గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్- డీఎంఎఫ్ ను ప్రారంభించిన గనుల మంత్రిత్వశాఖ


సమగ్ర, క్షేత్రస్థాయి అభివృద్ధి దిశగా కొత్త అడుగు: గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి


ఢిల్లీలోని హ్యాండ్లూమ్ హాట్ వద్ద డీఎంఎఫ్ ప్రదర్శనను కూడా ప్రారంభించిన శ్రీ కిషన్ రెడ్డి

Posted On: 09 JUL 2025 6:20PM by PIB Hyderabad

డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (డీఎంఎఫ్) కార్యక్రమాలను ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమం (ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్  ప్రోగ్రామ్ -ఎడిపి),  ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ (ఎబిపిలతో సమన్వయం చేయడానికి రూపొందించిన 'ఆస్పిరేషనల్ డిఎంఎఫ్ ప్రోగ్రామ్ కార్యాచరణ మార్గదర్శకాలను కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఈ రోజు విడుదల చేశారుదేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో సామాజికఆర్థిక సూచీలను మెరుగుపరిచేందుకు ఎడిపిఎబిపి కింద గుర్తించిన అభివృద్ధి ప్రాధాన్యాలతో జిల్లా ఖనిజ ఫౌండేషన్  ప్రణాళికఅమలు ప్రక్రియలను వ్యూహాత్మకంగా అనుసంధానం చేయడానికి ఈ మార్గదర్శకాలను రూపొందించారున్యూఢిల్లీలో జరిగిన జాతీయ డీఎంఎఫ్ వర్క్‌షాప్ లో కేంద్రమంత్రి వీటిని విడుదల చేశారు

 

కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జికిషన్ రెడ్డిఆ శాఖ సహాయ మంత్రి శ్రీ సతీశ్ చంద్ర దూబే ప్రారంభించిన ఈ వర్క్‌షాప్‌ లో గనుల మంత్రిత్వ శాఖఇతర సంబంధిత శాఖల ఉన్నతాధికారులుడీఎంఎఫ్ జిల్లాల ప్రతినిధులురాష్ట్ర డీఎంఎఫ్ నోడల్ అధికారులుఇతర శాఖల అధికారులు పాల్గొన్నారుమొత్తం 152 జిల్లా ఖనిజ ఫౌండేషన్‌లు ఈ కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించాయి. 62 జిల్లాల కలెక్టర్లు కూడా ఈ వర్క్‌షాప్‌కు హాజరయ్యారు.

గత దశాబ్దంలో ఆరోగ్యంవిద్యపోషకాహారంమౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చడం ద్వారా గనుల ప్రభావిత ప్రాంతాలలో ప్రజల జీవితాలను మార్చడంలో డిఎంఎఫ్ లు కీలక పాత్ర పోషించాయని కేంద్రమంత్రి శ్రీ కిషన్ రెడ్డి తన ప్రారంభోపన్యాసంలో అన్నారుప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశిస్తున్న సహకార సమాఖ్య విధానానికిప్రభుత్వ సమగ్ర విధానానికి డీఎంఎఫ్ లు నిజమైన ఉదాహరణలని ఆయన అన్నారునిర్మాణాత్మకసమాజ ప్రాధాన్యతా కార్యకలాపాలపైనాఅందుబాటులో ఉన్న నిధులను 100 శాతం వినియోగించడంపై దృష్టి సారించి గనుల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మార్పును తీసుకురావడానికి డీఎంఎఫ్ ను ఒక పెద్ద కార్యక్రమంగా పరిగణించాలని జిల్లా కలెక్టర్లుజిల్లా నోడల్ అధికారులురాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రమంత్రి కోరారుజాతీయ పురోగతిలో ఖనిజాల ప్రాముఖ్యాన్ని వివరిస్తూదేశంలోని ప్రతి మూలకు అభివృద్ధి ఫలాలను అందించాలన్న ప్రధానమంత్రి వికసితఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా గనుల మంత్రిత్వశాఖ పూర్తి సమన్వయంతో పనిచేస్తోందని ఆయన తెలిపారు.

 

బొగ్గుగనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే మాట్లాడుతూ...  జిల్లా మినరల్ ఫౌండేషన్ కేవలం ఒక నిధి మాత్రమే కాదనిఖనిజ సంపద ప్రయోజనాలు చివరి మైలు వరకు చేరేలా చూడటానికి ఒక శక్తిమంతమైన సాధనమని అన్నారుఆరోగ్య సంరక్షణ మొదలుకొని విద్య వరకుజీవనోపాధి నుంచి నైపుణ్యం వరకు  డీఎంఎఫ్ దేశంలో గనులు ఉన్న జిల్లాల్లో మార్పును వేగవంతం చేస్తోందని ఆయన పేర్కొన్నారు.  సమ్మిళితసాధికారస్వావలంబన భారత్ నిర్మాణంలో డిఎంఎఫ్ ను కీలక సాధనంగా ఉపయోగించడానికి గనుల మంత్రిత్వశాఖ కట్టుబడి ఉందని శ్రీ దూబే స్పష్టం చేశారు.
 

 

 

ఈ వర్క్ షాప్ లో డీఎంఎఫ్ కార్యకలాపాలను బలోపేతం చేయడంలో మంత్రిత్వ శాఖ నిబద్ధతను చాటిచెప్పేఅనేక ప్రభావవంతమైన సెషన్లు,  ప్రజంటేషన్ లు నిర్వహించారుడీఎంఎఫ్ కార్యక్రమాల అమలులో పారదర్శకతసృజనాత్మకతసమన్వయం ఆవశ్యకతపై పలువురు ప్రముఖులు ప్రసంగించారుడీఎంఎఫ్ లకు నాయకత్వం వహిస్తున్న జిల్లా మేజిస్ట్రేట్ లుకలెక్టర్లతో కూడిన నాలుగు బృందాలు ఈ వర్క్‌షాప్‌లో సంబంధిత అంశాలపై ప్రజెంటేషన్లు ఇచ్చారుడీఎంఎఫ్ పారదర్శకతవినూత్న పద్ధతులుఅమలులో సవాళ్లుసామర్థ్య పెంపు వంటి కీలక అంశాలపై వారు విలువైన ఆలోచనలు,సూచనలు అందించారుకంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్ప్రతినిధులు ఆడిట్ పద్ధతులుజవాబుదారీ యంత్రాంగాలపై ఆలోచనలను పంచుకున్నారుపటిష్టమైన పర్యవేక్షణ అవసరాన్ని స్పష్టం చేశారు

ఈ కార్యక్రమంలో కాఫీ టేబుల్ బుక్ 2.0 ఆవిష్కరణ మరో ప్రత్యేకాంశంగా నిలిచిందిదేశమంతటా డీఎంఎఫ్ ల నిధులతో అమలు చేస్తున్న ప్రాజెక్టులను గురించి ఇందులో వివరించారుగనుల ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఈ ప్రాజెక్టుల ద్వారా లభిస్తున్న స్పష్టమైన ప్రయోజనాలను ఇది ప్రతిబింబిస్తుంది.

సవరించిన పీఎంకేకేవై 2024 మార్గదర్శకాలను డీఎంఎఫ్ నిబంధనల్లో చేర్చినందుకు జార్ఖండ్మహారాష్ట్రఒడిశాగుజరాత్హిమాచల్ ప్రదేశ్రాజస్థాన్గోవా రాష్ట్రాలను ఈసందర్భంగా సన్మానించారుఅలాగేవార్షిక ఆడిట్ నివేదికలను మరింత పారదర్శకతజవాబుదారీతనంతో సకాలంలో పూర్తిచేయడంలో మంచి పనితీరు కనబరచినందుకు తమిళనాడుకర్ణాటకఉత్తరాఖండ్గుజరాత్చత్తీస్ ఘడ్ రాష్ట్రాలను ప్రశంసించారు.

పీఎంకేకేవై 2024  మార్గదర్శకాలను డీఎంఎఫ్ లలో కేంద్రీకృతంగా అమలు చేసేలా అన్ని జిల్లాలురాష్ట్రాలకు కార్యాచరణ ప్రణాళికను అందిస్తూ వర్క్ షాప్ ముగిసింది.

అంతకుముందు శ్రీ కిషన్ రెడ్డి హ్యాండ్లూమ్ హాట్ (జన్‌పథ్వద్ద డీఎంఎఫ్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారుసహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబేగనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విఎల్ కాంతారావుతో కలిసి శ్రీ కిషన్ రెడ్డి ఎగ్జిబిషన్ లోని స్టాళ్లను సందర్శించిస్వయం సహాయక సంఘాల సభ్యులతో మాట్లాడారుడీఎంఎఫ్ నిధులతో తయారైన ఉత్పత్తులు,  ఉపాధి కార్యకలాపాలను ప్రదర్శించే ఈ ఎగ్జిబిషన్ ఈనెల 15 వరకు కొనసాగుతుందిగనుల ప్రభావిత ప్రాంతాలకు చెందిన స్వయంసహాయ బృందాలకు తమ ప్రతిభను ప్రదర్శించడానికిప్రజలతో మమేకం కావడానికి ఇది ఒక వేదికను అందిస్తుంది

 

మైనింగ్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సమగ్రమైనస్థిరమైనప్రభావవంతమైన అభివృద్ధి లభించేలా డీఎంఎఫ్ చర్యలను  జాతీయ అభివృద్ధి ప్రాధాన్యాలతో సమన్వయం చేయాలన్న ఖనిజ మంత్రిత్వ శాఖ నిబద్ధతను ఈ వర్క్ షాప్,  ఎగ్జిబిషన్ పునరుద్ఘాటించాయి.

 

***


(Release ID: 2143591)
Read this release in: English , Urdu , Hindi