్ర మత్స్యపశుసంవర్ధకపాడిపరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ జార్జ్ కురియన్ రాజ్యసభలో ఈ రోజు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.‌

 

***


(Release ID: 2147581)
Read this release in: English , Urdu , Hindi