గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వచ్ఛ ఇంధన మౌలిక వసతులను బలోపేతం చేసే దిశగా


కాపర్ విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసిన కేంద్ర మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి

Posted On: 04 JUL 2025 3:56PM by PIB Hyderabad

ది వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ కి చెందిన ఇండియన్ నేషనల్ కమిటీ ఈ రోజు హైదరాబాద్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి కాపర్ విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశారుఉత్తమమైన గనుల మూసివేత పద్ధతుల ద్వారా సుస్థిరమైనబాధ్యతాయుతమైన మైనింగ్ అనే అంశంపై ఈ సదస్సు జరిగింది.

భారత ఇంధన రంగంలో వస్తున్న మార్పులుమౌలిక వసతుల వృద్ధివిద్యుత్ వాహనాలుసోలార్ విద్యుత్ లాంటి హరిత సాంకేతికతల్లో రాగి అందిస్తున్న సహకారాన్ని శ్రీ కిషన్ రెడ్డి వివరించారుముడి వనరుల భద్రతకు హామీ ఇస్తూనే దేశీయంగా పెరుగుతున్న గిరాకీని తీర్చేందుకు అవసరమైన దీర్ఘాకాలిక వ్యూహాన్ని ఈ విజన్ డాక్యుమెంట్ అందిస్తుందని ఆయన అన్నారుహిందూస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్), హిందాల్కో ఇండస్ట్రీస్కచ్ కాపర్వేదాంతఇండో-ఆసియా కాపర్లోహమ్ తదితర సంస్థలతో పాటుగాఇండియన్ ప్రైమరీ కాపర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐపీసీపీఏ), ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ (ఐసీఏలాంటి పరిశ్రమ సంఘాలతో విస్తృతంగా చర్చించిన అనంతరం ఈ డాక్యుమెంట్‌ను తయారు చేశారు.

2047 నాటికి ఆరు రెట్లు డిమాండ్‌ పెరుగుతుందని కాపర్ విజన్ డాక్యుమెంట్ అంచనా వేస్తోందిఅలాగే 2030 నాటికి ద్రవీకరణశుద్ది చేసే సామర్థ్యం ఏడాదికి మిలియన్ టన్నుల మేర పెంచే ప్రణాళికను అందిస్తుందిఅంతర్జాతీయ భాగస్వామ్యాలతో విదేశాల్లోని ఖనిజ వనరులను పొందడం ద్వారా రెండో దశ శుద్ధిని పెంపొందించడందేశీయంగా పునర్వినియోగాన్ని ప్రోత్సహించడంబహిరంగ మార్కెట్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంపై దృష్టి సారిస్తుంది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వికసిత్ భారత్ 2047 దార్శనికతకు అనుగుణంగా దేశం కోసం సుస్థిరమైనచురుకైనభవిష్యత్తు అవసరాలకు తగిన రాగి వ్యవస్థను తయారుచేసే దిశగా వేసిన ముందడుగే ఈ కాపర్ విజన్ డాక్యుమెంట్.

 

***


(Release ID: 2142281) Visitor Counter : 2
Read this release in: English , Urdu , Hindi , Tamil