హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తెలంగాణలోని నిజామాబాద్‌లో జరిగిన కిసాన్ మహా సమ్మేళన్‌లో ముఖ్య అతిథిగా ప్రసంగించిన కేంద్ర హోం వ్యవహారాలు, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


* పసుపు బోర్డు ఏర్పాటు చేసి నిజామాబాద్ రైతుల నాలుగు దశాబ్దాల డిమాండును నెరవేర్చిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

* మోదీ ఎల్లప్పుడూ తన వాగ్దానాలను నిలబెట్టుకుంటారు

* బోర్డు ఏర్పాటుతో పసుపు వాణిజ్యానికి అంతర్జాతీయ కేంద్రంగా మారనున్న నిజామాబాద్: ఎఫ్‌పీవోలు, రైతులకు సాధికారత

* మోదీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వమే తెలంగాణను అభివృద్ధి చేయగలదు

* భారత్‌ను ప్రశాంతంగా నిద్రపోనివ్వమని చెప్పినవారి ప్రధాన స్థావరాలను మోదీ నేలమట్టం చేశారు

* పాకిస్థాన్ ప్రస్తుత స్థితిని చూస్తే ఆపరేషన్ సిందూర్‌ను ప్రశ్నిస్తున్నవారికి సమాధానం దొరుకుతుంది

* ఇప్పటికీ.. తెలంగాణలో నక్సలైట్లను రక్షించడానికి, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి

* 2026, మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తాం

Posted On: 29 JUN 2025 10:30PM by PIB Hyderabad

కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నిజామాబాద్‌లో జరిగిన కిసాన్ మహా సమ్మేళన్‌లో ప్రసంగించారుఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డికేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారుఅంతకు ముందునిజామాబాద్‌‌కు చెందిన ప్రముఖ నాయకుడు డిశ్రీనివాస్ విగ్రహాన్ని కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఆవిష్కరించినివాళులు అర్పించారు.

జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని 2023లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారని తెలిపారుఅలాగే నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా పసుపు రైతుల నాలుగు దశాబ్దాల డిమాండును సైతం నెరవేర్చారని పేర్కొన్నారుమోదీ తాను ఇచ్చిన వాగ్ధానాలను ఎల్లప్పుడూ నిలబెట్టుకుంటారని స్పష్టం చేశారు.

జాతీయ పసుపు బోర్డు ప్రారంభంతో నిజామాబాద్ పసుపు అంతర్జాతీయ మార్కెట్లకు చేరుకుంటుందని శ్రీ అమిత్ షా అన్నారుపసుపు ధరలు తరచూ తగ్గుతూ ఉంటాయనికానీ దాని ధర ఎప్పటికీ తగ్గని రోజు వస్తుందని ఆయన చెప్పారుపసుపు ఔషధ గుణాలను బోర్డు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తుందని తెలియజేశారుపసుపు వాణిజ్యంలో నిజామాబాద్‌ను అంతర్జాతీయ కేంద్రంగా మారుస్తుందని వివరించారుఅలాగే రైతు ఉత్పత్తి సంఘాలు (ఎఫ్‌పీవోలు), రైతులకు సాధికారత కల్పిస్తుందని పేర్కొన్నారు.

నేషనల్ ఎక్స్‌పోర్ట్ కోపరేటివ్ లిమిటెడ్నేషనల్ కోపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కేంద్ర హోంసహకార మంత్రి శ్రీ అమిత్ షా అన్నారుఈ రెండు జాతీయ సహకార సంస్థల శాఖలను నిజామాబాద్‌లో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారుపసుపు ప్యాకేజింగ్మార్కెటింగ్ఎగుమతులకు సంబంధించిన సమగ్ర వ్యవస్థను త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారుఆర్గానిక్ పసుపునకు అమెరికాయూరోపియన్ యూనియన్కెనడాయూకేవియత్నాంస్విట్జర్లాండ్ఆస్ట్రేలియా తదితర దేశాల్లో డిమాండు ఎక్కువగా ఉందని ఆయన వెల్లడించారుఈ దేశాలకు ఆర్గానిక్ పసుపు రైతులు పండించిన ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు ప్రయత్నాలు చేపడుతున్నామని తెలిపారు.

2014లో శ్రీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జాతీయ భద్రతను బలోపేతం చేయడం ప్రారంభించారని శ్రీ అమిత్ షా వెల్లడించారుగత ప్రభుత్వ పదేళ్ల పాలనలో పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు తరచూ దాడి చేసిసునాయాసంగా తప్పించుకునేవారని గుర్తు చేసుకున్నారుపదేళ్ల మోదీ ప్రభుత్వంలో మూడు సార్లు ప్రధాన ఉగ్రవాద దాడులు జరిగాయిఉరిపుల్వామాపహల్గాంఉరి ఉగ్రదాడి తర్వాత సర్జికల్ స్ట్రయిక్పుల్వామా తర్వాత వైమానిక దాడులుపహల్గాం ఘటన అనంతరం పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలను భారత భద్రతా దళాలు నాశనం చేశాయని ఆయన తెలియజేశారుపహల్గాం దాడి తర్వాత వారికి గుణపాఠం నేర్పాలని ప్రధాని నిర్ణయం తీసుకున్నారుపాకిస్థాన్ నుంచి అణుదాడుల బెదిరింపులుప్రతిపక్షాల నుంచి అనుమానాలు వెల్లువెత్తినప్పటికీ భారత బలగాలు ఒక్క రాత్రిలో పాకిస్థాన్‌లోని ప్రధాన ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయివందలాది ఉగ్రవాదులను హతమార్చాయిఈ అంశంలో ప్రతిపక్ష నేతలు ఇప్పటికీ ప్రశ్నలు లేవనెత్తుతున్నారనిపాకిస్థాన్ ప్రస్తుత పరిస్థితి పరిశీలిస్తే వారికి సమాధానాలు దొరకుతాయని శ్రీ షా అన్నారుభారత్‌లో శాంతికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నవారి ప్రధాన స్థావరాలను ఆపరేషన్ సిందూర్ ద్వారా ధ్వంసం చేసి దేశభద్రతకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

దేశంలో గడచిన నాలుగు దశాబ్దాల్లో వామపక్ష అతివాద ప్రభావం ఉన్న జిల్లాల్లో 40,000 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా వెల్లడించారుఎంతో మంది గిరిజనులు తమ ప్రాణాలను లేదా అవయవాలను పోగొట్టుకున్నారని తెలిపారుఆయుధాలను విడిచిపెట్టి లొంగిపోవాలనిసాధారణ జనజీవన స్రవంతిలో చేరాలని నక్సలైట్లకు విజ్ఞప్తి చేశారుఈశాన్య రాష్ట్రాల్లో 10,000 మంది మిలటెంట్లు తమ ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో చేరారని తెలిపారుఇప్పుడు వారు తాలుకాపంచాయతీజిల్లా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని వెల్లడించారు. 2,000 మంది నక్సలైట్లు కూడా లొంగిపోయారని తెలిపారుఅయితేఇప్పటికీ తమ చేతుల్లో ఆయుధాలు పట్టుకున్నవారితో చర్చలు జరపబోమని తెలిపారు. 2026, మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని ప్రకటించారుతెలంగాణాలో నక్సలైట్లకు మద్దతు తెలుపుతున్నవారు.. వారి వల్ల ప్రాణాలు కోల్పోయిన గిరిజనులుపోలీసులుభద్రతా సిబ్బంది కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారనిగిరిజన ప్రాంతాల్లో ఏళ్ల తరబడి అభివృద్ధి నిలిచిపోవడాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారుతెలంగాణలో పారిపోతున్న నక్సలైట్లకు ప్రతిపక్షం ఆశ్రయం కల్పిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తూ.. 2026 మార్చి 31 నాటికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నక్సలిజంను పారదోలుతుందని హామీ ఇచ్చారు.

రైతులుదళితులుగిరిజనులుమహిళలుయువత సంక్షేమాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటే దాన్ని మోదీ సారథ్యంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మాత్రమే అందించగలదని పేర్కొన్నారురైతుల కోసం ప్రధానమంత్రి మోదీ విస్తృతస్థాయిలో పనిచేశారని వ్యవసాయ బడ్జెట్‌ను రూ.లక్ష కోట్లకు పెంచారన్నారుఅలాగే రైతుల ఖాతాల్లో నెలకు రూ. 6,000 వేస్తున్నామనియూరియాడీఏపీ ధరలు పెరగకుండా నియంత్రిస్తున్నామని తెలియజేశారుగతంలో లేని విధంగా రైతులకు బీమా సౌకర్యం కల్పించామని తెలిపారుపసుపు బోర్డు సైతం ఏర్పాటైందన్నారుదళితులువెనకబడిన తరగతులుగిరిజనులుపేదలుయువతమహిళల సంక్షేమానికి పీఎం మోదీ చేపడుతున్న ప్రయత్నాలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని శ్రీ షా తెలిపారు.

 

***


(Release ID: 2140746)
Read this release in: English , Urdu , Hindi , Tamil