ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సామర్థ్యం.. ఆర్థిక శక్తి లక్ష్యంగా ‘ఒక రాష్ట్రం-ఒక ఆర్‌ఆర్‌బీ’ విధానం కింద

ప్రభుత్వం చేపట్టిన ఏకీకరణ ప్రక్రియతో 196 నుంచి 28కి తగ్గిన ‘ఆర్‌ఆర్‌బీ’ల సంఖ్య

విలీనంతో సేవల్లో నాణ్యత, ఖర్చుల్లో తగ్గుదల... సాంకేతిక వినియోగానికీ అవకాశం....ఆర్‌ఆర్‌బీ’ల లాభదాయకత పెరిగి నష్టాలు తగ్గుతాయి: ఆర్బీఐ నివేదిక

ఆర్‌ఆర్‌బీ’ల విలీనంతో లాభదాయకత.. ఆర్థికశక్తి ఇనుమడిస్తాయన్న నాబార్డ్‌ అధ్యయనం

Posted On: 21 JUL 2025 6:38PM by PIB Hyderabad

దేశంలోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఆర్‌ఆర్‌బీనిర్వహణ సామర్థ్యం మెరుగుదలఆర్థిక వ్యవస్థల సద్వినియోగం దిశగా కేంద్ర ప్రభుత్వం 2005-06లో ఆర్‌ఆర్‌బీ’ల సమూల విలీనానికి శ్రీకారం చుట్టిందిఈ ఏకీకరణ తొలిదశ (ఫేజ్‌-I, 2005-2010)లో ఒక రాష్ట్రంలోని ఒకే ప్రాయోజిత బ్యాంకు పరిధిలోగల ‘ఆర్‌ఆర్‌బీ’ల విలీనం ద్వారా వాటి సంఖ్యను 196 నుంచి  82కు తగ్గించిందిఅటుపైన రెండో దశ (ఫేజ్‌-II, 2012-14)లో భౌగోళికంగా అనుబంధ కార్యకలాపాల ప్రాంతాలుగల రాష్ట్రంలోని ప్రాయోజిత బ్యాంకుల పరిధిలో ‘ఆర్‌ఆర్‌బీ’ విలీనంతో వాటి సంఖ్య 82 నుంచి 56కు తగ్గిందిఅనంతరం మూడో దశ (ఫేజ్‌-III) కింద 2019లో బలహీన ఆర్‌ఆర్‌బీ’ని బలమైనదానితో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించిందిదీంతో 2021 మార్చి ఆఖరుకల్లా ‘ఆర్‌ఆర్‌బీ’ల సంఖ్య 56 నుంచి 43కు తగ్గింది.

ఈ మూడు దశల విలీనం పూర్తయ్యాక వాటి ఆర్థిక సామర్థ్యంపై దీని ప్రభావం గురించి 2021లోనే నాబార్డ్‌ ఒక అధ్యయనం నిర్వహించిందివిలీనం ఫలితంగా ‘ఆర్‌ఆర్‌బీ’ల లాభదాయకత మెరుగుపడిందనిఅది ఆర్థిక సామర్థ్యం పెరుగుదలకు తోడ్పడిందని పేర్కొందిఈ అధ్యయన ఫలితాలను బ్యాంకింగ్‌ ధోరణులు-పురోగమనంపై నివేదిక (2020-2021)” రూపంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐఅధికారికంగా ప్రచురించింది.

విలీనంలోని వివిధ దశలలో లాభదాయకసుస్థిర గిట్టుబాటుగల ‘ఆర్‌ఆర్‌బీ’ల వాటా మెరుగుదల కొనసాగిందని అధ్యయన నివేదిక పేర్కొందిఅలాగే మొత్తం ఆస్తుల నిష్పత్తి కోణంలో పేరుకున్న నష్టాల పరిమాణం కూడా తగ్గిందని వెల్లడించిందివిలీనం అనంతరం మెరుగుపడిన ‘ఆర్‌ఆర్‌బీ’ల లాభదాయకతబలహీన బ్యాంకులకు మూలధన తోడ్పాటుతో కలిపివాటి పరపతి నిష్పత్తి సహా మూలధన నిష్పత్తి రీత్యా నగదు నిల్వలు పెరిగాయని వివరించింది.

ఒక రాష్ట్రం-ఒక ఆర్‌ఆర్‌బీ’ సూత్రం నిర్దేశంతో ప్రభుత్వం ఆర్‌ఆర్‌బీ’ల నాలుగో దశ (ఫేజ్‌-IV) విలీనాన్ని కొనసాగించిందిద్వారా భారీ పరిమాణ సామర్థ్యంవ్య-హేతుబద్ధీకరణల ప్రయోజనాలను సాధించడానికి దేశంలోని 26 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 43 ‘ఆర్‌ఆర్‌బీ' సంఖ్యను 01.05.2025 నుంచి 28కి తగ్గిస్తున్నట్లు 05.04.2025 అధికార ప్రకటన జారీచేసింది.

ఈ విలీన ప్రక్రియ ఫలితంగా రాష్ట్రస్థాయి ఆర్‌ఆర్‌బీ’కి ఒక నిర్దిష్ట స్వరూపం వచ్చిందిదీనివల్ల నిర్వహణ సరళం కావడంతోపాటు సేవా ప్రదాన సౌలభ్యం మెరుగుపడిందిప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు తమ మూలధన పునాదిని పటిష్ఠం చేసుకున్నాయివిలీన సంస్థ ఆర్థిక స్థిరత్వంపునరుత్థాన శక్తిని పెంచుకుందివిలీనంవల్ల కార్యకలాపాల ఏకీకరణవేర్వేరు నిర్వహణ వ్యయం కలిసిరావడం ద్వారా ఖర్చు ఆదా అవుతుందని భావిస్తున్నారుఅంతేకాకుండా విలీన ఆర్‌ఆర్‌బీ’లు త్యాధునిక సాంకేతిక వేదికలలో పెట్టబడి పెట్టివాటిని సద్వినియోగం చేసుకోవచ్చుతద్వారా నిర్వహణ సామర్థ్యంవినియోగదారుల సేవలు మెరుగుపడే వీలుంటుంది.

ఒక రాష్ట్రం-ఒక ఆర్‌ఆర్‌బీ’ సూత్రం నిర్దేశిత ‘ఆర్‌ఆర్‌బీ’ల విలీనం ప్రక్రియను 30.04.2025 నాటికి తనిఖీ పూర్తయిన ఆర్థికాంశాల ప్రాతిపదికన చేపట్టారుఆ మేరకు విలీనం 01.05.2025 నుంచి అమలులోకి వచ్చిందిఈ ప్రక్రియ రిశీలనపర్యవేక్షణకు కేంద్ర  ప్రభుత్వం రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీ (ఎస్‌ఎల్‌ఎంసీ)తోపాటు జాతీయ స్థాయి ప్రాజెక్ట్ పర్యవేక్షణ యూనిట్ (ఎన్‌ఎల్‌పీఎంయూ)ను ఏర్పాటు చేసింది.

ఈ నేపథ్యంలో వివరణాత్మక మార్గదర్శాకాలతో నాబార్డ్ జాతీయ స్థాయి ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్‌ఓపీ) జారీ చేసిందిఇది ప్రతి ప్రధాన/విలీన ‘ఆర్‌ఆర్‌బీ’లో సమన్వయ విధానాలుకార్యాచరణ మార్గదర్శకాల ఖరారుతోపాటురోజువారీ సమీకృత ప్రణాళిక అమలకు విలీన ప్రాజెక్ట్ నిర్వహణ యూనిట్ (ఏపీఎంయూ), సారథ్య సంఘం (స్టీరింగ్ కమిటీ), నిర్వాహక కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని నాబార్డ్‌ అందులో సూచించింది.

విలీనంపై కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ప్రకటన ఇతరత్రా అంశాలతోపాటు ప్రస్తుత ఆర్‌ఆర్‌బీ’ ఉద్యోగుల వేతనంఉద్యోగ హోదాకు రక్షణనిస్తుందిఅధికారులుఉద్యోగుల సీనియారిటీని నాబార్డ్ జారీ చేసిన ఎస్‌ఓపీ’ నిర్దేశిస్తుందిగ్రామీణ వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం శాఖల స్థాయిలో (ప్రసార-ప్రచురణ మీడియాసంక్షిప్త సందేశం (ఎస్సెమ్మెస్‌అవగాహన సమావేశాలు వగైరావివిధ సమాచార ప్రదాన మార్గాల్లో విలీనంపై గువిధంగా ప్రచారం చేయాల్సి ఉంటుందిఈ మేరకు ‘ఎన్‌ఎల్‌పీఎంయూఅన్ని ఆర్‌ఆర్‌బీ'కు  సూచించిందిఅంతేగాక వినియోగదారుల ఫిర్యాదు పరిష్కారం కోసం కాల్ సెంటర్ల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆర్‌ఆర్‌బీ’లకు సలహా ఇచ్చిందినాబార్డ్‌ నిర్దేశాల మేరకు ప్రస్తుతం అన్ని శాఖలూ కొత్త సంస్థల కింద పనిచేస్తూబ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా చూస్తున్నాయిదీంతో వినియోగదారుల ఖాతాలుడిపాజిట్లురుణాల బదిలీ వంటి వ్యవహారాలు పెద్దగా అంతరాయాలేవీ లేకుండా సాగిపోతోంది.

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.

 

***


(Release ID: 2146644)
Read this release in: English , Urdu